Followers

కేశపట్నం, మొలంగుర్, వీణవంక మీదుగా బస్ సౌకర్యం కల్పించాలి

  కేశపట్నం, మొలంగుర్, వీణవంక మీదుగా  బస్ సౌకర్యం కల్పించాలి

 బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్.

కరీంనగర్,  పెన్ పవర్

కరీంనగర్ నుండి జమ్మికుంట వయా కేశపట్నం, మోలంగూర్, వీనవంక ల మీదుగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ ఆర్ఎం శ్రీధర్ , జిల్లా కలెక్టరేట్ పరిపాలనాదికారి లక్ష్మారెడ్డి కి   బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్ వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మానకొండూరు మండలంలోని చెంజర్ల, దుద్దెనపల్లి గ్రామాలకు,  శంకరపట్నం మండలంలోని అన్ని గ్రామాలకు ఆర్డినరీ బస్సు, బస్సు సౌకర్యము లేక ప్రయాణికులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారనీ, అట్టి దారిలో గట్టుదుద్దెనపల్లి ఆంజనేయస్వామి ఆలయం, మొలంగూర్ ఖిల్లా పర్యాటక ప్రాంతంలు ఉన్నవి, తరచూ వెళ్ళే సందర్శకులు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని కరీంనగర్ నుంచి జమ్మికుంట వయా చెంజర్ల, కేశవపట్నం, మొలంగూర్, వీణవంక ల మీదుగా మూడు ఆర్డినరీ బస్సులను ఏర్పాటుచేసి బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా  అట్టి ప్రాంతాలలోని 16 గ్రామాలకు ప్రత్యేక్షంగా, 12 గ్రామాలకు పరోక్షంగా మొత్తం 3 మండలాల ప్రయాణికులకు సౌకర్యం కల్పించిన వరవుతున్నారని బస్ సౌకర్యం కల్పించి అట్టి ప్రాంతాల అభివృద్ధికి దోహదపడగలరాని ఆర్ యం గారిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుబాసి ప్రణీత్, జిల్లా కార్యదర్శి  లేంకల అనిల్, నియోజకవర్గ ఇంచార్జి బోయినపల్లి సాయి చంద్, పట్టణ ఉపాధ్యక్షులు శివ, దళిత నాయకులు బొయిని శ్రీనివాస్, నిరుద్యోగ జాక్ నాయకులు పొత్తూరి శేఖర్, అమ్మిగాల్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...