టిఆర్ఆర్ డిగ్రీ కోర్సుల నిర్వహణకు మౌలికవసతుల తనిఖీ
స్థానిక టీ.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ, పీ.జీ. కళాశాలలో వివిధ డిగ్రీ కోర్సుల నిర్వహణకై అవసరమయ్యే మౌలిక వసతులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా తనిఖీ నిర్వహించడానికి నాగార్జున యూనివర్సిటీ ఆచార్యులు అశోక్ కుమార్, జగదీశ్ నాయక్ శనివారం కళాశాలను సందర్శించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రవి కుమార్ తెలిపారు. తనిఖీలో భాగంగా ల్యాండ్ రికార్డులు, కళాశాల భవన నిర్మాణ ప్లానును, వివిధ విభాగాలను, సైన్స్ ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబులను, జే కే సీ, ఇంగ్లీష్ లాంగ్వేజీ ల్యాబు, వర్చ్యువల్, డిజిటల్ తరగతి గదులను, బాలుర, బాలికల టాయిలెట్స్, మంచి నీటి సదుపాయాలను, క్రీడా మైదాన సదుపాయాలు, 400 మీ. రన్నింగ్ ట్రాక్ ను, జిమ్ ను, బొటానికల్ గార్డెన్ ను, ఇటీవలే నిర్మించుకున్న అజోలా పాండ్ ను, వెర్మి కంపోస్టు యూనిట్ ను, హైడ్రోపోనిక్ యూనిట్లను పరిశీలించారని తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలికి తమ రిపోర్టును సమర్పిస్తారు అని తెలిపారు. తద్వారా కళాశాలలోని డిగ్రీ కోర్సుల అఫిలియేషన్ ను యూనివర్సిటీ నుండి పొందవచ్చునని అన్నారు. వివిధ డిపార్ట్మెంట్ ఇన్- ఛార్జ్ లు, అధ్యాపకులు, ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment