Followers

తెరాస ప్రభుత్వం హయం లోనే అభివృద్ధి సాధ్యం

 తెరాస ప్రభుత్వం హయం లోనే అభివృద్ధి సాధ్యం

తార్నాక , పెన్ పవర్ 

మల్లాపూర్ డివిజన్ లోని గ్రీన్ హిల్స్ లో 145 లక్షల వ్యయంతో ఆర్సీసీ  బాక్స్  డ్రైన్ నిర్మాణ పనులును  ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా  ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వంలో  అభివృద్ధి దూసుకుపోతుందని అన్నారు. అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షులు పల్లా కిరణ్ కుమార్ రెడ్డి , గ్రీన్ హిల్స్ కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు , కార్యవర్గ సభ్యులు , స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగానే మంచినీటి బోర్వెల్ సాధించుకున్నాము

కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగానే మంచినీటి బోర్వెల్ సాధించుకున్నాము
అరకు, పెన్ పవర్

కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగా చినలబుడు పంచాయతీకి చెందిన మాలసింగారం గ్రామంలో శనివారం ఉదయం 8 గంటల నుండి మంచినీటి బోర్వెల్ తవ్వుతున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి ఆధ్వర్యంలో అరకువేలి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ మంచినీటి కొరతను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ పత్రికల ద్వారా అర్జీల ద్వారా అధికారులకు  విన్నవించినందుకే ఈ సామాజిక మంచినీటి బోర్వెల్ సాధించుకున్నామని ఇది కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితమేనని ఈ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని  పంచాయితీ ప్రజలు గ్రహించి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పారు, ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మన నవ యువ నాయకుడు పంచాయతీ సర్పంచ్ బురిడీ  ఉపేంద్ర కి  మరియు ఆర్. డబ్ల్యు, ఏ.ఈ కి వారి బృందం అంతటికీ పత్రికల్లో ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పత్రిక సోదరులందరికీ అభినందిస్తు ధన్యవాదాలు తెలియజేశారు, మిగతా మోటార్, ట్యాంక్, గొట్టాలు, వాటర్ టెప్ కనెక్షన్లు త్వరలోనే బిగించి మంచి నీళ్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు, ఈ కార్యక్రమంలో మొస్య దేవదాసు, మొస్య బుజ్జి బాబు, సుంకరి బాలమురళి, వార్డు నెంబర్ కిల్లో లక్ష్మి వార్డు నెంబర్ మొస్య నాగేశ్వరరావు, వాలంటీర్ ఎం అర్జున్ ఎం మిస్సియమ్మ, ఎం సుభాషిని,ఎం అరుణ, ఎం.జగన్నాథం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మహిళలు యువత పాల్గొన్నారు.

ఎన్నికల బరిలోకి దిగనున్న తేదేపా

ఎన్నికల బరిలోకి దిగనున్న తేదేపా

సంతబొమ్మాలి,పెన్ పవర్

సంతబొమ్మాళి మండలంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని తేదేపా మండల పార్టీ అధ్యక్షులు జీరు భీమారావు తెలిపారు. సంతబొమ్మాలి మండల కేంద్రంలో శనివారం  మండల తేదేపా నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అధినేత ఎన్నికలలో పాల్గొనవద్దని, ఎన్నికల బహిష్కరించాలని పిలుపునిచ్చినా పార్టీ మనుగడ, పార్టీ పురోగతి దృష్ట్యా ఎన్నికలలో పోటీ చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాలు, జెడ్పిటిసి స్థానానికి జరుగనున్న ఎన్నికలలో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని తీర్మానం చేశారు. మండలం లోని తెదేపా నాయకులు రెడ్డి అప్పన్న, కర్రీ విష్ణుమూర్తి, ధర్మార్జున్రెడ్డి,  తేదేపా జెడ్ పి టి సి అభ్యర్థి పుక్కల్ల శ్రీను, వసంతరావు, 20 మంది తెదేపా అభ్యర్ధులు, కార్యకర్తలు, తెదేపా మద్దతు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి

 పార్టీలకు అతీతంగా అభివృద్ధి

అభివృద్ధికి అందరూ సమానమే

ప్రమాణస్వీకారోత్సవం లో నూతన సర్పంచ్లు

పాచిపెంట,పెన్ పవర్

  అభివృద్ధికి అందరూ సమానమేనని, పార్టీలకతీతంగా అభివృద్ధి చేపడతామని  కొటికిపెంట, కేసలి నూతన సర్పంచులు ఇజ్జాడ అప్పలనాయుడు, ఎస్ నిర్మల ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా పంచాయతీ కార్యదర్శులు సర్పంచుల తో ప్రమాణ స్వీకారం చేయించగా, వైస్ సర్పంచు, మెంబర్ల తో సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి అనేది అందరికీ సమానమేనని ఓట్లు వేసినా, వేయకపోయినా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత మాపై ఉందని పేర్కొన్నారు. విద్య, వైద్యం,త్రాగునీరు,  రహదారుల సౌకర్యం, ఉపాధి హామీ పథకం  అమలు చేసే విధానంపై ప్రత్యేక దృష్టి సారించి పంచాయతీ ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని సర్పంచులు ఇరువురు పేర్కొన్నారు. పంచాయతీ లో గల గ్రామాల అన్నింటిలో తరచూ పారిశుద్ధ్యం పనులు చేపట్టి ఏ ఒక్కరికి అనారోగ్య సమస్య రాకుండా చూస్తామని తెలియజేశారు. భీమా మిత్ర,, పింఛన్లు, తదితర అంశాలపై లబ్ధిదారులకు ఎల్లవేళలా సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తామన్నారు. పంచాయితీ లో ఏ సమస్యలు ఎదురైనా బాధితులు తమ వద్దకు వచ్చి సమస్త చెబితే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. కొటికిపెంట సర్పంచు అప్పలనాయుడు వార్డ్ మెంబరలందరికీ ప్రత్యేకంగా పలకరించి ఎటువంటి మొహమాటం పడకుండా  సమస్యలు చెబితే పరిష్కరిస్తామన్నారు. అలాగే కర్రీ వలస, గురువు నాయుడుపేట, తదితర పంచాయతీల్లో సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు.పాచిపెంట మండలం కేసలి నూతన సర్పంచ్ నిర్మల తను ప్రమాణ స్వీకారోత్సవం చేసిన సందర్భంగా150 మంది స్కూలు విద్యార్థులకు స్టీలు కంచాలు,  స్టీలు గ్లాసులు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన పిల్లల తల్లిదండ్రులు, గ్రామ పంచాయితీ  పెద్దలు నూతన సర్పంచ్ ను అభినందించారు.

ధర్మం వైపు నిలబడతా

ధర్మం వైపు నిలబడతా 

గుమ్మలక్ష్మీపురం,పెన్ పవర్ 

రాష్ట్రం మొత్తం మీద నూతనంగా ఎన్నిక కాబడిన పంచాయతీలోని నూతన పాలకవర్గాలకు ప్రభుత్వం తరుపున అధికారికంగా ప్రమాణస్వీకార కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో గుమ్మలక్ష్మీపురం గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి సూరు.శ్రీనివాసరావు అధ్యక్షతన నూతన సర్పంచ్ బొత్తాడ.గౌరీశంకర్,ఉప సర్పంచ్ కొత్తకోట.కిషోర్ తో పాటుగా ఆ పంచాయతీ వార్డు సభ్యులు అరుణ ,లక్ష్మి,ఈశ్వరరావు,మంజుల,రవి,శ్రీను,సోములమ్మ,వెంకట్రావు,శోభ రాణి లు ప్రతిజ్ఞ చేసి వారి బాధ్యతలను స్వీకరించారు.నూతన గుమ్మలక్ష్మీపురం  గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్ బాధ్యతలను స్వీకరించిన అనంతరం గాందిజీకి పూలమాలను వేసి నమస్కరించారు. సర్పంచ్ గౌరీశంకర్ మాట్లాడుతూ నేను ఇదివరకే ఇదే పంచాయతీలో సర్పంచ్ గా పనిచేసానని మళ్ళీ నా మీద నమ్మకంతో నన్ను గెలిపించి నాకు ఈ బాధ్యత ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ఋణపడి ఉంటానని అన్నారు. రెండవసారి నన్ను గెలిపించి మరింత బాధ్యత నా భుజాలపై ప్రజలు వేశారని ఆ ప్రజలు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని ధర్మం వైపు నిలబడి ప్రజాసేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. అనంతరం సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి మన అందరి సమిష్టి కృషి అవసరమని మీ సహకారం మా నూతన పాలకవర్గానికి అవసరమని తెలిపారు.

రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు ప్తె హర్షం వ్యక్తం చేసిన...వైజాగ్ ఫిల్మ్ సొసైటీ

 రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు ప్తె హర్షం వ్యక్తం చేసిన...వైజాగ్ ఫిల్మ్ సొసైటీ

మహారాణి పేట, పెన్ పవర్

భారత దేశ చిత్ర ప్రపంచములో ప్రతిస్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కె అవార్డుకు తమిలుడు అయినా, తెలుగు వారికి కూడా అభిమాన నటుడు అయిన 71 ఏల్ల వయసు గల రజనీకాంత్ ఎంపిక అవ్వడం పట్ల వైజాగ్ ఫిల్మ్ సొసైటీ హార్షాన్ని  వ్యక్తం చేశారు. ఈ అవార్డుకు రజని పుర్తి అర్హుడు అని రజని సినిమా ఎలా ఉన్న రజని కనబడితే చాలు అని సినీ ప్రియులు బావిస్తారు అని నరవప్రకాసరావు  కార్యదర్శి తెలిపారు.

మహిళలకు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన

 మహిళలకు  రొమ్ము క్యాన్సర్ పై అవగాహన

విశాఖ ఆరిలోవ, పెన్ పవర్

మహిళలు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచుకుని, రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. ఆరిలోవ హెల్త్ సిటీ హెచ్ సి జి క్యాన్సర్ సెంటర్ మహిళల ఆరోగ్య భద్రత కోసం ప్రెవేశపెట్టిన 365 రూపాయల మామోగ్రాం ప్రత్యేక ప్యాకేజి ని మిస్ విశాఖ ఫైనల్ పోటీదారుల సమక్షంలో మేయర్ ప్రారంభించారు. అనంతరం   మిస్ విశాఖ పటిస్పెంట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ పై హెచ్ సి జి క్యాన్సర్ సెంటర్ ముద్రించిన అవగాహన పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్బంగా మేయర్ హరికుమారి మాట్లాడుతూ  మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అపరిమత్తతతో ఉండాలన్నారు.

రొమ్ము క్యాన్సర్ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు చేసుకోవడం మంచిదన్నారు.వేల రూపాయలు విలువచేసే మామోగ్రాం టెస్ట్ ని గృహిణులకు సైతం అందుబాటులో ఉండే విధంగా365 రూపాయలకు హెచ్ సి జి అందించడం అభినందనీయమన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బ్రెస్ట్ క్యాన్సర్ నుండి ముందస్తు జాగ్రత్త వహించాలని సూచించారు. కార్యక్రమం లో వైసీపీ నాయకుడు గొలగాని శ్రీనివాస్,సంస్థ సి ఓ ఓ ఆదిత్య కౌరా, డాక్టర్ విజయ ఆదిత్య, వా ఉంర్డ్ కొర్పోరేటర్ కెల్ల సునీత, అశోక్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...