Followers

5వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని మొల్లి హేమలతకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

 5వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని మొల్లి హేమలతకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

పెన్ పవర్,మధురవాడ

జీవీఎంసీ ఐదోవార్డ్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకె మొదటి ప్రాధాన్యత ఇస్తానని వార్డు టిడిపి అభ్యర్థిని మొల్లి హేమలత స్పష్టంచేశారు. జివిఎంసి ఎన్నికల ప్రచారంలో చివరి రోజు సోమవారం టిడిపి జిల్లా కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో  వార్డ్ పరిధిలోని స్వతంత్రనగర్, నగరంపాలెం, బొట్టవాణిపాలెం,గణేష్ నగర్, అయ్యప్పనగర్, సద్గురుసాయినాథ్ కాలనీ, శివశక్తి నగర్ వైయస్సార్ కాలనీ,సాయిరామ్ కాలనీ, మారికవలస కాలనీ బోరవాణి పాలెం,పరదేశి పాలెం, డ్రైవర్స్ కాలనీ, వికలాంగులకాలనీ తదితర ప్రాంతాలలో విస్తృత పర్యటన చేసి ప్రచారం నిర్వహించారు.వార్డు పరిధిలో అందరినీ పేరుపేరునా పలకరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డుప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చుకోవడం కోసం కృతనిశ్చయంతో ఉన్నామని మొల్లి హేమలత పేర్కొన్నారు. వాటర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని నిత్యం వారికి సేవ చేసుకుంటూ ఉంటానని తెలిపారు.

టిడిపి పట్ల ప్రజల్లో మంచి ఆదరణఉందని తప్పకుండా జీవీఎంసీ 5వార్డు పరిధిలో టీడీపీ జెండాను ఎగురవేస్తాముఅని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత సాధించడానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమాజంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని గుర్తించి ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే మగవాళ్లతో సమానంగా విద్యా,ఉద్యోగాల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకు వచ్చారని 5వార్డ్ ప్రజలకు హేమలత వివరించారు.స్వయంసహాయక సంఘాల సభ్యులకు ప్రతి సభ్యులకు పదివేల రూపాయలు ఇచ్చారని,బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టుమిషన్లు ఇచ్చి ఇంటి వద్ద టైలరింగ్ పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని,ఒంటరి మహిళలకు వికలాంగులకు చేనేత కార్మికులకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నారని ఆమె గుర్తు చేశారు.ఈ సందర్భంగా జిల్లా టిడిపి కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ టిడిపి హయాంలో విశాఖ అభివృద్ధి చెందిందని అదేవిధంగా వార్డు అభివృద్ధి జరగాలంటే టీడీపీ ని గెలిపించాలని ఆయన ప్రజలకు కోరారు.సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కోరాడ రాజబాబు,వార్డు పరిధిలో తెలుగుదేశం నాయకులు, టిడిపి అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

ఐక్య పోరాటం ద్వారానే స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోగలం ..

ఐక్య పోరాటం ద్వారానే స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోగలం ..

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణమూర్తి 

విశాఖపట్నం,పెన్ పవర్ 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని బీజేపీ నాయకులు రాష్ట్రంలో డప్పు కొట్టగా, దీనికి విరుద్ధంగా పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ ఉక్కులో వంద శాతం పెట్టుబడులను ఉపసంహరిస్తామని ప్రకటన చేయడం బీజేపీ ద్వంద వైఖరి మరోమారు బట్టబయలు అయ్యిందని  సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణమూర్తి సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేసారు. రాజకీయ పార్టీలు సమైక్యంగా ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టాలని, రాజకీయాలకు అతీతంగా పోరాటం సాగించినప్పుడే విశాఖ స్టీల్‌ప్లాంట్ ని ప్రైవేటీకరణ నుంచి రక్షించుకోగలమని స్పష్టం చేశారు.

కోదండ రామునికి అభిషేకం...

 కోదండ రామునికి అభిషేకం...  

పెన్ పవర్,కందుకూరు

  కందుకూరు పెద్ద బజార్ లో ఉన్న కోదండ రామాలయం లో మాఘ మాసం సందర్భంగా జరిగే లక్ష తులసి పూజ కార్యక్రమం లో భాగంగా సోమవారం కోదండ రామునికి, ఆంజనేయస్వామికి ఆలయ అర్చకులు రాజా, పవన్ స్వాములు పంచామృత అభిషేకం నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ మురారి శెట్టి వెంకట సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయం..

మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయం..

పెన్ పవర్,కందుకూరు

 రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టి మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నదని స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి  అన్నారు. సోమవారం పట్టణంలోని  డి ఆర్ ఆర్ విజ్ఞాన్ భవన్  (యుటిఎఫ్ కార్యాలయం) లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ స్త్రీలకు విద్య, ఉద్యోగాలలో  సమాన అవకాశాలు ఉన్నాయని అన్నారు. సీరియల్స్ లో  స్త్రీ లను అవమానకరంగా చూపిస్తున్న మనమే వాటిని ప్రోత్సహించటం బాధాకరమన్నారు. అనేక ప్రచార మాధ్యమాలు మహిళలను కించపరిచే విధంగా సమాజంలో వారి స్థాయి తగ్గించే విధంగా ఉన్నాయని అయినప్పటికీ మహిళా సంఘాలు ఎందుకు పోరాటం చేయడం లేదో అర్థం కాలేదన్నారు. మహిళలు లేనిదే ఏ రంగం లేదని మహిళలను వ్యాపార రంగం కింద చూడడం దారుణమని అన్నారు. బలహీనతలను అధిగమిస్తే మన పాత్ర బలంగా ఉంటుందని అన్నారు. సమాజంలో స్త్రీలు బహుముఖ పాత్రలు పోషిస్తున్నారని అన్నారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న మహిళలను సమాజంలో ఎందుకు చులకనగా చూడ బడుతున్నారు, ఎందుకు చూస్తున్నారు బేరీజు వేసుకోవాలి అని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మాట్లాడిన మాటలు ఆచరణలో పెడితే మహిళా దినోత్సవానికి సార్థకత ఏర్పడుతుందని అన్నారు. పురుషులు అహంభావాన్ని చూపిస్తే మహిళలు కుటుంబ గౌరవం నిలబెట్టే విధంగా చూస్తారని అన్నారు. నేటి తరం పొందలేనిది రేపటి తరం పొందే విధంగా కృషి చేయాలని అన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అమ్మ ఒడి, ఆసరా, చేయూత, నివేశన స్థలాలు తదితర పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యదర్శి లెనీన, వీరమ్మ, ఉషశ్రీ, సరోజిని, పద్మజ సుమారు 150 మంది మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు

మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు

పెన్ పవర్,పొన్నలూరు

మండలంలోని మాల పాడు పంచాయితీ పరిధిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించినట్లు  పొన్నలూ రు సెక్టార్ సూపర్ వైజర్ కె విజయలక్ష్మి తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ శిరిగిరి శ్రీదేవి మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నారని , వారిని ఆదర్శంగా చేసుకుని ముందుకు సాగిపోవాలని ఆమె అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలందరికీ ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మాలపా డు పంచాయితీ సెక్రటరీ రవి , శిరిగిరి గోపాల్ రెడ్డి ,పంచాయితీ కార్యకర్తలు ,ఆశా వర్కర్లు ,ఆయాలు ,కిషో ర బాలికలు పాల్గొన్నారు.

తెలంగాణా సేవారత్న అవార్డు ప్రధానం

 తెలంగాణా సేవారత్న అవార్డు ప్రధానం...

పెన్ పవర్, కందుకూరు

జనార్ధన కాలనీ లో ఉన్న మండల ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయురాయలు రామలక్ష్మమ్మ కి, కమ్మ పాలెం మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజా కుమారికి కన్నతల్లి ఫౌండేషన్ వరంగల్ వారు ఇచ్చినటువంటి తెలంగాణ సేవరత్న అవార్డులను శ్రీరామ సాయి బాబా సేవా సమితి అధ్యక్షులు రవ్వ శ్రీనివాసులు,ప్రకాశం జిల్లా వాసులు సేవాదళ్ ప్రధాన కార్యదర్శి చక్కా వెంకట కేశవరావుల చేతుల మీదుగా అందజేశారు.  ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ మహిళా దినోత్సవం నాడు మహిళా ఉపాధ్యాయురాలును  గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.నేడు  సమాజంలో మహిళలు రాజకీయరంగంలో, విద్యారంగంలో, ఉద్యోగ రంగాల్లో, వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు.ఒక మహిళ తమ కుటుంబానికి ఎన్నో సేవలు చేస్తూ తమ కర్తవ్యాన్ని తాను  నిర్వహిస్తున్న దని అన్నారు.అటువంటి మహిళా సోదరీమణులకు నా హృదయపూర్వక అభినందనలు అని అన్నారు. రవ్వా  శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యారంగంలో పిల్లలను ఉన్నత స్థాయికి తీర్చే క్రమంలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది అన్నారు. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించి వారి ఉన్నత స్థితికి తోడ్పడాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాలకొండయ్య, మాధవరావు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవం రోజున మహిళలుపై దాడులా...

 మహిళా దినోత్సవం రోజున మహిళలుపై దాడులా..

రాజధాని (అమరావతి) మహిళా రైతులు దుర్గగుడికి పోవాలనుకోవడమే నేరమా

 ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదా

రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడమే మహిళా రైతులు చేసిన పాపమా

పెన్ పవర్,కందుకూరు

 రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ మహిళా దినోత్సవం రోజున రాజధాని (అమరావతి) ప్రాంతం మహిళలపై పోలీసులతో దాడి చేయించడం దుర్మార్గపు ఆలోచనని అమరావతి పరిరక్షణ సమితి జే ఎ సి కన్వీనర్  గోచిపాతల మోషే ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళల బధ్రత కోసం ప్రత్యేక చట్టాలు తెస్తామని , మహిళల వైపు ఎవరు కన్నెత్తి చూసిన గన్ కంటే ముందు జగనన్న వస్తాడని సభల్లో  ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతూ సాక్షాత్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఉచితంగా భూములు ఇచ్చిన మహిళా రైతులపై దాడి చేయించడాన్ని చూస్తేనే జగన్ మహిళలపట్ల ఏవిధంగా చిన్న చూపు చూస్తున్నాడో  అర్థమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళపై అత్యాచారం జరిగితే ఆ రాష్ట్రానికంటే ముందుగా "దిశచట్టం" కోసం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి స్వంత రాష్ట్రంలో మహిళలపై దాడులు , దౌర్జన్యాలు మరియు అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్యలు చేస్తుంటే పట్టించుకోకుండా నిస్సిగ్గుగా తిరుగుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు , ఎమ్మెల్యేలు, నాయకులు రాజధానికి భూములు ఇచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్ట్లు అనే పదేపదే పత్రిక సమావేశాల్లో మాట్లాడుతున్నారు. నిజమైన పెయిడ్ ఆర్టిస్ట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులే తప్ప రైతులు కాదనే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజధాని అమరావతి మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేస్తూ వాడిన బాష వీదిరౌడిలు , గుండాలు వాడే బాష కంటే నీచాతి నీచమైన రీతిలో వ్యవహరించి జగన్ మోహన్ రెడ్డి దగ్గర మెహార్భాని పొందటం కోసం అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళల పట్ల చూపుతున్న వివక్ష ఇకనైనా విడనాడాలని లేని పక్షంలో ఈనెల 10 తేదీన రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ , కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మోషే హెచ్చరించారు. ఈ సమావేశంలో మహిళా నాయకురాలు కొత్తగొర్ల వసంత , తానికొండ సునీత , తాటికొండ పద్మ , గంగవరపు పద్మ , కందుకూరు నియోజకవర్గ సి.పి.ఐ సహాయ కార్యదర్శి బూసి సురేష్ బాబు , మహాదేవపురం సొసైటీ మాజీ అధ్యక్షులు దామా మల్లేశ్వరావు , తెలుగుదేశం పార్టీ నాయకులు పొడపాటి మహేష్ , మాదాల మాల్యాద్రి , బత్తిన వెంకయ్య , బి.సి సెల్ మండల అధ్యక్షులు మంచికలపాటి శ్రీనివాసరావు , యస్.సి సెల్ నాయకులు కలవకూరి మణికుమార్ , టి.ఎన్.ఎస్. ఎఫ్ జిల్లా కార్యదర్శి నలమోతు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...