Followers

ఆదిత్య బిజినెస్ స్కూల్ లో "స్టాక్ మార్కెట్" పై సదస్సు

  ఆదిత్య బిజినెస్ స్కూల్ లో "స్టాక్ మార్కెట్"  పై  సదస్సు




  గండేపల్లి పెన్ పవర్

  గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ నందుస్టాక్ మార్కెట్   పై వర్చువల్ మోడ్ లో అవగాహనా సదస్సు  నిర్వహించినట్లు డైరెక్టర్ డా. ఎన్.సుగుణారెడ్డి తెలియజేసారు.ఈ కార్యక్రమంలో షైన్ ప్రాజెక్ట్స్ సంస్థ నిర్వాహకులు "శ్రీహర్ష"గారు  ఆన్ లైన్ ద్వారా విద్యార్థులలో అవగాహనా కల్పించినట్లు ఆమె  తెలియజేసారు. ఈ సందర్భంగా శ్రీ హర్ష ఆన్ లైన్ ద్వారాసదస్సులో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూఅభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ముందువరుసలో ఉందని,అలాగే దేశంలో పెట్టుబడిదారులు అత్యధికులు స్టాక్ మార్కెట్ నందు పెట్టుబడులు పెడుతున్నారని,తద్వారా వారు మెరుగైన లాభాలను పొందుతున్నారని తెలిపారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టె విధానం స్టాక్ మార్కెట్ పై విద్యార్థులకు క్షుణ్ణంగా ప్రయోగాత్మకంగా ఆన్లైన్ ద్వారా  వివరించారు. మనదేశ స్టాక్ మార్కెట్ లో ముఖ్యమైన బి.ఎస్.ఇ,(బొంబాయిస్టాక్ ఎక్స్చేంజి)మరియు ఎన్.ఎస్.ఇ,(నేషనల్ స్టాక్ఎక్స్చేంజి)లలోవాటాదారులు వాటాలను కొనుగోలు మరియు అమ్మకం పద్దతులను గురించి వివరించారు. విద్యార్థులు స్టాక్ మార్కెట్ లో కొనుగోలు(ఇన్వెస్ట్) మరియు అమ్మకం ద్వారా లాభాలు (రిటర్న్స్)ఆర్జించడం ఎలా అనే  విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.డా. సుగునా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా ప్రపంచంలో జరిగే ఇతర విజ్ఞానదాయకమైన వ్యాపారాత్మక అభివృద్ధి పై కూడా ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని అందుకే ఆదిత్య విద్యార్థి సర్వతో ముఖాభివృద్దికి ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. విజ్ఞాదాయకంగా జరిగిన  ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.డి.ఆస్ధాశర్మ, డా. ఎన్.విశాలాక్షి,  ఉపాధ్యాయ సిబ్బంది, బి.బి.ఏ,మరియు ఎం.బి.ఏ విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...