Followers

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటున్న మన్యం ప్రజలు

 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటున్న మన్యం ప్రజలు




మోతుగూడెం,పెన్ పవర్

ఆంధ్రప్రదేశ్ ప్రజల వీరోచిత పోరాటాలు,ముపై రెండు మంది ప్రాణ త్యాగాల ఫలితంగా నెలకొల్పబడిన విశాక ఉక్కు కర్మాగారాన్ని మోది బిజేపి ప్రభుత్వం ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మన్యం లో జెన్కో ఉద్యోగులు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మరియు గ్రామస్థులు బంద్ కు సంపూర్ణ మద్దతు పలికారు, ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగానికి చెందిన పరిశ్రమలను పూర్తి గా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తుందని దీనిని మనం అపకపోతే మన ప్రాంతంలో ఉన్న సీలేరు కాప్లెంక్స్ కోడ తన అధీనంలోకి తీసుకోని ప్రైవేటీకరణకు అడుగు లు వేస్తాడని అన్నారు, భారతదేశంలో సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వ రంగమే సరైనా విధానమని రిజర్వేషన్లు తదితర బలహీన వర్గాల ప్రయోజనాలను రద్దు చేయడానికి ప్రవేటికరణను ముందుకు తెచ్చిందని నలబై సంవత్సరాలుగా కార్మికులు, ప్రజ కృషితో అభివృద్ధి చెందిన విశాక ఉక్కు కర్మాగారాన్ని కారు చౌకగా కార్పోరేట్ వర్గాలకు అప్పగించలని చూస్తుందని అన్నారు,ఈ రాష్ట్ర బంద్ విజ్ఞప్తి మేరకు పాఠశాలలు, కార్యలయలు ముసివేయించారు మరియు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసి వేసారు.ఈ కార్యక్రమంలో తెలుగు దేశం, కాంగ్రెస్ మరియు సిపిఎం పార్టీలకు చెందిన నాయకులు వేగి నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, దేముడు మరియు పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు

అరకు జిల్లా ఉపాధ్యక్షుడు గా బొల్లా ప్రసాద్....

 అరకు జిల్లా ఉపాధ్యక్షుడు గా బొల్లా ప్రసాద్....




ఎటపాక, పెన్ పవర్

అరకు జిల్లా ఉపాధ్యక్షుడు గా బొల్లా ప్రసాద్ ఎంపిక పట్ల ఎటపాక మండల కమిటీ హర్షం వ్యక్తం చేశారు. ఎటపాక మండల అధ్యక్షుడు మోదుగు పెరమయ్య అధ్యక్షతన శుక్రవారం గన్నవరం గ్రామంలో అభినందన సభ ఏర్పాటు చేశారు.ఈసందర్భంగా బొల్లా ప్రసాద్ ,ఓబీసి జిల్లా అధ్యక్షుడు రాయిని రమేష్ ను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు  సోము వీర్రాజు,జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు  అరకు జిల్లా ఉపాధ్యక్షుడు గా ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు పాంగి రాజరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బొల్లా ప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం లొనే  రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.అందరి సహకారంతో గ్రామ స్థాయి నుంచి  పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి వైపు ప్రయాణిస్తోందని అన్నారు.రాష్ట్ర విభజన అనంతరం విలీన మండలాల్లో అభివృద్ధి కుంటుపడిందని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల  నిర్వాసితలు ఎదుర్కొంటున్న సమస్యలు ను కేంద్రం దృష్టికి తీసుకవెళ్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి అభ్యర్థి సరియం శ్రీను, కొరకాసుల రామకృష్ణ, కె శేఖర్, కాకా సీత, మూడే సతీష్ కుమార్ పాల్గొన్నారు....

కనువిందు చేస్తున్న మామిడి కాయలు...

 కనువిందు చేస్తున్న మామిడి కాయలు...



 పెట్టిన పవర్,విశాఖపట్నం

 నోరూరించే మామిడికాయల సీజన్ వచ్చేసింది. ఎక్కడ చూసినా మామిడి కాయలు  పళ్ళతో కళకళలాడుతుంది. ఉగాది పచ్చడికి  మామిడి పిందెలను వాడటం ఆనవాయితీ. కానీ ఇప్పుడు మామిడి సీజన్లకు ముందే కాయలు పళ్ళు రావడం విశేషం. హైబ్రిడ్ రకాలు  తక్కువ కాలం సెక్స్లో పక్వానికి వస్తున్నాయి. వారం క్రితం విజయనగరం మార్కెట్ కు భారీ ఎత్తున మామిడికాయ చేరింది.  వాటిని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు.కొన్ని ప్రాంతాల  తోటల్లో మామిడి కాయలు పెద్ద సైజులో దర్శనమిస్తున్నాయి. మామిడి చెట్ల కొమ్మలకు కాపు కాయడం సర్వసాధారణం. కానీ ఈ చెట్టు  మానుకు  గుత్తులు గుత్తులుగా కాయలు కాయడం  ఆశ్చర్యం కలిగిస్తుంది. చివర్లకు లేని కాయలు మాను కొమ్మలకు కాయడం  అంటూ సమయంలో జరిగిన మార్పు కారణంగా ఈ విధంగా కాపు కాస్తాయి అని ఉద్యానవన శాఖ అధికారి ఒకరు తెలిపారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు మేం వ్యతిరేకం:జికె వీధి అఖిలపక్షం

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు మేం వ్యతిరేకం:జికె వీధి అఖిలపక్షం



గూడెంకోత్తవీదీ, పెన్ పవర్ 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకమని జికె వీధి అఖిల పక్షం నాయకులు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త బంద్ ను జికె వీధి లో అఖిల పక్షం నాయకులు విజయవంత చేసారు.మండల కేంద్రం  మీదుగా  ఉన్న రాష్ట్ర రహదారి మీద  వెళ్తున్న వాహనాలను నిలిపివేసి, అఖిలపక్షం నాయకులు, గిరిజన ఉద్యోగులు,విద్యార్థులు  కలిసి ర్యాలీ చేసినంతరం మానవహారం నిర్వహించి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనంతరం మన్యం లో గల బాక్సైట్ తవ్వకాలు కూడా చేపడతారని,అందుకే జీఓ నెం 89 ని తీసుకొచ్చారని, జిల్లాల పునర్విభజన లో భాగంగా జికెవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాలను రంపచోడవరం జిల్లా లో  విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, రోజురోజుకూ నిత్సవసర సరుకుల ధరల ఆకాశానికి అంటుతున్నాయనీ ప్రభుత్వం పాలన చేస్తుందా లేక వ్యాపారం చేస్తుందా అని ప్రశ్నించారు.ప్రభుత్వరంగా సంస్థలు ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్లు కోల్పోతామని, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను పాడుకొంటామన్నారు.ఈ కార్యక్రమం లో ఏపి గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొట్టడం రాజబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్, తెదేపా మండల అధ్యక్షుడు కొర్ర బలరాం, సిపిఐ మండల కార్యదర్శి కంకిపాటి సత్తిబాబు, సిపిఎం మండల కార్యదర్శి అంపురంగి బుజ్జిబాబు, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు గడుతూరి సత్యనారాయణ, గిరిజన ఉద్యోగ సంఘం నాయకులు ముక్కలి కామేశ్వరరావు, కొర్ర మల్లేశ్వర్రావు, జెఏసి నాయకులు కొర్ర నారాయణరావు,అడపా పరమేశ్వర్రావు, జికెవీధి సర్పంచ్ కొర్ర సుభద్ర,జికె వీధి దేవరాపల్లి ఉపసర్పంచ్ లతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు,యువకులు పాల్గొన్నారు.

డంపింగ్ యార్డ్ కు నిప్పు అంటుకొని కమ్ముకు పోయిన పొగ...

 డంపింగ్ యార్డ్ కు నిప్పు అంటుకొని కమ్ముకు పోయిన పొగ..



 నూకాలమ్మ కాలనీలో  ప్రజలు ఆందోళన

 డంపింగ్ యార్డ్ దూరంగా తరలించాలని కోరిన పట్టించుకోని అధికారులు

వి.మాడుగుల,పెన్ పవర్

 మాడుగుల నూకాలమ్మ కాలనీలో శుక్రవారం డంపింగ్ యార్డ్ తగులబడి పొగ కమ్మేసింది. పొగ తీవ్రత తట్టుకోలేక  ప్రజలు ఆందోళనకు  గురయ్యారు. నూకాలమ్మ కాలనీకి ఆనుకొని డంపింగ్ యార్డ్ ఉంది గ్రామంలో చెత్తంతా డంపింగ్ యార్డ్ లో వేయడం వల్ల తరచూ అగ్ని ప్రమాదాలు  తలెత్తుతుందని స్థానికులు వాపోతున్నారు. సంపద తయారీ కేంద్రం  అసంపూర్తిగా ఉండిపోవడంతో చెత్తాచెదారం డంపింగ్ యార్డ్ లో వేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కడో ఒక చోట నిప్పు అంట్టుకొని  పొగ  కాలనీలోకి సొర పడుతుందని  పొగ తీవ్రతకు వృద్ధులు పసిపిల్లలు ఊపిరాడక అస్వస్థతకు గురి అవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. డంపింగ్ యార్డ్ లో తరచూ నిప్పు అంటుకుని పొగ ప్రభావంతో  నానా అవస్థలు గురవుతున్నామని డంపింగ్ యార్డ్ కు దూరంగా మార్చాలని ఎన్నిమార్లు ఫిర్యాదు చేసిన పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ స్పందించి  డంపింగ్ యార్డ్ ని తరలించాలని లేనిపక్షంలో ఆందోళనలు సిద్ధంగా ఉన్నామని  స్థానికులు హెచ్చరించారు.

విశాఖ మన్యంలో బంధు విజయవంతం...

 విశాఖ మన్యంలో బంధు విజయవంతం...



 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గిరిజనులు ఆందోళన

పెన్ పవర్,విశాఖపట్నం

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం చేపట్టిన బంద్ విశాఖ మన్యంలో  విజయవంతమైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పంపు  కార్పొరేట్ వ్యవసాయం బిల్లులకు  వ్యతిరేకంగా  వామపక్షాలు వివిధ సంఘాలు మార్చి 5వ తేదీన  రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిలిపివేసింది దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పట్టణాల్లో ఆందోళనకారులు రోడ్లపై బైఠాయించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర బందుకు పిలుపునిచ్చిన మేరకు ఏజెన్సీలో పూర్తిస్థాయి మద్దతు లభించింది. పాడేరు అరకు చింతపల్లి ప్రాంతాల్లో బంధు  పరిపూర్ణంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం వివిధ గిరిజన సంఘాలు సమైక్యంగా ఆందోళనకు తెర తీశారు. కూడళ్ల వద్ద వాహనాలు రాకపోకలు లేకుండా రోడ్లపై బైఠాయించి నిరసన తెలియజేశారు. హుకుంపేట లో సామాన్య ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్న ప్రధాన మంత్రి మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మోడీ రాక్షస పాలన నశించాలని వారు నినాదాలు చేశారు.  పర్యాటక కేంద్రమైన  అరకులో దుకాణాలు హోటళ్లు మూయిం చారు. పాడేరు చింతపల్లి ఇతర మండలాల్లో కూడా  దుకాణాలు తెరుచుకోలేదు. ప్రైవేటు వాహనాలు కూడా తిరగకుండా  కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బంధు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పలుచోట్ల పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. ముంచంగిపుట్టు   పెదబయలు జి.మాడుగుల  డుంబ్రిగూడ అనంతగిరి జీకే వీధి సీలేరు    మండలాల్లో కూడా   బంద్ ప్రభావం కనిపించింది.

వార్డు సభ్యుని తొలగించిన కలెక్టర్

 వార్డు సభ్యుని తొలగించిన కలెక్టర్

లక్షెట్టిపెట్,పెన్ పవర్

మండలంలోని లక్ష్మిపూర్ గ్రామ పంచాయతీ నాల్గవ వార్డు సభ్యుడు పెట్టేం శ్రీరామ్ ను పదవినుండి జిల్లా కలెక్టర్ తొలగించినట్లు ఎంపీడీఓ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. సదరు వార్డు సభ్యుడు శ్రీరామ్ గ్రామ పంచాయతీలో నిర్వహించినా  ఎనిమిది సమావేశలకు హాజరు కానందున జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పదవి నుండి శ్రీరామ్ ని తొలగించినట్లు  ఉత్తర్వులు జారీ చేసారన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...