రైతులను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం
మందమర్రి ,పెన్ పవర్
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడు రైతు చట్టాలను తీసుకు వచ్చి, రైతులను మోసం చేస్తూ,కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఐఎఫ్టీయు జిల్లా నాయకులు ఎండీ జాఫర్ ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని ఐఎఫ్టీయు కార్యాలయంలో రైతులకు మద్దతుగా మార్చి 23న మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రైతు గర్జన ప్రదర్శన, సభ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల వల్ల, విత్తనాల వలన నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, సబ్సిడీ రద్దు చేయకుండా, రైతులపై విద్యుత్ భారాన్ని మోపేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని, అధిక ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో జరుగు రైతు గర్జనకు రైతులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు డి కుమార్, జే కనకయ్య, ఆర్ అజయ్, సాయి ఏ కొమురయ్య, మీనా తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment