Followers

ఘనంగా మే డే...

ఘనంగా మే డే...

పెన్ పవర్, యదమరి

యాదమరి మండలం లో పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్స్ అసోసియేషన్  నాయకులు ఆధ్వర్యంలో  మే డే ను  ఘనంగా నిర్వహించారు. ముందుగా మండల కేంద్రం లొ కోవిడ్ నిబంధనల తో ర్యాలీ నిర్వహించారు  అనంతరం  ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ పరిధిలోని ఏర్పాటు చేసిన  కార్మికుల జెండాను యూనియన్ లీడర్ ఆన్సర్ బాషా ఎగరవేశారు, ఈ సందర్భంగా యాదమరి ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్స్ అసోసియేషన్ యూనియన్ లీడర్ ఆన్సర్ బాషా కార్యదర్శి యోగానంద రెడ్డి  మాట్లాడుతూ దేశంలో కార్మికులు లేనిదే ఏ పని జరగదని గుర్తుచేశారు. కార్మికులను ఆదుకుంటానని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ప్రధాన మంత్రి. మోడీ  కార్మికులను  విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. కార్మికులను విస్మరించిన ఏ ప్రభుత్వం నిలవలేదని హెచ్చరించారు. కరోనా కాలంలో పనులు లేక కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలిపారు నిత్యవసర వస్తువులు ధరలను తగ్గించాలని, పెట్రోల్, డీజిల్  జిఎస్టి లో కలపాలని తెలిపారు. కార్మికుల దినోత్సవాన్ని సంఘీభావంగాపెట్రోల్ ట్యాంకర్   డ్రైవర్స్ అసోసియేషన్ యూనియన్ లిడర్ ఆన్సర్ బాషా, కార్యదర్శి యోగానంద రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కుప్పయ్య, కమిటీ మెంబెర్స్ భాస్కర్, రఫీ, జగ్గా, భీమా తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...