15 నుంచి స్వేరోస్ భీం దీక్షలు ప్రారంభం
అదిలాబాద్, పెన్ పవర్
జ్ఞాన సముపార్జన కోసం స్వేరోస్ ఆధ్వర్యంలో ఈ నెల 15 వ తేదీ నుంచి భీం దీక్షలను చేపట్టనున్నట్లు స్వేరోస్ డిస్ట్రిక్ ప్రెసిడెంట్ పెంటపర్తి ఊశన్న తెలిపారు. గురువారం జైనథ్ మండల కేంద్రంలో భీమ్ దీక్షల వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భీమ్ దీక్షలనేవే జ్ఞాన దీక్షలన్నారు. భీమ్ దీక్షలు కాన్షీరాం జయంతి మార్చి 15 నుంచి భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఏఫ్రిల్ 14 వరకు కొనసాగుతుతాయన్నారు. వ్యక్తి మానసిక వికాసం,ఇంద్రియ నిగ్రహం, జ్ఞాన సముపార్జన,శారీరక దృఢత్వం,ఆర్యోగ్య పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయడమే ఈ దీక్షల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో జైనథ్ మండల స్వేరోస్ ఉపాధ్యక్షుడు గడుగు మహేందర్, జిల్లా స్వేరో సర్కిల్ ప్రధాన కార్యదర్శి ఆశన్న, స్వేరోస్ నాయకులు దాగిరి భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment