కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ సబిరా బేగం
మహారాణి పేట, పెన్ పవర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ షేక్ కార్పొరేషన్ వెల్ఫేర్ మరియు డేవేలెప్మెంట్ డైరెక్టర్ సబిరా బేగం గురువారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. విశాఖలోని ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రంలో టీకా వేయించుకున్నారు. టీకా తీసుకున్న అనంతరం కాసేపు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి 45ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ టీకా వేయనున్నారు. ఈ సందర్భంగా సబిరా బేగం మాట్లాడుతూ రాష్ట్రంలో అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. దేశంలో అందరికీ ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వ్యాక్సినేషన్ యజ్ఞంలా జరుగుతుందన్నారు. కోవిడ్ను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం’ అని తెలిపారు. వ్యాక్సిన్ పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.
No comments:
Post a Comment