Followers

శ్రీ రుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలోశివ నామస్మరణతో మారు మ్రోగిన క్షేత్రాలు

 శ్రీ రుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలోశివ నామస్మరణతో మారు మ్రోగిన క్షేత్రాలు 

వి.ఆర్.పురం,పెన్ పవర్  

మహాశివరాత్రి  పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ రుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రజలు దర్శించుకుని శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమ్రోగాయి. తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం వడ్డీ గూడెం గ్రామంలో గోదావరి ఒడ్డున వెలసియున్న శ్రీ రుద్ర కోటేశ్వర స్వామి ఆలయానికి ఆలయ కమిటీ వారు. దేవాలయానికి వచ్చిపోయే భక్తులకు అసౌకర్యం కలగకుండాఅన్నిఏర్పాట్లు చేసినారు.

మండల స్థానిక తాసిల్దార్ ఎన్. శ్రీధర్ ఆలయ కమిటీ వారు. భక్తుల కొరకు ఏర్పాటు చేసిన వాటిని పరిశీలించి శ్రీ రుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వడ్డిగూడెం గ్రామ  సచివాలయానికి సంబంధించిన గ్రామ సెక్రటరీ సురేష్ రెడ్డి మరియు వాలంటీర్లు ఆధ్వర్యంలో దేవాలయానికి వచ్చి పోయే భక్తులకు  ఉచితంగా పులిహార మజ్జిగ ఏర్పాటు చేసినారు.

 రేఖ పల్లి హెచ్ సి కి సంబంధించి ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు దేవాలయం వద్ద  హెల్త్ క్యాంపు ఏర్పాటు  చేసినారు.  మండలానికి డి ఎం హెచ్  ఓ  వచ్చి శ్రీ రుద్ర కోటేశ్వర స్వామినీ దర్శించుకుని హెల్త్ క్యాంప్ ను పరిశీలించారు.మండలంలోని గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు అధికారులకు దైవ దర్శనం  ప్రసాదాల కార్యక్రమం బాగా జరిగిందని అధికారులు ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ముత్యాల రామారావు ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...