Followers

భక్తులు తమ యొక్క మ్రొక్కుబడులు, కానుకలు తీర్చడానికి ఆన్లైన్

 భక్తులు తమ యొక్క మ్రొక్కుబడులు, కానుకలు  తీర్చడానికి ఆన్లైన్

చిత్తూర్, పెన్ పవర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఎపిటిఎస్ వారిచే  దేవాదాయ ధర్మాదాయ శాఖ యందు అమలవుతున్న టిఎమ్ఎస్ అప్లికేషన్ ద్వారా భక్తులు తమ యెక్క మ్రొక్కుబడులు ,కానుకలు  ఆన్లైన్ ద్వారా సమర్పించేందుకు వీలుగా టిఎమ్ఎస్ అప్లికేషన్ నందు  చేయడమైనది. కనుక శ్రీ స్వామి వారికి  సమర్పించవలసిన కానుకలను మ్రొక్కుబడులు ఆన్లైన్  ఈ-హుండీ ద్వారా విరాళాలు ఇవ్వదలిచిన భక్తులు ఎండోమెంట్  వెబ్సైట్ tms.ap.gov.in ను సందర్శించి...ఈ క్రింద తెలిపిన విధముగా విరాళాలు చెల్లించవచ్చు.

1 : ఈ హుండీ చెల్లింపునకు దేవదాయ  శాఖ వెబ్సైట్ tms.ap.gov.in ను సందర్శించండి. 

 2 : మొదట సారి చెల్లింపునకు ఆన్లైన్ సర్విస్ ను ఎంపిక చేసుకున్న తరువాత  మెయిల్ ద్వారా గాని సెల్ నెంబర్  ద్వారా గాని మీ పేరు తో కూడిన వివరాలతో  యూసర్ రిజిస్టరేషన్ చేసుకోవలెను,ఈ  రిజిస్టరేషన్ ద్వారా తదుపరి చెల్లింపులు అన్నీ చేయవచ్చు. అప్పటికే యూసర్ రిజిస్టరేషన్ అయిన యెడల, యూసర్ యెక్క పేరు  పాస్వర్డ్  తో లాగిన్ కావలెను.

3 :   స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం , కాణిపాకం పేరును ఎంపిక చేసుకొని తదుపరి ఈ–హుండీ చెల్లింపు వివరములను పొందుపరచవలెను.

4 :   స్క్రీన్ పై కనపడునటు వంటి క్యూ ఆర్ కోడ్ ని వ్యాలెట్ ద్వారా అనగా గూగుల్ పే, ఫోన్ పే లేదా పేటీఎం మొదలైన వాటితో స్కాన్ చేయవలయును.

5:  క్యూ ఆర్ కోడ్ స్కాన్ అయిన పిదప మీరు చెల్లించిన చెల్లింపు దృవీకరణ తెలియచేయబడుతుంది. 

 6:  ప్రింట్ ద్వారా  స్క్రీన్ పై కనపరిచిన రసీదును నిక్షిప్తం చేసుకోవచ్చు. స్వయంగా కాణిపాకం కు రాలేని భక్తులు ఈ సువర్ణావకాశం ను సద్వినియోగం చేసుకుని శ్రీ స్వామి వారి కృపకు కటాక్షం పాత్రులు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేష్ మనవి చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...