Followers

మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్దిక సాయం

 మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్దిక సాయం 

తాళ్లపూడి, పెన్ పవర్

ఇటీవల గౌరిపట్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 30 మంది గాయపడ్డారు.  ఈ ప్రమాదంలో తీవ్ర గాయలై చేతులు కోల్పోయిన ఇద్దరికి గురువారం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్ధిక సాయం అందజేసినట్టు సంస్థ అధ్యక్షులు బారనాల శంకరరావు తెలిపారు. ఈ సంఘటన లో అన్నదేవరపేట స్థానిక ఎంపిపి స్కూల్  బిసి కాలనీలో  5వ తరగతి చదువుతున్న   జాన్ పేట కి చెందిన బొంతు వెంకటేష్  (వయస్సు 10 సంవత్సరాలు)  ఎడమ చేయికి, అదే పేటకి చెందిన మైలాబత్తుల వీరమణికి కుడి చేయికి తీవ్ర గాయాలవ్వటం వల్ల వైద్యులు తొలగించారు. 

వైద్యానికి ఆర్థిక  స్థోమత లేకపోవడంతో వీరికి వైద్య ఖర్చుల నిమిత్తం సంస్థ తరపున రూ. 8000, సంస్థ సభ్యులు డెంటిస్ట్ డాక్టర్ గోళ్ళ కాంచన్ సాగర్ రూ.5500,   డెంటిస్ట్ డాక్టర్ కొక్కిరిపాటి  విజయకుమార్ రూ.1000,  రీజనల్ ఛైర్మన్ వాసిబోయిన చంద్రయ్య రూ.1000, అధ్యక్షులు బారనాల శంకరరావు రూ.1000, ఇంజరపు వెంకట కృష్ణ సత్యనారాయణ రూ.1000, వెలుగుబంటి శ్రీనివాస్ రూ.1000, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కేసిరాజు లక్ష్మీ నర్సమాంబ రూ.1000 , టీచర్ నక్కిన వందన రూ.1000,  పాఠశాల వంట ఏజెన్సీ మరియు తల్లిదండ్రులు రూ.1300, జూనియర్ అసిస్టెంట్ కణితి నాగ సునీత రూ.500 కలిపి మొత్తం గా రూ.22,300 ఆర్ధిక సాయం అందజేయడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతలుంటే వీరికి వైద్య ఖర్చులు కోసం  సాయం అందజేయుటకి ముందుకురావలెనని సంస్థ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు సెక్రటరీ జోడాల వెంకటేశ్వరరావు, మాజీ అధ్యక్షులు అప్పన చంద్రధర గుప్త, ఈసి మెంబర్ గంధం మునేశ్వరరావు, సభ్యులు గెడ్డం చినరాజు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...