మట్కా స్థావరాలపై కొనసాగుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..
ఇద్దరూ మట్కా నిర్వాహకుల అరెస్టు, టు టౌన్లో కేసు నమోదు..
ఆదిలాబాద్ ,పెన్ పవర్
ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్ కాలనీలో గురువారం మధ్యాహ్నం మట్కా నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం తో టాస్క్ ఫోర్స్ సిఐ ఈ. చంద్రమౌళి ఆధ్వర్యంలో ఎస్ఐ కె విష్ణు ప్రకాష్ తో కలిసి చాకచక్యంగా నలువైపుల నుండి మట్కా స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో సుందరయ్య నగర్ కాలనీకి చెందిన ఇద్దరు మట్కా నిర్వాహకులు లహనే సుధాం (42) .షేక్ ఇర్షాద్ (28) లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మట్కా మట్కా చిట్టిలు రూ 3,420- నగదు స్వాధీనం చేసుకొని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు, ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏఎస్సై ఎస్కే తాజుద్దీన్, హెడ్ కానిస్టేబుళ్లు శోభన్ కుమార్, రమేష్ కుమార్, కానిస్టేబుళ్లు ఠాకూర్ జగన్ సింగ్, సయ్యద్ రహత్, మంగల్ సింగ్, ఎం ఏ కరీం, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment