పీటిజి బాలికల గురుకుల పాఠశాలలో కరోనా పరీక్షలు
గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్
గుమ్మలక్ష్మీపురం మండలం, భద్రగిరి ఏపీ గిరిజన గురుకుల బాలికల (పీటిజీ) పాఠశాలలో మంగళవారం కోవిడ్-19 పరీక్షలను నిర్వహించారు. ఈ మేరకు నీలకంఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాఠశాలలో ఉన్న పదవ తరగతి విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పాఠశాలలో గతంలో ఏడో తరగతి విద్యార్థిని కి కోరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులందరికీ కరోనా పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సి. సత్యేoద్రుడు, పాఠశాల సిబ్బంది నీలకంటాపురం పీహెచ్సీ వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment