అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన కౌన్సిలర్ సాయి..
దుండిగల్, పెన్ పవర్దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డ్ డాక్టర్ బస్తిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక కౌన్సిలర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.. శ్రీరామ నవమి పురస్కరించుకొని బుధవారం "గౌతమ్ బుద్ధ సేవా సమితి" ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కౌన్సిలర్ సాయి యాదవ్ ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశానికి చేసిన సేవ ఎప్పటికీ మర్చిపోలేనిదని..భారదేశానికి రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడని కౌన్సిల్ సాయి కొనియాడారు.. బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మానవతావాది అంబేద్కర్ అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కౌన్సిలర్ సూచించారు .ఈ కార్యక్రమంలో సర్వర్, జహంగీర్ ,గౌతమ్ బుద్ధ సేవాసమితి సభ్యులు రామ్ షిండే అశోక్ లక్ష్మీబాయి, చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment