సీపీఐ ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం
మందమర్రి,పెన్ పవర్పట్టణ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వేంకటేశ్వర ఆలయం ఏరియాలో గడప గడప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యా వర్గ సభ్యులు భీమనాధుని సుదర్శన్, కౌన్సిల్ సభ్యులు సలెంధ్ర సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం నిర్వహించి విరాళాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. కాలనీలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాలకవర్గం లేక సమస్యలను పట్టించుకోవడం లేదని, అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నరని అన్నారు. ప్రజా సమస్యలపై సీపీఐ నిరంతర పోరాటం చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి పౌలు, రాయబారపు వెంకన్న,కొల్లూరి నాగరాజు, పేసరి రాజయ్య, రాయబారపు జనార్ధన్, బియ్యాల పద్మ, ఎండి రసూల్, బస్తి వాసులు పాల్గొన్నారు

No comments:
Post a Comment