Followers

గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ నూతన పైపులైన్ లను వేయాలి

 గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ నూతన పైపులైన్ లను వేయాలి-బీజేపీ నాయకుల డిమాండ్

రైతులతో కలిసి ఇరిగేషన్ కార్యాలయం ముందు ధర్నా-బీజేపీ నాయకుల ధర్నాకు పోలీస్ ల గట్టి బందోబస్తు



లక్షెట్టిపెట్, పెన్ పవర్

పట్టణంలోని ఇరిగేషన్ కార్యాయం ముందు భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రైతులు గురువారం ధర్నా చేపట్టారు.దండేపల్లి మండలం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ నూతన పైపు లను వేయాలని అదే విధంగా లిఫ్ట్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ ని బ్లాక్లిస్టులో పెట్టాలని డిమాండ్ చేసారు.పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తా నుండి లక్షెట్టిపెట్,దండేపల్లి,హాజీపూర్ మండలాలకు చెందిన సుమారు వంద మంది రైతులు బిజెపి నాయకులు బిజెపి జిల్లా అద్యక్షుడు వెరబెల్లి రఘుణత్ ఆద్వర్యంలో ర్యాలీగా కార్యాలయం వరకు వెల్లి సుమారు రెండు గంటల పాటు కార్యాలయం ముందు బైటాయించి రైతులు లిఫ్టు వల్ల పడుతున్న బాదలను కార్యాలయ సిబ్బందికి తెలిపారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అద్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ లిఫ్టు నిర్మాణం చేపట్టి కనీసం ఆరు ఏండ్లు కూడా కావడం లేదని ప్రతీ ఏటా పైపులు పలిగి రైతులకు నీరు అందకపోవడంతో పాటు పైపులైన్ పలిగి. చుట్టు ప్రక్కల ప్రాంతం రైతుల పంటలు కూడా సర్వ నాషనం అవుతున్నాయన్నారు. గూడెం లిఫ్ట్ ద్వారా మూడు టిఎంసిల నీరు ముపైవేల ఎకరాలకు అదికారులు ఇవ్వాల్సి ఉందని కనీసం ఒక టిఎంసి నీరు కూడా రావడం లేదన్నారు.ఎక్కడో రెండు వందల యాబై కిలోమీటర్ల దూరంలో ఉన్న  హైదరాబాద్ లో ఉన్న కెసిఆర్ ఫాంమ్ హౌజ్ కి నీరు అందుతున్నాయని ఇక్కడ ఉన్న కనీసం పది పదిహేను కిలోమీటర్ల వరకు కూడా సాగు నీరు అందడం లేదని కాంట్రాక్టర్ కెసిఆర్ తో కుమ్మకై ఆయనకు నాణ్యతతో ఉన్న పైపులు వేసారని ఇక్కడ రైతులకు మాత్రం నాణ్యత లేని పైపులు వేసి రైతులను అరి గోసపెడుతున్నారని విమర్శించారు.వెంటనే లిప్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేపట్టిన మేగా ఇంస్ట్రక్చర్ కంపనీ యాజమాన్యం ను బ్లాక్లిస్టులో పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. అదే విధంగా నాణ్యతతో కూడిన మంచి  పైపు లైన్ వేసి చివరి ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సరిపడా నీరువ్వాలని డిమాండ్ చేసారు.లిఫ్టు ద్వారా 24గంటలు నీరు రైతులకు ఇచ్చినప్పటికి కూడా మూడు టిఎంసిల నీరు రైతులకు పట్టదని లిఫ్టు కట్టినప్పటి నుండి ఇప్పటి వరక కనీసం ఒక టిఎంసి నీరు కూడా సరిగ్గా రాలేదన్నారు.పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇరిగేషన్ డీఈ దశరథ్ కు అందజేసారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాద్యక్షుడు  రజినీష్  బిజెపి జిల్లా,రాష్ర్టనాయకులు తిరుపతి,రంగారావు,తమ్మినీడి శ్రీనివాస్,శంకరయ్య లక్షెట్టిపెట్, దండేపల్లి  మండలాల అద్యక్షుడు బొప్పు కిషన్,పట్టణ అద్యక్షుడు హరిగోపాల్ రావు, నాయకులు మదు,చంద్రమౌళి,శివశంకర్, సతీష్,చంద్రయ్యతో పాటు సుమారు వంద మంది రైతులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...