Followers

వెలుగు ఏపీఎం నాగభూషణం రామ్మూర్తి మృతి

 వెలుగు ఏపీఎం నాగభూషణం రామ్మూర్తి మృతి

మెంటాడ, పెన్ పవర్

 మెంటాడ మండలం వెలుగు ఏపీఎం గా విధులు నిర్వహిస్తున్న నాగభూషణరావు కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆయన విధులు నిర్వహించారు. అనంతరం ఆయనకు అనారోగ్యం బాగోలేదని విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారము తుది శ్వాస విడిచారు. నాగభూషణరావు మృతి చెందిన సంఘటన తెలుసుకున్న మెంటాడ మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగభూషణరావు ప్రభుత్వము మహిళా సంఘాలకు అందజేసిన ప్రతి పథకాన్ని పటిష్టంగా అమలు చేసిన వ్యక్తిగా మండలంలో ఆయనకు  మంచి గుర్తింపు ఉంది. మహిళా సంఘాలు సమస్యలను  ఆయన ఎంతో ఓపికతో పరిష్కరించే వారిని మహిళా సంఘాలు తన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయన మృతి చెందిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వైయస్సార్ ఆసరా, చేయూత, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు, శ్రీనిధి రుణాలు అందించేందుకు ఆయన చేసిన కృషి చేశారని మహిళా సంఘాలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మండల ప్రత్యేక అధికారి రమణమూర్తి, ఎంపీడీవో భానుమూర్తి, పంచాయతీ అధికారి వాణిశ్రీ, వ్యవసాయ శాఖ ఏవో మల్లికార్జున రావు, తాసిల్దార్ దూస రవి, సీసీలు, వెలుగు సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నాగభూషణరావు భార్య కూడా ప్రస్తుతము చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...