పుణ్య స్నానానికని గోదావరి దిగిన వ్యక్తి మృతి
సీతానగరం, పెన్ పవర్
రామచంద్రపురం రావిచెట్టు రేవు వద్ద స్నానానికి దిగిన యనమండ్ర.భీమశంకర్ వయసు 45 సంవత్సరాలు అను వ్యక్తి ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో స్థానికులు రక్షణ చర్యలు చేపట్టారు. కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని సీతానగరం ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా వైద్య సేవలు పొందుతూనే మరణించినట్లుగా స్థానిక ఎస్సై వై.సుధాకర్ తెలియజేశారు. సౌమ్యుడిగా జీవించిన వ్యక్తికి ఇటువంటి ప్రమాదం జరగడంతో కుటుంబీకులు,గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడికి ఇద్దరు మగపిల్లలు ఉన్నట్లుగా స్థానికులు తెలియజేస్తున్నారు. ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. విఆర్వో పుల్లారావు పంచనామా జరిపిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
No comments:
Post a Comment