Followers

సంచార చలివేంద్రం ప్రారంభం

 సంచార చలివేంద్రం ప్రారంభం

కూకట్ పల్లి,పెన్ పవర్ 

యోగ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమని కూకట్ పల్లి ఏసిపి సురేందర్ రావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్ పల్లీ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని యోగ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఆయుర్వేద విద్యా, ఆహార విద్యా, యోగా నేర్పించడమే కాకుండా సమాజసేవలో భాగంగా ప్రతిరోజు పలు ఆసుపత్రులు తిరుగుతూ ప్రతిరోజు సుమారు ఏడు వందల మందికి పైగా ఆహారం అందజేస్తున్న ప్రముఖ యోగా గురువు జగన్ గురుజిని ఆయన అభినందించారు.జగన్ గురూజీ మాట్లాడుతూ కరోనా సమయంలో అరవై రోజుల పాటు రోజు రెండు వేల మందికి ఆహారం అందజేయడం జరిగిందని, అదే సేవ దృక్పథంతో మూడు నుండి నాలుగు నెలల పాటు బాలానగర్ చౌరస్తా నుండి మియాపూర్ చౌరస్తా వరకు మజ్జిగ, నిమ్మరసం, పళ్ళ రసాల వంటి పానీయాలను రహదారుల వెంబడి సంచరిస్తూ ఉచితంగా అందచేస్తామని, తమ సంస్థ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగుతాయని తెలియజేశారు. కూకట్ పల్లి సిఐ నర్సింగ్ రావు మాట్లాడుతూ ఇలాంటి మంచిపని చేయడం ఎంతో హర్షదాయకమని, నిరంతరం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే తమ సిబ్బందికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతయని,  భవిష్యత్తులో ఈ సంస్థ మరిన్ని సేవలు చేస్తూ ముందుకు వెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఎస్.ఐలు శంకర్, భాను ప్రసాద్, సురేష్, సీనియర్ జర్నలిస్టులు జయకుమార్ గుప్తా, గంగరాజు, లక్ష్మణ్ ప్రసాద్, విద్య సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...