పోలీస్ స్టేషన్ వద్ద మృతదేహంతో ధర్నా
గోకవరం,పెన్ పవర్జైలు అధికారుల అలక్ష వైఖరి కారణంగా వ్యక్తి మృతిచెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు గోకవరం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని తిరుమలాయపాలెం లో అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఇటీవల పోలీసులు సారా బట్టీలు పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన బోయడి. చంద్రం వయసు (30) ని అరెస్ట్ చేసి ఈనెల ఏడో తేదీన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది.చంద్రం అనారోగ్యం పాలవడంతో అతని జైలు సిబ్బంది రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బెయిలు మంజూరు కావడంతో చంద్రాన్ని బుధవారం విడుదల చేశారు.తీసుకుని వస్తుండగా మార్గమధ్యంలో చంద్రం మృతిచెందాడు.గోకవరం పోలీస్ స్టేషన్కు చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహంతో స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మధుమేహం, గుండె పోటు వంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రానికి అస్వస్థతకు గురై మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. చంద్రానికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.విషయం తెలుసుకున్న నార్త్ జోన్ డిఎస్పి కడలి వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి మృతుడి మరణానికి గల కారణాలను పరిశోధించి తెలుసుకుంటామని బంధువులకు హామీ ఇచ్చారు.ఈ మేరకు గురువారం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి చంద్రం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించడం జరిగింది.

No comments:
Post a Comment