ఆడపిల్లలకు రక్షణ లేదు
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కరీంనగర్ , పెన్ పవర్తెలంగాణరాష్ట్రం లవ్ జిహాద్ కు అడ్డా గా మారిందని, రాష్ట్రంలో ఆడపిల్లలకు మహిళలకు భద్రత లేకుండా పోయిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ రెడ్డి విమర్శించారు . బైంసా లో మూడు సంవత్సరాల చిన్న పాపపై అత్యాచారం చేసిన నిందితుడు పై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో మహిళల పట్ల టిఆర్ఎస్ పార్టీ తీరును నిరసిస్తూ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయ శ్రీ వేణు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, ఆడపిల్లల కు రక్షణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైందన్నారు. బైంసా లో మూడు సంవత్సరాల చిన్నారి బాలిక పై అత్యాచారం జరిగిన ప్రభుత్వం మొద్దు నిద్ర లో ఉందన్నారు.మైనారిటీ బాలికకు శుభాకాంక్షలు చెప్పిన కేటీఆర్, హిందూ పసిపాపకు జరిగిన దారుణంపై పెదవి విప్పకపోవడం దుర్మార్గమన్నారు.తెలంగాణ రాష్ట్రం.. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లవ్ జిహాద్ కు అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వోటు బ్యాంకు రాజకీయాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని . , బాధితుడికి భరోసా కరువై బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటే.. నిందితులు మాత్రం టిఆర్ఎస్ పాలనలో కాలర్ ఎగర వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు . ఒక ఘటన మరిచిపోకముందే రాష్ట్రంలో మరో ఘటన వెలుగులోకి వస్తుందని.,. తెలంగాణ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడి. విషయాల్లో రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. చోద్యం చూస్తున్నారనిఆయన అన్నారు. భైంసా లో జరిగిన సంఘటనలు సభ్య సమాజానికి మంచిది కాదని, పసి బాలికపై అత్యాచారం వేసిన విషయంలో స్థానికంగా పోలీసులు వ్యవహరించిన తీరు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు నిత్యకృత్యమయ్యాయి అని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల భద్రతపై, ఆడపిల్లల రక్షణ పై సోయి లేకుండా పోయిందని మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మహిళల భద్రత కొరకు తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బైంసాలో అత్యాచారానికి గురైన చిన్నారి పాపకు సరైన న్యాయం చేయాలని, వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నక్క పద్మ ,బండ రమణారెడ్డి,కటకం లోకేష్ ప్రవీణ్ రావు ,మాడుగుల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శులు శిల్ప వేదం గొట్టిముక్కుల ఉమారాణి దండ రమాదేవి చైతన్య సుంకే యశోద అన్నపూర్ణ చంద్రకళ పద్మ ప్రేమలత కన్నాంబ భారతి తిరుమల రేఖ ట్తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment