తెలుగుదేశం పార్టీకి ఇచ్చే గౌరవం ఇలాగేనా...
మండలంలో జాతి నేతలకిచ్చే గౌరవం ఎలా ఉందంటే, ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ మండలంలో నౌపడ గ్రామం బస్టాండ్ సమీపంలో దివంగత నేత, మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహానికి ముసుగు తీయకపోవడంతో ఎర్రన్నాయుడుకు(మరియు) తెలుగుదేశం పార్టీకి ఇచ్చే గౌరవం ఇలాగేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముసుగు తొలగించి ,ఎర్రన్నాయుడు విగ్రహానికి తొలగించలేదు. ఈ విషయమై అధికారులు దృష్టి పెట్టలేదు. ఇటీవల టీడీపీ ఆవిర్భావం రోజు కూడా టీడీపీ నాయకులు పట్టించుకోలేదు. జాతి నేతల పై అధికారులు పార్టీ నాయకులు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పలువురు ఆరోపిస్తున్నారు.
No comments:
Post a Comment