పనులు నాణ్యత ప్రమాణాలతో చేయాలి
పెన్ పవర్,కరప
గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో చేయాలని ఆ డబ్యూఎస్ ఏఈ పి.ప్రసాద్ అన్నారు. సీసీ డ్రెయిన్ల నిర్మాణపనులను శనివారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించి సూచనలు చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ 10 లక్షలు ఉపాధిహామీ పధకం నిధులు రూ 60 లక్షలు వెరశి రూ 70 లక్షలతో కొత్తపేట, మెరకవీది, బీనీ. ఎస్పీ వీధులలో నాలుగు సీసీ డ్రెయిన్ల నిర్మాణపనులు జరుగుతున్నాయన్నారు. మిగిలిన వీధులలో కూడా సీసీ డ్రెయిన్లు నిర్మించేందుకు నిధులు మంజూరుచేస్తామని రాష్ట్ర వ్యవసాయ. సహకారశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపినట్టు వైఎస్సార్ సీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు మేడికెట్టి సత్తిబాబు చెప్పారు వైఎస్సార్ సీపీ నాయకులు యాళ్ల సుబ్బారావు, సాదే లోహిదాస్కుమార్, నక్కా సత్తిబాబు, పాట్నీడి భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment