Followers

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు బంద్

 ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు బంద్

కూకట్ పల్లి,పెన్ పవర్




ప్రఖ్యాతి గాంచిన ప్రైవేట్ విద్యా సంస్థలు నారాయణ, శ్రీ చైతన్య మొదలగు కళాశాలల ఫీజుల దోపిడీకి నిరసనగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం కూకట్ పల్లి లోని ప్రేవేట్ కాలేజీల బందుకు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలు నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ కళాశాలలు చేపడుతున్న అధిక ఫిజుల వల్ల పేద విద్యార్థులు డబ్బులు చెల్లించలేక విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని, కొందరు విద్యార్థులు అవమాన భారంతో ప్రాణాలు కూడా తీసుకున్నారని, ప్రభుత్వం ఇలాంటి కళాశాలపై చర్యలు తీసుకొని ఫీజులను తగ్గించాలి అన్నారు. కరోన కాలంలో కొన్ని విద్యాసంస్థలు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించ లేదని, ఈవిషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి వారికి న్యాయం చేయాలని కోరారు. రానున్న కాలంలో ఫీజుల దోపిడీ అరికట్టని యెడల బీసీ విద్యార్థి సంఘం అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇంచార్జ్ తెల్ల హరికృష్ణ, టీఎన్ఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థుల అధ్యక్షుడు తన్నీరు ప్రసాద్, చింతల యాదగిరి, కమలాకర్, రాము, కొట్టు వేణు, తెల్ల చంద్రశేఖర్, వేణుగోపాల్, రాహుల్ తేజ, నరసింహ, దండే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

షీ టీం పై అవగాహన పెంచుకోవాలి.

 షీ టీం పై అవగాహన పెంచుకోవాలి.

జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

రాజన్నసిరిసిల్ల ,పెన్ పవర్




గౌరవ నీయులైన రాజన్న సిరిసిల్ల ఎస్పీ  రాహుల్ హెగ్డే  ఆదేశాల మేరకు

సిరిసిల్ల టౌన్ సి.ఐ  ఆధ్వర్యంలో విజ్ఞాన వర్దిని హై స్కూల్  లో షీ టీమ్ ప్రోగ్రాం,100డయల్, మరియు ఆడపిల్లలపై జరుగుతున్న ఆగయిత్యాల గురించి యువత -భవిత వంటి అంశాల గురించి అవగాహనా చేయడం జరిగింది. మరియు టౌన్ ఎస్.ఐ రాజశేఖర్  ఆధ్వర్యంలో బస్టాండ్ ఏరియాలోజిల్లా పోలీసు కళా బృందం వారి సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు కళా బృందం సభ్యులు ప్రజలను చైతన్యం చేస్తూ నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాల నివారణ, మూఢ నమ్మకాల ద్వారా జరిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్, బాలలు మరియు మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులవంటి సామాజిక రుగ్మతల గురించి  వివరిస్తూ ఆటపాటల ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలు చైతన్యం కావడంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందన్న ఎస్పీ సందేశాన్ని వివిధ కళా రూపాలలో వినిపించారు.

ప్రతి బుధవారం రోగులకు అల్పాహారం అందిస్తాం

 ప్రతి బుధవారం రోగులకు అల్పాహారం అందిస్తాం

 స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కారింగుల ప్రణయ్

 ఆదిలాబాద్ , పెన్ పవర్



 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో వచ్చే రోగులకు నేటి నుండి  ప్రతి బుధవారం అల్పాహారం అందించడం జరుగుతుందని స్వస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కారింగుల ప్రణయ్ అన్నారు.స్వస్ స్వచ్ఛంద సంస్థ తరఫున ఈరోజు నుండి ప్రతి బుధవారం రిమ్స్ హాస్పిటల్ లో నిరంతరాయంగా అల్పాహారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఎంతో మంది ట్రైబల్స్ గ్రామాల నుంచి వస్తున్న రోగులు వారి బంధువులు ఉదయం పూట ఆకలితో అవస్థ పడుతున్నారని ఈ విషయం మా దృష్టికి రావడం తో ప్రతి బుధవారం రిమ్స్ హాస్పిటల్ ఎదురుగా అల్పాహారం అందించడానికి పూనుకున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ 10 సంవత్సరాలు పూర్తవడంతో ఇక ముందు మరెన్నో కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.అన్నదాన కార్యక్రమాలు చేసి  అవకాశం రావడం మా అదృష్టం గా భావిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు లక్ష్మణ్ సింగ్ పోతివాల్, మున్నా ,పురుషోత్తం, నక్క గణేష్ ,సాయి కిరణ్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదుల సంతకాల సేకరణ

 న్యాయవాదుల సంతకాల సేకరణ

కూకట్ పల్లి,పెన్ పవర్




వామనరావు దంపతులను నడి రోడ్డుమీద అత్యంత కిరాతకంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ బీజేపీ లీగల్ సెల్ పిలుపుమేరకు కూకట్ పల్లి కోర్టులో న్యాయవాదుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హత్య జరిగి రోజులు గడుస్తున్నా సరే అధికారులలో చలనం లేదని, జంటహత్యల కేసులో విచారణ వేగవంతం చేసి నిజమైన నిందితులను పట్టుకొవాలని, స్వయం ప్రతిపత్తి గల సంస్థతో న్యాయ విచారణ జరిపించాలని, న్యాయవాదులకు రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. ఈకార్యక్రమంలో కూకట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అఖిలేష్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, కృష్ణ కుమార్, యాదయ్య, హరీష్ శంకర్ రెడ్డి, మల్లేష్, సుబ్బారావు, రాజేశ్వర్ రెడ్డి, సత్యనారాయణ, శంకర్రావు, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

108 అంబులెన్స్ ప్రారంభించిన మండల ప్రజా ప్రతినిధులు

 108 అంబులెన్స్ ప్రారంభించిన మండల ప్రజా ప్రతినిధులు

గంభీరావుపేట్,పెన్ పవర్


గంభీరావుపేట మండల కేంద్రంలో  108 అంబులెన్సు ను  ఎంపీపీ వంగ కరుణ మండల వైద్యాధికారి వెంకటేష్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వంగా కరుణ మాట్లాడుతూ మండలం లో ఆరోగ్య సేవల నిమిత్తం ప్రభుత్వం 108 వాహనాన్ని మండలానికి అందించిందని ప్రభుత్వానికి రుణపడి ఉంటామని వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో కొత్తపెళ్లి సింగిల్విండో చైర్మన్ భూపతి సురేందర్,  ఏఎంసి సుతారి బాలవ్వ, వైస్ ఎంపీపీ దోసల లత, జడ్పి కోఆప్షన్  హైమద్, ఎంపిటిసి భాగ్య, దమ్మన్నపేట సర్పంచ్ లక్ష్మి, మాజీ ఎంపిటిసి ఏగదండి స్వామి, ఏఎంసి డైరెక్టర్ శేఖర్ గౌడ్, తెరాస నాయకులు సురేందర్ రెడ్డి, సి హెచ్ వో రమేష్, వైద్య సిబ్బంది బాలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ అరాచకాలకు ముగింపు పలకాలి...అదితి గజపతిరాజు

వైసీపీ అరాచకాలకు ముగింపు పలకాలి...అదితి గజపతిరాజు



విజయనగరం,పఎన్ పవర్ 

రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా వైసీపీఅరాచకపాలనకు ముగింపు పలకాలని విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి అదితి గజపతిరాజు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం 26వడివిజన్లో, సాయంత్రం 20, 27, 28 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని దురాగాతాలకు తెగబడినా టీడీపీ ఎదురొడ్డి పోరాడుతూనే ఉంటుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పట్టణంలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టి, బెదిరించి, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై తప్పుడు కేసులు బనాయించి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పధకాలు అమలులో నెం.1 స్థానంలో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ నేతలు ఎన్నికల్లో ఎందుకు దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు, ప్రజల నుంచి తీర్పు కోరేందుకు వైసీపీ భయపడుతోందన్నారు.ఓడిపోతామనే భయంతోనే దౌర్జన్యాలు, ప్రలోభాలకు తెరతీసారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం శాంతియుత వాతావరణంలో సాగాలని, అటువంటి పరిస్థితులు కలిపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పారదర్శక పాలన సాగాలంటే టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో 26వ డివిజన్ అభ్యర్థి విజ్ఞపువెంకటలక్ష్మి, 20వ డివిజన్ అభ్యర్థి జోగచంటి, 27వ డివిజన్ అభ్యర్థి కంఠ మీనాకుమారి, 28వ డివిజన్ అభ్యర్థి సారిక వెంకటరమణ, పార్టీ నాయకులు ఐవిపి రాజు, విజ్ఞపు ప్రసాద్, కంఠఎర్రయ్య, కంది మురళీనాయుడు తదితరులు పాల్గొన్నారు.


తిమ్మాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఏర్పాటు

 తిమ్మాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఏర్పాటు

ఎల్లారెడ్డిపేట,పెన్ పవర్



ఎల్లారెడ్డిపేట మండలం లోని రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగ ఆక్కపూర్ కృష్ణ ను మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య నియామకం చేశారు.

ఈ సందర్భంగా దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ లను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. వీటితోపాటు బూత్ కమిటీ నియామకం కూడా చేపట్టడం జరుతుందన్నారు. గ్రామంలో గ్రామశాఖ ఉపాధ్యక్షునిగా గుంటి నాగరాజు ఎస్ సి సెల్ అధ్యక్షునిగా జెల్లీ ప్రభాకర్ ఉపాధ్యక్షునిగా సండ్ర గణేశ్ నియమించడం జరిగిందన్నారు. అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జండా ఆవిష్కరణ జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కె గౌస్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎస్ కె సాహెబ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, గంట బుచ్చా గౌడ్, కరికే శ్రీనివాస్, దండు శ్రీనివాస్, మానుక నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...