బడుగు బలహీన వర్గాల ఆరాధ్యదైవం సావిత్రిబాయి పూలే
అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు నవీన్ మహోర్కర్
అదిలాబాద్, పెన్ పవర్
బడుగు బలహిన వర్గాల ఆరాధ్య దైవం సావిత్రి బాయి పూలే అని ఆమె చేసిన సేవల వల్లే ఈ రోజు మహిళలు ఈ స్థాయిలో ఉన్నారని అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు నవీన్ మహోర్కర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ భవన్ లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 124వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీల పట్లా ఎనాలిని కృషి చేసిన మహోన్నతమైన స్త్రీ సావిత్రిబాయి పూలే అని ఉన్నారు. సావిత్రి బాయి ఫులే ఆశయాల సాధనకై ప్రతి ఒకరు కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో విశాఖ మహిళా మండల అధ్యక్షరాలు దుర్గే రుక్మిణి బాయి,మినా, నిర్మలబాయి,సేవంతబాయి,జైపాల్,ప్రమోద్, చంద్రశేఖర్,కేశవరావ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment