కరోనా వ్యాక్సినేషన్ పరిశీలన
తాళ్ళూరు,పెన్ పవర్తాళ్ళూరు మండలం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా క్షయా నివారణ అధికారి కె.సురేష్ కుమార్, బుధవారం తాళ్ళూరు, తూర్పు గంగవరం ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రలలోని వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. పేర్లు నమోదు చేసుకున్న వారంతా వ్యాక్సిన్ వేయంచుకోవాలని సూచించారు. మిగతా వాళ్లు కూడా త్వరగా పేర్లు నమోదు చేసుకోవాలి అన్నారు. అనంతరం వ్యాక్సిన్ వేయించుకున్న వారికి పలు సలహాలు,సూచనలు చేశారు. తాళ్ళూరు పీ హెచ్ సీ వైద్యాధికారిణి ఖద్దర్ మస్తాన్ బీ మాట్లాడుతూ 67 మంది వ్యాక్సిన్ వేయించుకునట్లు తెలిపారు. తూర్పు గంగవరం పీ హెచ్ సీ వైద్యాధికారి బంక రత్నం మాట్లాడుతూ ఇప్పటి వరకు వృద్ధులు 150 మంది వ్యాక్సిన్ వేయించుకునట్లు తెలిపారు.60 ఏళ్ల వయస్సు పై బడిన వారు,అలాగే 45 నుంచి 59 ఏళ్లలోపు ఉన్న వారిలో దీర్ఘకాల వ్యాధులున్న వారు పేర్లు నమోదు చేసుకోవచ్చు అన్నారు.60 ఏళ్ల పై వారు వయస్సు ధ్రువీకరణ పత్రం చూపిస్తే టీకా వేస్తామని, అదే 45 ఏళ్ల పై బడ్డ వారిలో దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్లు కనీసం ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి సర్టిఫికెట్ తీసుకొస్తే టీకా వేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది వాణి,అనిత,అంజిరెడ్డి, శ్రీనివాసరావు, సుశీల,మస్తానమ్మ పాల్గొన్నారు.

No comments:
Post a Comment