Followers

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు

 విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు



విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 

పెన్ పవర్,ఆలమూరు 

  విశాఖ ఉక్కు ప్రయివేటికరణ కు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా కొత్తపేట నియోజకవర్గం  ఆలమూరు మండలంలో వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు,విద్యా సంస్థలు మూసివేశారు. కొత్తూరు సెంటర్ లో విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. సీపిఐ మండల కార్యదర్శి కే. రామకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీరోచిత ఆందోళన ఫలితంగా 32 మంది తెలుగు వారి ప్రాణత్యాగాలతో నెలకొల్పబడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవలసిన భాధ్యత తెలుగు వారందరి పైనా ఉంది అని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కారు చౌకగా  కార్పొరేట్  సంస్థలకు  కేంద్ర ప్రభుత్వం అప్పగిస్తూ  ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, భవిష్యత్ తరాలకు ఏ ప్రభుత్వ  సంస్థని మిగల్చకుండా చేయడమే బీజేపీ లక్ష్యంగా పనిచేస్తుందని, దాన్ని ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో  సీపీఐ నాయకులు  వి.శ్యామ్, ఏసురాజు,టీడీపీ నాయకులు వంటిపల్లి సతీష్, నల్లబాబు, రామానుజుల శేషగిరి, వైసీపీ నాయకులు  కొపనాతి శ్రీను, నాతి  కుమార్ రాజా , కాంగ్రెస్ నాయకులు లక్ష్మణరావు,ఏ ఐ వై ఎఫ్ ( AIYF)నాయకులు  ఆనంద్,రవి, ఏ ఐ ఎస్ ఎఫ్ (AISF) నాయకులు రామ్ ప్రసాద్, పరీష్ తదితర విద్యార్థి యువజన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నమంత్రి హారిష్ రావు


 విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నమంత్రి హారిష్ రావు

పెన్ పవర్, మల్కాజిగిరి

 గ్రాడ్యువేట్ ఎమెల్సీ ఎన్నికలులో భాగంగా మల్కాజిగిరి అనంద్ బాగ్ లోని బృందవన్ గార్డెడ్స్ లో పట్టభద్రుల విస్తృత స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా ఆర్దిక శాఖ మంత్రి హారిష్ రావు రాజ్యసభ సభ్యులు కేశవ్ రావు, పట్నం మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మెహన్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు హజరైయ్యారు. ఈ సందర్బంగా మంత్రి హరిష్ రావు మట్లాడుతూ ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు అన్నారు వాటిని అమలు చేసింది లేదని, పెట్రోల్ డిజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజల జీవితం పై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం అన్ని ఆరోపించారు. రంగ సంస్థలను పైవేటీకరణ చేస్తున్నారని, ఇటివల ప్రవేశా వెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మెుండిచేయి చూపించారని అన్నారు. ప్రజలు బిజెపికి ఓటు వేయడానికి సిద్దంగా లేరని ఆర్దిక శాఖ మంత్రి హరిష్ రావు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస బలపరిచిన అభ్యర్ది సురభివాణీదేవి ప్రోపెసర్, మాజీ మంత్రి కుమర్తెగా ఒక ఉన్నత సంప్రదాయ కుటుంబం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటిలో ఉన్నారని వారిని గెలిపించాలని గ్రాడ్యువేట్ ఓటర్లను కొరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, సునీత రాముయదవ్, మినా ఉపేందర్ రెడ్డి, శాంతి శ్రీనివాస్ రెడ్డి, జితేంద్ర నాథ్,సబిత అనిల్ కిశోర్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, ధన్ ఫాల్ రెడ్డి, నాయకులు వీకే మహేష్, బద్దమ్ పరశురాం రెడ్డి, రావుల అంజయ్య, అధ్యక్ష కార్యదర్శి పిట్ల శ్రీనివాస్, జి.ఎన్.వి. సతీష్ కుమార్, రాము యాదవ్, గుండా నిరంజన్,మోహన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఖాళీల్,లక్ష్మీ కాంత్ రెడ్డి అమినుద్దీన్,భాగ్యనంద్ రావు,సంతోష్ రాందాస్,కృష్ణ మూర్తి గౌడ్,మోహన్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్దంగా ఉండాలి

 ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్దంగా ఉండాలి:మేడ్చల్ కలెక్టర్..


మేడ్చల్ ,పెన్ పవర్

ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అదనపు ప్రిసైడింగ్ ,అధికారులకు ర్యాండమైజేషన్ కార్యక్రమాలు పూర్తి చేశామని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు..

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌  పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్దంగా ఉండాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. ఈనెల 14న జరగనున్న పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి గురువారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, అదనపు ప్రిసైడింగ్ అధికారులకు సంబంధించి 934 మందికి సెకండ్ ర్యాండమైజేషన్ నిర్వహించామని తెలిపారు.. గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 198 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా... మొత్తం 1,31,000 మంది ఓటర్లు ఉన్నారని దీనికి సంబంధించి ఆయా కేంద్రాల్లో ఎన్నికలు కు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వివరించారు. అలాగే కొన్ని చోట్ల ఏమైనా పనులు ఉంటే వాటిని సైతం పూర్తి చేయిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.  ఇప్పటికే ఆయా ఎన్నికల కేంద్రాల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మొదటి విడత శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు,  విద్యాసాగర్, డి ఆర్ ఓ .లింగ్య నాయక్ , ఏ ఓ .వెంకటేశ్వరులు    తదితరులు పాల్గొన్నారు..

ఊరికి వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 ఊరికి వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మందమర్రి,పెన్ పవర్ 

రామకృష్ణాపూర్ పట్టణంలోని పలు కాలనీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల నుండి రామకృష్ణాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరిస్తూ వారి వేలి ముద్రలు మొబైల్ చెక్ డివైస్ ద్వారా సేకరిస్తున్నామని రామకృష్ణాపూర్ ఎస్సై కటిక రవి ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని ప్రజలు తీర్థయాత్రలకు తమ అవసరాల నిమిత్తం ఇంటిని వదిలి వేరే ఊరికి వెళ్లినప్పుడు వారు తమ వివరాలు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. పట్టణంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారస పడి నట్లయితే వారి వివరాలను పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలన్నారు. ఎవరైనా తమ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల వారిని లేదా ఇతర రాష్ట్రాల వారిని తీసుకు వచ్చినప్పుడు వారి వివరాలు ఆధార్ కార్డు తో సహా పోలీస్ స్టేషన్ నందు నమోదు చేయాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇంటిని వదిలి వెళ్ళినప్పుడు వారి వివరాలు ఈ నెంబర్, 100, 6309825776, 9440795039 లకు ఫోన్ చేసి వారి వివరాలు తెలపాలని కోరారు.

మానవత్వం చాటిన ల్యాండ్ మార్క్ హాస్పిటల్స్


 మానవత్వం చాటిన ల్యాండ్ మార్క్ హాస్పిటల్స్

కూకట్ పల్లి,పెన్ పవర్

ఆదిలోనే నయం అయే కొన్ని వ్యాధులను మొదటి దశలొనే గుర్తించి చికిత్స చేయడం ద్వారా జీవితాలను కాపాడుకోవచ్చు అని ఆర్థోపెడిక్  డాక్టర్ సుధీర్ రెడ్డి  తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా ఖిల్లా ఘాన్పూర్ చెందిన కవిత(28) అనే మహిళ గత 9సంవత్సరాలగా కాళ్ళనొప్పులతో బాధపడుతూ ఉంది. సరైన వైద్యం అందక డబ్బు చెలించలేని స్థితిలో కూకట్ పల్లిలోని హైదర్ నగర్ ల్యాండ్ మార్క్ హాస్పిటల్ కు రావడం జరిగిందని, అప్పటికే కవిత తనంత తానుగా నడవలేక, ఎటువంటి పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉందని తెలిపారు. కవితను పరీక్షించిన డాక్టర్ సుధీర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీచరణ్ ఇతర వైద్యబృందం వైద్యం చేస్తాం కానీ ఏడూ లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు, దీనితో అంత డబ్బు లేదు అని తాను వైద్యులకు వివరించింది. దీనితో వైద్యులు సామాజిక బాధ్యతగా ఆమెకు ఆపరేషన్ ను ఉచితంగా నిర్వహించి దాతృత్వాన్ని చాటుకున్నారు. 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రోగులలో మోకాలి మార్పిడి చాలా అరుదుగా జరుగుతుంది అని డాక్టర్ సుధీర్ రెడ్డి తెలిపారు. ఆమె వైకల్యాలను సరిదిద్దడానికి ఆసుపత్రిలో ఒక నెల కన్నా ఎక్కువ సమయం పట్టింది అని అన్నారు. నాలుగు నెలల్లో కవిత అందరిలాగానే నడుస్తుందని తెలియజేసారు. కవిత మాట్లాడుతూ తనకు ఉచిత వైద్యం చేసిన డాక్టర్లు పునర్జన్మ ప్రసాధించారని, జీవితాంతం వారికి రుణపడి ఉంటానని అన్నారు.

కరోనా పై అపోహలు వద్దు

 కరోనా పై అపోహలు వద్దు అవగాహన ముఖ్యం.వైద్యులు డాక్టర్ రవి

చిన్నగూడూరు, పెన్ పవర్

స్థానిక మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో కరోన రాపిడ్ రెస్పాన్స్ సందర్శించి గురువారం నాడు విద్యార్థులను పరీక్షించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఒకరికి పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా మిగతా విద్యార్థినిల కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్ రాలేదని అన్నారు. కానీ కరోనా వైరస్ సోకకుండా ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు శానిటైజర్ లు భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పుల్లారావు, ఎంపీడీవో సరస్వతి, హెల్త్ ఎడ్యుకేటర్ జయశ్రీ, ఏ ఎన్ ఎం వనిత, అనిత తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ గా శ్రీనివాస్ రెడ్డి ని గెలిపించాలి.

 ఎమ్మెల్సీ గా శ్రీనివాస్ రెడ్డి ని  గెలిపించాలి.

కేసముద్రం, పెన్ పవర్

 రాబోయే నల్గొండ  వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తెలంగాణ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్ తరపున పోటీ చేస్తున్న సంకెపల్లి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని టి పి సి ఎల్ ఎ రాష్ట్ర పత్రికా విభాగం అధ్యక్షులు కడుదుల జనార్ధన్ కోరారు. గురువారం కేసముద్రం మండలం లోని తాళ్లపూసపల్లి, కల్వల, కేసముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, శ్రీ వివేకవర్ధిని హై స్కూల్, కృషి స్కూల్, మహర్షి డిగ్రీ కాలేజీలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రైవేట్ కళాశాల అధ్యాపకుల సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేస్తున్న టి పి సి ఎల్ ఏ రాష్ట్ర అధ్యక్షులు సంకెపల్లి శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్సీ గా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి, టి పి సి ఎల్ ఏ రాష్ట్ర అధ్యక్షుడు సంకేపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు రాజకీయ పార్టీలకి సంబంధించినవి కావని, కానీ రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేయడం ఆశ్చర్యమేస్తుంది అన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వారిని గుర్తించి ఎన్నుకోవాలని పట్టభద్రులను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టి పి సి ఎల్ ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీ కే రామారావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వీణవంక రాజు, నల్గొండ జిల్లా కమిటీ అధ్యక్షులు ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుదురుపాక జనార్ధన్, బుర్ర సుధాకర్, ధరావత్ శంకర్, బానోతు మంగీలాల్, సుమన్, మూల రాజి రెడ్డి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...