Followers

మౌలాలి లో విద్యుత్ షాక్ కి గురైన మరో బాలుడు

 మౌలాలి లో విద్యుత్ షాక్ కి గురైన మరో బాలుడు

ఈస్ట్ మారుతి నగర్ లోని ఘటన మరవక ముందే ఎం.జె కాలనిలో మరో ఘటన

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్న స్థానికులు

మరో 48 గంటలు గడిస్తేగాని చెప్పలేం అంటున్నా వైద్యులు



పెన్ పవర్, మల్కాజిగిరి

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఎం జె కాలనీ లో విద్యుత్ షాక్ కి గురైన నైనిష్ 5సం బాలుడు, ప్రక్కనే ఉన్న మరో అపార్టమెంట్ లో అడుకుంటున్నా సమయంలో అకస్మత్తుగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలిపోవడంతో అక్కడే ఉన్న బాలుడుకి తీవ్ర గాయల పాలైయ్యారు. చికిత్స కోసం సైనిక్ పూరిలోని అంకురా హస్పిటల్ కు తరలించారు. నైనిష్ బాలుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని 48గంటలు సమయం గడిస్తేకానీ ఏవిషయం చెప్పలేం అన్ని వైద్యులు తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద సారియైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాడంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వ్యహిస్తున్నారని, ఈస్ట్ మారుతినగర్ లో ఘటన మరవక ముందే ఎం.జె.కాలనీ లో మరో ఘటన జరిగిన విద్యుత్ అధికారులు పై ఎటువంటి చర్యలు తీసుకొకపోవడంతో స్థానికులు ఆగ్రహ వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బాలుడు తండ్రి మాట్లాడుతూ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద సారియైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలంటు పల్లుమర్లు విద్యుత్ అధికారులకు పీర్యాదు చేసిన వారు స్పందించకుండా నిర్లక్ష్యం వ్యహించడంతో ఈ రోజు విద్యుత్ ప్రమాదంలో బాలుడుకి షాక్ కి గురై అసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో కొటుమిట్టాడుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ కరణంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్నమని దయచేసి మా బాలుడు నైనిష్ కు వైద్య కర్చులకు ఆర్ధిక సహయం చేయాలంటు వేడుకుంటున్నారు. దాతలు ముందుకు వచ్చి 9542974268 బాలుడు ప్రాణాలు కాపాడలని ఆ కుటుంబ సభ్యులు కొరుతున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...