బాల్య వివాహాల పై అవగాహన
నెన్నెల , పెన్ పవర్
ఈరోజు మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలం గంగారం గ్రామంలో సర్పంచ్ కామెర సుధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల కళా బృందం చే అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ సంతోషం రమాదేవి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. వయస్సు నిండని పిల్లకు పెళ్లిళ్లు చేయకూడదని ఆమె పేర్కొన్నారు. అలా చేస్తే చట్టం దృష్టిలో దోసులవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవడం సర్పంచ్ చీరల సత్యమ్మ మొండయ్య గారు అంగన్వాడీ టీచర్స్ దీపిక రాజవ్వ స్వర్ణలత సైలెన్ టీం మెంబర్ సుజాత నాయకులు కామెర శ్రీనివాస్ ఎస్ బానే ష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment