Followers

ఆదిత్య యూత్ రెడ్ క్రాస్ యూనిట్ చే అడాప్ట్ ఎబౌల్ ఈవెంట్

ఆదిత్య యూత్ రెడ్ క్రాస్ యూనిట్ చే అడాప్ట్ ఎబౌల్ ఈవెంట్

పెన్ పవర్,గండేపల్లి

గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్యా ఇంజనీరింగ్ క్యాంపస్ వేసవి లో పక్షులను పరిరక్షించేందుగుకు ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ యూత్ రెడ్ క్రాస్  యూనిట్ చే అడాప్ట్ ఏ బౌల్ ఈవెంట్ ను చేపట్టినట్టు ఆదిత్య రెడ్ క్రాస్ యూనిట్ సభ్యులు తెలిపారు.వేసవి లో పక్షుల దాహాన్ని తీర్చేందుకు  ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు అడప్ట్ ఏ బౌల్ అన్నే ఈవెంట్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అందులో భాగంగా పక్షలకు క్యాంపస్ పరివాహక ప్రాంతం లో పర్యావరణానికి హానికరం కాని  మట్టి తో చేసిన పాత్రలలో  నీటిని  ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగాన్ని విజయవంతం గా విద్యార్థుల సహకారం తో ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద మేడలు పై నా మట్టి పాత్రలు ఉంచి వేసవి అంతా నీటిని అందించేందుకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల  ప్రిన్సిపాల్ డా.ఎమ్. శ్రీనివాసరెడ్డి యూనిట్ సభ్యులను అభినందించారు.ఈకార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ ఎఫైర్స్.ప్రొ.జె.డి.వెంకటేష్, ఆదిత్య రెడ్ క్రాస్ యూనిట్ కో.ఆర్డినేటర్. ప్రొ.ఎస్.బి.జి.తిలక్ బాబు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

గుండెపోటుతో మరణించిన పి.ఈ .టి

 గుండెపోటుతో మరణించిన పి.ఈ .టి 

బెల్లంపల్లి ,  పెన్ పవర్ 

మంచిర్యాల జిల్లా. బెల్లంపల్లి మండలం లో విషాదం చోటు చేసుకుంది,తాండూర్ మండలంలో  తాసిల్దార్ గా పనిచేస్తున్న కవిత భర్త బెల్లంపల్లి సెంట్ మేరీస్ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న  అనిల్ కుమార్ ఉదయం బ్యాట్మెంటన్  ఆడుతూ ఒక్కసారిగా గుండెపోటు రావడంతో చనిపోయాడు. విషయం తెలుసుకున్న సెంట్ మేరీస్ పాఠశాల యాజమాన్యం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అనిల్ పీఈటి చనిపోవడం ఎంతో విషాదకరం అని అన్నారు, వివిధ పార్టీల నాయకులు , తాసిల్దార్ లు, రెవిన్యూ సిబ్బంది, పట్టణ ప్రజలు అనేక మంది అక్కడికి చేరుకొని నివాళులర్పించారు.

సింగరేణిలో యువకార్మికులు అందరు కలిసి పోరాడాలి

 సింగరేణిలో యువకార్మికులు  అందరు కలిసి పోరాడాలి


మందమర్రి,  పెన్ పవర్

సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లు,జనరల్ మజ్దూర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి,సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువ కార్మికులందరూ కలిసి పోరాడాలని తెలంగాణ బదిలీ వర్కర్స్, మజ్దూర్స్ ఫోరం అధ్యక్షులు కొప్పుల శ్రీనాథ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మందమర్రి పట్టణంలోని ఇందూ గార్డెన్ లో ఫోరం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి వ్యాప్తంగా సుమారు 150 మంది సభ్యులు పాల్గొని, ఫోరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం నూతన అధ్యక్షుడిగా కొప్పుల శ్రీనాథ్, ప్రధాన కార్యదర్శిగా బొగ్గుల సాయి కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా హర్షవర్ధన్ లను ఎన్నుకున్నారు. అదేవిధంగా  సింగరేణి వ్యాప్తంగా 11ఏరియాలకు ఏరియా ఉపాధ్యక్షులను నియమించారు. అనంతరం అధ్యక్షులు కొప్పుల శ్రీనాథ్ మాట్లాడుతూ, త్వరలోనే సింగరేణి వ్యాప్తంగా బాయి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం 2014 డిపెండెంట్ ఉద్యోగాల కోసం కృషిచేసిన కొప్పుల శ్రీనాథ్, చెల్పూరి సతీష్, సాదుల సంతోష్ లను సభ్యులు సన్మానించారు. అదేవిధంగా డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ కోసం పోరాడి, ఇటీవల అకాల మరణం చెందిన ఆర్కే 7 ఉద్యోగి సుగుణకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఫోరం నాయకులు సారంగపాణి, సంతోష్ పాండే, పెండం సాయికృష్ణ, సంతోష్, రవి యాదవ్, కాదశి రమేష్, అవినాష్, సూర్యనారాయణ సూర్య నాయక్, సంతోష్ రెడ్డి, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

యేసుక్రీస్తు సర్వమానవ పాపలకై మరణించారు

 యేసుక్రీస్తు సర్వమానవ పాపలకై మరణించారు: పాస్టర్ డేవిడ్ కులేరి

మండలంలో వైభవంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

ఎల్లారెడ్డిపేట,  పెన్ పవర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లోని ఐపీసి హోలి చర్చి ఆద్వర్యంలో  శుభ శుక్రవారం ఆరాధన  అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎల్లారెడ్డిపేట ప్రార్థన దేవాలయాల్లో యేసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానించి, ప్రత్యేక ప్రార్థనలు చేసారు. పాస్టర్ డేవిడ్ కులేరి యేసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు ధ్యాన సందేశం అందించారు. దేశం కోసం, ప్రజా ప్రతినిధి ప్రతినిధులకై, కరోనా నివారణ కోసం, ప్రజా శ్రేయస్సుకై  ప్రార్థించారు. దైవజనురాలు సమాధానం, సంఘ పెద్దలు అమృతరావు, సముయేలు, దానియేలు,  శుభ శుక్రవార ఆరాధన కార్యక్రమం నడిపించారు.

నెల్లిపాక లో చలివేంద్రం ప్రారంభించిన యువకులు

 నెల్లిపాక లో చలివేంద్రం ప్రారంభించిన యువకులు 

ఎటపాక,పెన్ పవర్ 

 చలివేంద్రం ప్రారంభించిన నెల్లిపాక  దళిత యూత్ సభ్యులు వివరాల్లోకి వెళితే  మండల పరిధిలోని నెల్లిపాక గ్రామంలో  గత ఐదు రోజుల క్రితం  నెల్లిపాక దళిత యూత్ యువకులు నెల్లిపాక కూనవరం రోడ్డు  హెచ్పీ పెట్రోల్ పంప్  ఎదురుగా  చలివేంద్రాన్ని  ప్రారంభించారు. వారు మాట్లాడుతూ చలివేంద్రం ప్రారంభించడం  సంతోషకరమని అన్నారు  ఆ రోజు నుంచి నేటి వరకు   బాటసారుల మిర్చి  కోతలకు వచ్చే కూలీలు ఇక్కడ ఆగి వారి దాహార్తి తీర్చుకుంటున్నారని యువకులు అంటున్నారు.ఇక్కడ చలివేంద్రం పెట్టి అందరికీ నీళ్లు ఇస్తున్నందుకు అందరూ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు, అని వారు అంటున్నారు.

ఇద్దరికి కరోనా పాజిటివ్

 ఇద్దరికి కరోనా పాజిటివ్

మండల వైద్యాదికారి డాక్టర్ మానస వెల్లడి

పెన్ పవర్, ఎల్లారెడ్డిపేట

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 87  మందికి కరోనా నిర్ధారణ కోసం పరీక్షలు చేయగా ఇద్దరి కి  కరోనా పాజిటివ్  రాగా 85 మందికి నెగిటివ్ వచ్చినట్టు మండల వైద్యాదికారి డాక్టర్ మానస తెలిపారు. రాజన్నపేట గ్రామనికి ఇద్దరికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు  నిర్దారణ అయ్యిందన్నారు. కరోనా నిర్దారణ అయిన వ్యక్తులు  కంట్రోల్ అయ్యేంతవరకు  కుటుంబ సభ్యులకు దూరంగా మాస్కులు దరించి ఉండాలని . ప్రతి రోజు గోరువెచ్చని నీటినే తాగాలనీ ఆయన పిలుపునిచ్చారు. కరోనా సోకినట్టు అనుమానం ఉన్న వ్యక్తులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ధర్మానాయక్ కోరారు. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో కోవీడ్ వాక్సినేషన్  కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో భాగంగా 45 సంవత్సరాల వయస్సు పై బడిన ప్రతి ఒక్కరికీ ( దీర్ఘకాలిక వ్యాదులతో సంబంధంలేకుండా ) వాక్సిన్  ఇవ్వబడుతుందన్నారు. లబ్దిదారులు అందరు కూడా ఆధార్ కార్డ్ తో రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా సద్వినియోగ పర్చుకోవాలనీ  డాక్టర్ మానస తెలిపారు.

పంచతత్వ పార్కు..మంచి నీటి పైపులైను ఏర్పాటుకు వినతి

 పంచతత్వ పార్కు..మంచి నీటి పైపులైను ఏర్పాటుకు వినతి.. 



కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129 సూరారం డివిజన్ పరిధిలోని వైష్ణవి నగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను తన నివాసం వద్ద, స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో పంచతత్వ పార్క్ ఏర్పాటు చేయాలని మరియు త్రాగునీటి సమస్య పరిష్కారానికి అదనంగా 150 మీటర్ల మంచి నీటి పైపు లైను ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే వివేకా నందకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. కాలనీలో అదనంగా మంచి నీటి పైపు లైను నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పంచతత్వ పార్క్ ను కూడా ఏర్పాటు చేస్తామని కాలనీవాసులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ యాదిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సయ్య, జనరల్ సెక్రటరీ నాగభూషణం మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...