రాజన్న బిడ్డ షర్మిల గారికి అండగా
ఆదిలాబాద్ , పెన్ పవర్
తెలంగాణ లో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా,స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయసాధనే లక్ష్యంగా దూసుకొస్తున్న రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయ వైయస్ షర్మిలమ్మ ను హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కలిసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టిటిడి ఎల్ ఎ సి మెంబర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి బెజ్జంకి అనీల్ కుమార్ తన పూర్తి మద్దతు తెలిపారు. తుదిశ్వాస వరకు రాజన్న కుటుంబానికి అండగా ఉంటామన్నారు.విద్యార్థి దశలో రాజశేఖరరెడ్డి గారితో, తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డితో జగనన్న సీఎం అయ్యె వరకు చెప్పులు వేసుకోకుండా తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇపుడు షర్మిలమ్మ తో కలిసి నడవబోతున్నారు. తనకు ఆ కుటుంబం పై ఉన్న విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు చాటుతున్నారు.మార్చి నెల చివరి వారంలో జరిగే ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిటిటిడి ఎల్ ఎ సి మెంబర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment