Followers

పరలోకానికి ఉచిత మార్గమే గుడ్ ఫ్రైడే

 పరలోకానికి ఉచిత మార్గమే గుడ్ ఫ్రైడే

యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి విడుదల కలుగును

కేసముద్రం, పెన్ పవర్

 పరలోకానికి మానవాళికి మార్గాన్ని చూపించి నడిపించేందుకు భూమిపైన ఏసుక్రీస్తు సిలువ బలి యజ్ఞం చేశారని  ఆయన భూమికి ఆకాశానికి మధ్య సిలువలో వ్రేలాడి అర్పించిన ప్రమాణమును బట్టి చిందించిన పరిశుద్ధ రక్తం ను బట్టి మానవాళికి -జన్మతహా కర్మ తహ పాపం నుంచి విడుదల చేసి నరకపు సంకెళ్ళను  తెంచి  క్రయధనముగా తన రక్తమును వెళ గా చెల్లించి సకల మానవాళిని ఉచితముగా పరలోకానికి ముక్తిని ఇచ్చేందుకు ఏసుక్రీస్తు భూమి పై బలి ( ప్రాణార్పణ) అయ్యారని పరిశుద్ధ గ్రంధం బైబిల్ తెలియజేస్తుంది, రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్ దేశం లో ఇదే రోజు శుక్రవారం ఆయన సిలువలో బలిగా తన ప్రాణమును అర్పించాలని ఏసుక్రీస్తు మాట్లాడుతూ నా ద్వారానే తప్ప పరలోకం ఎవరూ రాలేరని నేను మానవాళి మనుషులను పరలోకం తీసుకువెళ్లేందుకు భూ లోకం లోకి వచ్చానని' నేనే మార్గము సత్యము జీవము ఐ ఉనాన్నని ఆయన తెలిపారు నాటి నుండి నేటి వరకు క్రైస్తవ సమాజం ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఆనందంగా క్రైస్తవ పాటల తో పరిశుద్ధ గ్రంధం లోని వాక్యాలు పట్టణాలతో భక్తిశ్రద్ధలతో ప్రపంచ మానవాళి భక్తులు జరుపుకుంటున్నారు. ఆయన చూపించిన ప్రేమ దయ జాలి కరుణ కనికరము తగ్గింపు ప్రతి ఒక్కరూ ఇతరులకు చూపించాలని అగాపే గాస్పల్ ఫుల్ చర్చ్ పాస్టర్ పిల్లి కుమారస్వామి గారు ప్రజలకు తెలిపారు. 

సునీల్ నాయక్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

 సునీల్ నాయక్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : ఏబీవీపీ



కూకట్ పల్లి, పెన్ పవర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ నిరుద్యోగులకు న్యాయం జరగలేదని, తన చావుతో అయినా నిరుద్యోగుల దుస్థితి ప్రభుత్వానికి తెలిసొస్తుందని భావిస్తూ పురుగుల మందు తాగి మరణించిన కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సునీల్ నాయక్ మృతికి ముమ్మాటికీ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు కూకట్ పల్లి లోని జె.ఎన్.టి.యూ ప్రధానద్వారం ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ వినోద్ హిందూస్థానీ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్ష తొంభై వేల పైచిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ తెరాస ప్రభుత్వం నిర్లక్ష ధోరణితో వాటిని భర్తీ చేయకుండా కాలం వెల్లదిస్తుందని, నిరుద్యోగుల చావుకు కారణమవుతున్న కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారాల్సిన యువత పీనుగలై పాడేక్కుతున్నారని ఆయన విమర్శించారు. సునీల్ నాయక్ కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష వైఖరే కారణమని, ఈఘటనపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. పరిపాలన చేతగాని అసమర్ధ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతికి, గవర్నర్ కు నివేదికలు అందిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా నిరసన నిర్వహించిన విద్యార్థులను కె.పి.హెచ్.బి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈకార్యక్రమంలో  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సనీల్, మురళీ, ఇతర నాయకులు రామకృష్ణ, సుధీర్, మనోజ్, గోపాల్, ప్రశాంత్, యశ్వంత్, మహేష్, జగన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఆళ్ళంపల్లి రాజబాబు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ద్రోణంరాజు శ్రీవత్సవ్,పి.ఏస్.ఎన్.రాజు

 ఆళ్ళంపల్లి రాజబాబు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ద్రోణంరాజు శ్రీవత్సవ్,పి.ఏస్.ఎన్.రాజు

మహారాణి పేట, పెన్ పవర్

వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆళ్ళంపల్లి రాజబాబు నీ శుక్రవారం పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ద్రోణంరాజు శ్రీవత్సవ్ మరియు మాజీ వుడా చైర్మన్ పి.ఏస్.ఎన్. రాజు(రవి) తదితరులు పోల్గొన్నారు.

నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన వంశి

 నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన వంశి    

విశాఖ తూర్పు, పెన్ పవర్

 శ్రీ శ్రీ శ్రీ సీతారామ సేవా సంఘం, పాత వెంకోజిపాలెం గ్రామ కమిటీ నూతన కార్యవర్గం వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ని శివాజిపాలెం నివాసంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చెమ్ అందజేశారు. గ్రామ అభివృద్ధి కి నిరంతరం కృషి చేయాలని, తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడు వుంటాయని అన్నారు.నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కర్రి శ్రీను ని కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి అప్పలరాజు, సెక్రెటరీ  ఆడారి శివ ప్రసాద్, కోశాధికారి వాసు, జాయింట్ సెక్రటరీ రమేష్, చంద్ర శేఖర్ తో పాటు వైసీపీ సీనియర్ నాయకులు పీలా వెంకట పరదేసి నాయుడు  పాల్గొన్నారు.

వ్యాక్సిన్ వేయించుకోండి కరోనా వైరస్ ని అరికట్టండి

 వ్యాక్సిన్ వేయించుకోండి కరోనా వైరస్ ని అరికట్టండి

మహారాణి పేట, పెన్ పవర్

135 కోట్ల ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రధానమంత్రి మోడీ ధ్యేయం భారతావనిలో కరోనా వైరస్ రెండవ దశ తీవ్రంగా విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ  తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు . వ్యాక్సిన్ ప్రక్రియ నత్తనడకన నడుస్తున్నదని ఈ ప్రక్రియ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రధాని మోడీ ప్రజా ఆరోగ్య సంక్షేమం దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా నిరంతరము భారత శాస్త్ర వేత్తలతో సంప్రదిస్తూ,వారిని ఉత్సాహపరుస్తూ  వారు కోరిన విధముగా మౌలిక సదుపాయాలు చేకూర్చి అతి తక్కువ వ్యవధిలో ప్రజలకు అందుబాటులోకి వ్యాక్సిన్ వచ్చే విధముగా కృషి చేశారని,భారత్ లో తయారైన ఈ వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలు గుర్తించాయని 70 దేశాలకు పైగా ఈ వ్యాక్సిన్ను సరఫరా చేస్తున్నారని అన్నారు.ప్రజల వ్యాక్సిన్ తీసుకొనుటకు  ముందుకు రావడం లేదని, వ్యాక్సిన్ తీసుకోవటం వలన ఎటువంటి దుష్ఫలితాలు రావాని ,45 సంవత్సరాలు పైబడిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకొనుటకు  అర్హులు అని అన్నారు. ప్రధాని మోడీ  వ్యాక్సిన్ను ప్రక్రియను  వేగవంతం చేయాలని అధికారులను  ఆదేశించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా నిరంతరము మాస్కులు ధరించాలని ,శానిటైజర్ ఉపయోగించుకోవాలని , భౌతిక దూరం పాటించాలని ,పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తరచుగా  గోరువెచ్చటి మంచినీరు అని వేడి పదార్థములనే భుజించాలని, ప్రతి ఇంట్లోనూ ఒక మెడికల్ కిట్ ను భద్రపరుచుకోవాలి అని ,రద్దీ ప్రాంతములలో  తిరగరాదని ,మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నది అని అన్నారు.ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రక్రియ పట్ల సామాజిక ప్రచార సాధనముల ద్వారా, చరవాణి ,అన్ని రకాల టీవీ ఛానల్స్ ద్వారా,ప్రింట్ , ఎలక్ట్రానిక్   మీడియా ద్వారా,వ్యాక్సిన్ వేయించు కొనుట వలన వచ్చే  ఉపయోగములను ఈ ప్రచార సాధనముల ద్వారా  తెలియజేయాలని  అన్నారు.  ఈ ప్రక్రియ కోసము స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు  ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ పై అవగాహన కల్పించి  ఈ కార్యక్రమమును విజయవంతం చేయడానికి కరోనాను కట్టడి చేయడానికి  చేయాలని పిలుపునిచ్చారు.

భగ్గుమంటున్న భానుడు....!

 భగ్గుమంటున్న భానుడు....!

గత రెండు రోజులుగా 40 డిగ్రీలు..మొదలైన వడగాల్పులు  

బయటకివెళ్లాలంటేనే జంకుతున్న జనం - నిర్మానుషంగా పట్టణ రహదారులు




లక్షెట్టిపెట్, పెన్ పవర్

భానుడి భగభగలకు మండల వ్యాప్తంగా ఎండలు దంచుతున్నాయి రెండు మూడు రోజులు గా  ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. ఈ క్రమంలో శుక్రవారం ఎక్కువగా 42 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మూడు నాలుగు రోజులగా పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా  నమోదువుతుండగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరిగాయి దీనికి తోడుగా రెండు రోజులుగా వడ గాడ్పులు కూడా మొదలు కావడంతో ఎండకు జనం  అల్లాడిపోతున్నారు.ఎండ తీవ్రతకు శుక్రవారం లక్షెట్టిపెట్ పట్టణ రహదారులు ఉత్కూర్ చౌరస్తా,గాంధీ చౌక్,పాత బస్టాండ్ ఏరియాలలో చాలా వరకు  జన సంచారం లేకుండా నిర్మానుష్యంగా మారాయి..

జోరుగా వేసవి వ్యాపారం

ఎండలు ముదరడంతో వేసవి సీజన్ వ్యాపారులతో జోరందుకుంది మండల కేంద్రంలో తదితర ప్రాంతాలల్లో ఎలక్ట్రిషన్ షాపుల వద్ద జనం బరులుదిరుతున్నారు ఎండ నుంచి ఉపశనం పొందేందుకు గాను ప్రజలు ఇప్పటికే తమ ఇంట్లో ఉన్నటువంటి కూలర్లు,ఏసీలను రిపేర్ చేయించడంతోపాటుగా కొత్తవి కొనుగోలు చేస్తున్నారు.అలాగే చల్లని మంచినీళ్ల కోసం కొత్త కుండలను, రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేస్తున్నారు..

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

స్వచ్ఛ మల్లేపల్లి గ్రామం గా తీర్చిదిద్దేందుకు కృషి 

మల్లేపల్లి సర్పంచ్ బలిరెడ్డి వరలక్ష్మీ గంగరాజు, ఉపసర్పంచ్ దొమ్మా శ్రీను 

పెన్ పవర్,గండేపల్లి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని మల్లేపల్లి గ్రామాన్ని స్వచ్ఛ మల్లేపల్లి గ్రామం గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి కృషి చేద్దామని మల్లేపల్లి గ్రామ సర్పంచ్ బలిరెడ్డి వరలక్ష్మి గంగరాజు, ఉపసర్పంచ్  దొమ్మా శ్రీను లు పిలుపునిచ్చారు. శుక్రవారం మల్లేపల్లి లోని యువత, మహిళలు, ఆరోగ్యకార్యకర్తలు ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అన్నపురాజుపేట, పాతూరు, కొత్తూరు, నీలకుండీలపేట ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అప్పుడే గ్రామం అన్ని రంగాలలోను అభివృద్ధి చెందుతుందని సూచించారు. గ్రామాన్ని స్వచ్ఛ మల్లేపల్లి గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.గ్రామంలోని విద్యావంతులు, రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్లతో గ్రామ అభ్యుదయ సమితిని ఏర్పాటు చేయడం జరిగిందని దీని ద్వారా ప్రభుత్వం అనుసంధానంతో గ్రామంలోని వినూత్న కార్యక్రమాలు చేపట్టి గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామన్నారు. ఇందుకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. రానున్న రోజుల్లో దేశంలోనే మల్లేపల్లి గ్రామానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా చేయాలనేదే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో తాతాజీ మాష్టారు,ఆలేటి రవి, హై స్కూల్ చైర్మన్ బలిరెడ్డి శ్రీను, గొర్రెల శివ, బలిరెడ్డి శ్రీధర్, బత్తుల వీరబాబు, తెలగరెడ్డి భాస్కరరావు, చింతపల్లి సుబ్బారావు, పొంతపల్లి సత్తిబాబు, అధిక సంఖ్యలో మహిళలు, వాలంటీర్లు, విద్యార్థిని విద్యార్థులు, పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...