Followers

మేయర్ కు వినతి పత్రం సమర్పించిన విశాఖ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్

 మేయర్ కు వినతి పత్రం సమర్పించిన విశాఖ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్

మహారాణి పేట, పెన్ పవర్

గ్రేటర్ విశాఖపట్నం మహానగర కార్పొరేషన్ కి మేయర్ గా ఎన్నికైన సందర్భంగా ముందుగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న సచివాలయం సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు, హెల్త్ వర్కర్లు, మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ లు సిబ్బంది సి.ఎం జగన్ మోహన్ రెడ్డి  ఆశయ సాధన కోసం ఈ కరోనా సమయంలో ఎవరికి వాళ్ళు వారి శక్తి కొలది,అహర్నిశలు ప్రజా సంక్షేమము కోసం విధులు నిర్వహిస్తున్నారు.ఈ సమయంలో కరోనా నుండి రక్షణకు సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ కు సేఫ్టీ కిట్స్ అవసరం ఎంతైనా వుంది కనుక తమ పై దయవుంచి ఉద్యోగులు, కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కు మాస్క్ లు,గౌజులు,శానిటైజర్ లు, అందజేయవలసిందిగా కోరుతూ బుధవారం వినతి పత్రాన్ని సమర్పించారు విశాఖపట్నం సచివాలయం ఎంప్లాయిస్ ఫెడరేషన్. ఈ సందర్భంగా మేయర్ , కమిషనర్ తో మాట్లాడి  అందరికి వీలైనంత తొందరగా హెల్త్ కిట్లు అందించటం జరుగుతుంది అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ జిల్లా  ప్రెసిడెంట్ గణేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పి.వి.కిరణ్ కుమార్,జిల్లా కో ఆర్డినేటర్ ఈ.పవన్ కుమార్,షాహిద్, వెంకట్,అశోక్  వాలంటీర్ లు  నవీన్,కుశవంత్  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...