Followers

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లు.

 అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లు.

రెండు పీకాక్ వాహనాల పట్టివేత

డిప్యూటీ తహశీల్దార్ జయంత్


ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్

 ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఇసుక రీచ్ నుంచి ఏలాంటి అనుమతులు లేకుండా ఆక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను. రెండు ఫీకాక్ వాహానాలను ఎల్లారెడ్డిపేట వెంకటాపూర్ .గ్రామాల మధ్య శుక్రవారం తెల్లవారుజామున 3-00 గంటల ప్రాంతంలో రాజకీయ పట్టుకొని సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయానికి తరలించినట్టు ఎల్లారెడ్డిపేట మండల డిప్యూటీ తహశీల్దార్ జయంత్ తెలిపారు.  వెంకటాపూర్ ఇసుక రీచ్ నుంచి రాత్రి-పగలు అనే తేడాలేకుండా ఇసుక మాఫియా ఆక్రమంగా ఇసుకను తరలించుక పోతున్నారనీ వెంకటాపూర్ గ్రామస్థులు సిరిసిల్ల ఆర్డీవో కు పోన్ల ద్వారా,. వాట్సాప్ ద్వారా గురువారం రాత్రి పిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఆర్డీవో ఎల్లారెడ్డిపేట. ముస్తాబాద్. రెవెన్యూ అదికారులను ఆక్రమంగా ఇసుక ను తరలించే వాహానాలను పట్టుకోవాలనీ ఆదేశించగా ఎల్లారెడ్డిపేట. ముస్తాబాద్ రెవెన్యూ సిబ్బంది  శుక్రవారం తెల్లవారుజాము వరకు కాపు కాసి ఆక్రమంగా  ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను. రెండు ఫీకాక్ వాహనాలను పట్టుకొని అట్టి వాహనాలను ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ కార్యాలయం తరలించారు. ఆర్డీవో ఆదేశాల మేరకు అట్టి వాహనాలను శుక్రవారం ఉదయం సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంకు తరలించారు.

నాచారం డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలనీ వినతి

 నాచారం డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలనీ వినతి 

తార్నాక, పెన్ పవర్  

నాచారం డివిజన్ లోని పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ని నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్  కలిసి చర్చించారు. ప్రధానంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా మంజూరైన పనులు ప్రారంభం అయ్యే విధంగా చూడాలని కోరారు. డివిజన్ అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించాలని వినతి పత్రం ఇచ్చి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వనపర్తిలో శర్మిల పోస్టర్లు ఆవిష్కరణ

 వనపర్తిలో శర్మిల పోస్టర్లు ఆవిష్కరణ

వనపర్తి, పెన్ పవర్

వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో ఖమ్మంలో జరిగే షర్మిలమ్మ ఆత్మీయ సభ పోస్టర్లను వనపర్తి జిల్లా ఇంచార్జ్  లింగా రెడ్డి జశ్వంత్ రెడ్డి, వెంకటేష్ అవిష్కరించారు. ఈ సందర్భంగా జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ శర్మిలమ్మ సభకు వనపర్తి నియోజకవర్గం నుండి అధిక మొత్తంలో వైఎస్సార్ అభిమానులు జిల్లా నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వై.వెంకటేష్, మధులత, రమేష్ యాదవ్, ఆంజనేయులు రాము, భాస్కర్, రాజశేఖర్, అవినాష్, పెద్ద కోటయ్య, 98 జీవో వెంకటేష్, మహేష్ , ప్రసాద్ పాల్గొన్నారు.

అత్యాధునిక హంగులతో మల్లాపూర్ వైకుంఠధామం

 అత్యాధునిక హంగులతో మల్లాపూర్ వైకుంఠధామం - కార్పొరేటర్ పన్నాల

తార్నాక ,  పెన్ పవర్

అన్ని హంగులతో మల్లాపూర్ వైకుంఠధామం ప్రజలకు అందుబాటులోకి  రాబోతుందని స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అన్నారు. స్వాగత తోరణాలు. షెడ్లు, వాహనాల పార్కింగ్, దహనవాటికలు, స్నాన గదులు, పచ్చదనం,  మౌలిక సదుపాయాలతో రూపురేఖలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని అన్నారు. మంత్రి కేటీఆర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గార్ల చొరవతో వైకుంఠధామం హంగులతో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అనంతరం శివుని విగ్రహానికి పూజలు చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైకుంఠధామానికి  సహకరించి తోడ్పడిన జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి, జిఎచ్ఎంసి అధికారులు, కాంట్రాక్టర్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఈ ఈ కోటేశ్వర్ రావు, ఏ ఈ వేణు, వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి స్థానిక నాయకులు హమాలీ శ్రీనివాస్, పీఆర్ ప్రవీణ్,  నెమలి రవి, నెమలి అనిల్, సూర్నమ్ శివ, శ్రవణ్, బ్యాగారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల విగ్రహాల ఏర్పాటును అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి

 మహనీయుల విగ్రహాల ఏర్పాటును అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి 

తార్నాక, పెన్ పవర్ 

హైదరాబాద్ నాచారం డివిజన్ ఎర్రగుంట లో డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాల ఏర్పాటుకు దిమ్మలు నిర్మిస్తుండగా వాటిని అర్ధరాత్రి జిహెచ్ఎంసి అధికారులు కూల్చి వేయడాన్ని నిరసిస్తూ దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ నాచారం ఎర్రగుంట దగ్గర గతంలో అంబేద్కర్ విగ్రహం ఉందని, అదే స్థలంలో  విగ్రహం పునర్నిర్మాణం కోసం ఏర్పాట్లు చేసుకుంటే  కొందరు వ్యక్తులు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి అర్ధరాత్రి దిమ్మలను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాన్ని  కూల్చే వేయడంపై దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. దిమ్మలు కూల్చివేసిన వారి పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ రావు, నరేందర్ ,నల్ల బాబు ,విశ్వనాథ్, తిరుపతి, అశోక్ ,మహేష్, బిక్షపతి ,వాసు, ఆశన్న శంకర్ ,పి శంకర్ ,దానం ,వినయ్ ,రాజు ,మహేందర్, ప్రభాకర్, క్రాంతి ,శివ, మల్లేష్, మరియు దళిత నాయకులు పాల్గొన్నారు.

ఓయూ లో బొడ దేవీలాల్ జన్మదిన వేడుకలు

 ఓయూ లో బొడ దేవీలాల్ జన్మదిన వేడుకలు

తార్నాక, పెన్ పవర్

గిరిజన శక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ నాయక్   ఆధ్వర్యంలో నేషనల్ హైవే అథారిటి ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ బొడ దేవీలాల్ (ఐఈఎస్)  జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీ లో ఘనంగా నిర్వహించారు. గిరిజన పేద కుటుంబంలో జన్మించి  ఇంత పెద్ద స్థాయికి రావడం ఈ రోజుల్లో చాలా మంది పేద గిరిజన యువకులకు దేవీలాల్ ఆదర్శవంతం అని శరత్ నాయక్  అన్నారు. ఆయన జీవితం చిన్న వయసునుండి ఎంతో కష్టపడి  నమ్ముకొని ఈ స్థాయికి వచ్చి ఎంతో మంది పేద విద్యార్థులకు సహాయం చేస్తూన్న వ్యక్తి అని కొనియాడారు.  చదువు యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ తనలాగే గొప్ప అధికారులుగా  ఎదగాలని విద్యార్థులకు దేవిలాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్, ఈఈ హరీష్, బంజారా గీత రచయిత యాకూబ్ నాయక్, యువ పారిశ్రామికవేత్త పవన్ రాథోడ్, గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి భూక్య నరేష్ నాయక్, జహెద సుల్తానా, కేసికే నాయక్, ఏపీ స్టేట్ ఎండీ డాక్టర్, జయభరతి, ఝాన్సీ రాణి, తులసిరామ్, సునీత, ధనాసింగ్, శ్రీవాణి,తదితరులు పాల్గొన్నారు.

పోలీసు అధికారుల రిక్రియేషన్ హల్ ను ప్రారంభోత్సవం చేసిన ... విశాఖ జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు

 పోలీసు అధికారుల రిక్రియేషన్ హల్ ను ప్రారంభోత్సవం చేసిన ... విశాఖ జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు

విశాఖ తూర్పు, పెన్ పవర్

విశాఖపట్నం జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఐపిఎస్ పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు కొరకు ఆర్ముడు రిజర్వ్ కైలాసగిరి పోలీసు మైదానం దరి షాపింగ్ కాంప్లెక్స్ పైన నూతనంగా నిర్మించిన “రిటైర్డ్ పోలీసు అధికారుల రిక్రియేషన్ హల్” ను ప్రారంభోత్సవం చేశారు. 1983 సం లో సిటీ, రూరల్ గా పోలీసులు విడిపోయిన తర్వాత రూరల్ జిల్లాలో పదవీ విరమణ పొందిన పోలీసులకు రిక్రియేషన్ హల్ లేకపోవడంతో వారి అభ్యర్థన మేరకు జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని, 30 నుంచి 40 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసుకొని సాటి పోలీసులు కలిసి మెలిసి ఉండుటము వలన కుటుంబ సభ్యులుతో కన్నా తోటి ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల వారిలో ఎంతో ఆత్మీయ బంధం పెనవేసుకుంటుందన్నారు.

 అటువంటి వారికి  ఈ రిక్రియేషన్ హల్ స్వాంతన చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నూతనంగా నిర్మించిన రిక్రియేషన్ హాల్ లో కేరంస్, చేస్, న్యూస్ పేపర్లు మొదలైనవి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీరంతా పోలీస్ కుటుంబ సభ్యులేనని మీకు ఎటువంటి అవసరం వచ్చినా నేరుగా నన్ను కలవాలని అవసరమైతే మీ సేవలు కూడా పోలీస్ శాఖ ఉపయోగించుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే అర్మేడ్ రిజర్వ్ డి.ఎస్.పి., ఆర్.పి.ఎల్. శాంతికుమార్ వ్యక్తిగత శ్రద్ద కనబరిచి ఈ హాల్ ను నిర్మించడం అభినందనీయమని జిల్లా ఎస్.పి., అన్నారు.పదవి విరమణ పొందిన మొత్తం 50 మంది పోలీసు అధికారులు, తాము కొన్ని సంవత్సరాలుగా తమ కోర్కెను, తెలియజేస్తున్నామని, 

కానీ ప్రస్తుత జిల్లా ఎస్పీ దృష్టికి ఈ విషయం తీసుకు వచ్చిన వెంటనే స్పందించి తక్కువ సమయంలో మేము కోరుకున్న రిక్రియేషన్ హాల్ ను నిర్మించి మాకు అందించడం చాలా ఆనందంగా ఉందని చెబుతూ జిల్లా ఎస్.పి. కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ అదనపు ఎస్పీ ఎస్.ఈ.బి ఆర్.పి.ఎల్. శాంతికుమార్ డిఎస్పి ఎఆర్., జీ.వి.రమణ ఇన్స్పెక్టర్ డిఎస్బి. రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, అరవింద్ కిషోర్, మురళీ మోహన్ రావు మరియు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...