Followers

సర్పంచులు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు

 సర్పంచులు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు

మెంటాడ, పెన్ పవర్,

 మెంటాడ మండలం లోని మీసాల పేట, కుంతిని వలస గ్రామంలో సర్పంచులు మహంతి రామునాయుడు, పెద్ది రెడ్ల రమేష్ నాయుడు ఆధ్వర్యంలో బుధవారము పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సీసీ కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించి గ్రామాలను శుభ్రం చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా రెండవ దశలో ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతము చిన్న చిన్న వర్షాలు కురవడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రము నిర్లక్ష్యం చేసిన కరోనా మహమ్మారి మనపై దాడి చేస్తుందని తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...