Followers

ప్రజలంతా సిరక్షితంగా ఉండండి...

ప్రజలంతా సిరక్షితంగా ఉండండి...

 

అనకాపల్లి, పెన్ పవర్

కరోనా  రెండవ దశ ప్రభావం ప్రమాదకరంగా ఉన్నందున ప్రజలంతా భయపడకుండా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు సురక్షితంగా ఉండాలి అని  విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర పిలుపునిచ్చారు.ఉదయం లేస్తే ఏం వినాల్సి వస్తుందో ఏ ఆత్మీయుల్ని పోగొట్టుకోవాల్సి వస్తుందో అనే బాధ,ఆవేదనలతో ప్రజలు,నాయకులు,ప్రతి వక్కరు ఆందోళన చెందున్నారు అని ఆయన అన్నారు.కరోనా ముందు డబ్బు ,పలుకుబడి ఏవి కూడా పని చేసే పరిస్థితి లేదు అని కోవిడ్ బారినపడి ఎవరిని కోల్పోవాల్సి వస్తుందోనని మనసు కలిచివేస్తోంది అని ఆవేదనతో ఆయన అన్నారు.దయచేసి ప్రతి వక్కరు స్వచ్ఛందంగా స్వీయ లాక్ డవున్ విధించుకొని మీ ఇళ్లల్లో కొంతకాలం వుండక పోతే ఈ కరోనా ప్రభలడాన్ని అరికట్టలేము అని ప్రజలను కోరారు.అత్యవసరం వస్తేనే రోడ్డు మీదకు రావాలి అని అదికూడా కరోనా నుండి రక్షణ కొరకు మీకు మీరుగా భౌతిక దూరం పాటిస్తూ,ప్రత్యేక రక్షణ కొరకు రెండు మాస్కు లు ధరించి,ఎక్కువగా  శానిటేషన్ చేసుకోనుచు పని చూసుకొని ఇంటికి త్వరగా సురక్షితంగా చేరుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని సురేంద్ర తెలియజేసారు. దయచేసి మీకు  మీరు  గా ఇంటిలో ఉండండి మీ ప్రాణాలే కాకుండా ఇంటిలో వారిని మీ ఇంటి చుట్టు ప్రక్కల వారిని కూడా రక్షించండి అని ఆయన కోరారు.ప్రతి వక్కరు గుర్తువుంచుకోవల్సిన  విషం ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదు ఈ ప్రపంచంలో మీ అందరిని చేతులెత్తి ప్రార్ధిస్తున్న ఇంటిలో ఉండండి సురక్షితంగా ఉండండి అని చేతులు జోడించి అందరిని ప్రార్ధించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...