Followers

కరోనా బాధితులకు పింఛన్ పంపిణీ...

 కరోనా బాధితులకు పింఛన్ పంపిణీ...

మహారాణి పేట, పెన్ పవర్

జీవీఎంసీ 4వ  జోన్ పరిధి,33 వార్డ్ ,30 వార్డ్ ల లో  గౌరి స్ట్రీట్,అల్లిపురం సచివాలయం  పరిధిలో కరోనా పాజిటివ్  పెన్షనర్ కు వాలంటీర్ చిల్లా చైతన్య ,వార్డ్  సెక్రటరీ లు, పి.వి.కిరణ్ కుమార్, జి. శ్యామల రావు, జాన్ బాబు వృద్ధాప్య పెన్షన్ ను, హోమ్ ఐసొలేషన్ కిట్ లను  అందచేశారు. ఎల్ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సచువాలయా వ్యవస్థ ద్వారా అనేక పథకాలు ప్రజలకు అందుబాటులో వచ్చాయన్నారు.

కరోన విషయంలో ప్రజలు మెలకువగా ఉండి నిత్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. అలానే నేడు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో మా క్లస్టర్ లో కోవిడ్ బాధితులకు పంపిణీ చేయడం ఓ రకంగా రిస్క్ అయినప్పటికీ మా బాధ్యత మాకు ముఖ్యం అనిపించింది ఆ విధంగా లబ్దిదారులకు పంపిణీ చేసాము అని వివరించారు హోమ్ ఐసొలేషన్  కిట్ లు  అందచేసిన వారిలో  ఏ.ఎన్.ఎం లు  త్రివేణి,అరుణ, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ  అమృత దీప్తి ,వాలంటీర్  భాగ్య లక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...