Followers

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణి

 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణి

ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో  ఈరోజు
సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  సంఘ అధ్యక్షులు  గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ సంఘం నుండి దీర్ఘకాలిక అప్పులు పొందటం కొరకు దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులకు అనగా పశువుల పెంపకం కొరకు బొప్పాపూర్ గ్రామానికి చెందిన మాదారపు శ్రీనివాస్ కు రెండు లక్షల 80 వేల రూపాయలు మరియు మొడ్సు సతీష్ కు ఒక లక్ష రూపాయలు అదేవిధంగా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన  మస్కూరి సామ్సన్ కు లక్షా యాభై ఎనిమిది రూపాయల చెక్కులను అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి  చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు జంగిటి సత్తయ్య డైరెక్టర్లు నేవూరి వెంకట నరసింహారెడ్డి రైతులు సిబ్బంది పాల్గొన్నారు.

నేడు శ్రీనివాస్ నగర్ కాలనీ ఎన్నికలు, జనరల్ బాడీ మీటింగ్ యథాతథం

 నేడు శ్రీనివాస్ నగర్ కాలనీ ఎన్నికలు, జనరల్ బాడీ మీటింగ్ యథాతథం

కాలనీ అభివృద్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

పెన్ పవర్,  మల్కాజిగిరి 

ఏఎస్ రావు నగర్ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలను ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఆదివారం యధాతథంగా నిర్వహిస్తున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారులు దుడుక దశరథ్, ఎం ఎన్. చారి, ఎ ఎ. హుస్సేన్ లు తెలిపారు. శనివారం కాలనీలోని సీనియర్ సిటిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దశరథ్ మాట్లాడుతూ కాలనీలోని పార్క్ నెంబర్ 1 లో ఎన్నికలతో పాటు కాలనీ సర్వసభ్య సమావేశం కూడా జరుగుతుందని తెలిపారు. కాలనీ పాత కమిటీలోని సభ్యులందరూ తమ పదవుల నుంచి వైదొలగటంతో పాటు కమిటీ కాల పరిమితి పూర్తయిన కారణంగా, సీతారాం రెడ్డి కాలనీ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని వారు తెలిపారు. కాలనీ లో సభ్యుల మధ్య వివాదాలు ఉన్నాయని పత్రికలలో ప్రకటించడాన్ని వారు తప్పుపట్టారు. ఇకనైనా సీతారాంరెడ్డి ఇలాంటి ప్రయత్నాలు మానుకొని ఎన్నికల కమిటీకి సహకరించాలని వారు కోరారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఇందుకు అవసరమైన అనుమతులు తీసుకున్నామని, కాలనీవాసులు ఐక్యమత్యంగా ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని, కాలనీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎన్నికల నిర్వాహణకు కాలనీ సభ్యులు సుమారు 150 మంది తమ అంగీకారం తెలిపారని వారు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాలనీ మాజీ అధ్యక్షుడు గూడూరు సుదర్శన్ రెడ్డి, నాయకులు ఎం మోహన్, ఎం. సాంబయ్య, జి.రమేష్, నాగు తదితరులు పాల్గొన్నారు.

దొడ్డి కొమురయ్య కురుమ 94వ జయంతి వేడుకలను నిర్వహించిన కౌన్సిలర్ కౌడే మహేష్

 దొడ్డి కొమురయ్య కురుమ 94వ జయంతి వేడుకలను నిర్వహించిన కౌన్సిలర్ కౌడే మహేష్....

పెన్ పవర్, మేడ్చల్

 తెలంగాణ రాష్ట్ర రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తెలంగాణ తొలి దశ ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ 94వ జయంతి సందర్భంగా మేడ్చల్ పట్టణ కురుమ సంఘం భవనంలో మేడ్చల్ కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య కురుమ చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించిన మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ, మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, మేడ్చల్ పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు ఒగ్గు శంకర్ కురుమ, మాజీ పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు కౌడే సత్తయ్య కురుమ, మండల కురుమ యువత అధ్యక్షులు ఒగ్గు వెంకటేష్ కురుమ, మాజీ వార్డు మెంబర్ కౌడే నాగేందర్ కురుమ, ఒగ్గు వినోద్ కురుమ, కురుమ ఆంజనేయులు, రమేష్, ఓంకార్, పరమేష్ కురుమ మరియు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదంలో మరణించిన కార్మికుడి కి న్యాయం చేయాలంటూ కమిషనర్ కు వినతిపత్రం

 ప్రమాదంలో మరణించిన కార్మికుడి కి న్యాయం చేయాలంటూ కమిషనర్ కు వినతిపత్రం..

పెన్ పవర్, మేడ్చల్

 మేడ్చల్ మున్సిపాలిటీ లో అధికారులు, పాలకవర్గం అవినీతి కారణంగా డబ్బులు తీసుకున్న కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులను మున్సిపల్ సిబ్బందితో చేయించడం వల్ల శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికుడు దశరథ మరణం మరియు మహిళా కార్మికురాలు లక్ష్మీ తీవ్ర గాయాలతో హాస్పత్రిలో చేరడం జరిగింది అని మేడ్చల్ బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధ్యక్షుడు ఆంజనేయులు మరియు జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ మహిళా ప్రజా ప్రతినిధుల స్థానంలో వారి భర్తలు అధికారం చేలాయించడమే కాకుండా అవినీతికి పాల్పడుతున్నారు అని విమర్శించారు. మృతి చెందిన కార్మికుడికి నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నాయకులు మరియు పుడూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తే చైర్మన్ మరియు కౌన్సిలర్ల భర్తలు తీవ్ర అసహనానికి లోనైనారు. కార్మికులు, వివిధ సంఘాలు, బీజేపీ పార్టీ పోరాటానికి స్పందించి ఎట్టకేలకు 10 గంటల నిరీక్షణ తరువాత మృతుని కుటుంబానికి 5 లక్షల నష్ట పరిహారం చెల్లించడానికి ఆమోదం తెలిపారు. అంతకు ముందు మున్సిపల్ ప్రాంగణంలో జరిగిన కార్మికుల నిరసనలో సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, ఆర్ఎస్ గౌడ్, ఒగ్గు వినోద్, శ్రీనివాస్ గౌడ్, టైలర్ రాజు, మల్లేష్ యాదవ్, మైసరి రాజు, శ్రీకాంత్ లవంగ, వేలూరి సంతోష్ గుప్తా, వంశీ కనుగంటి, వెంకట్, వంశీరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

21వ డివిజన్ జయశంకర్ కాలనీ లో బ్రాండన్ సపిడ్ షంవే సంస్థ ఆధ్వర్యంలో బోరు మోటర్ ప్రారంభం

21వ డివిజన్ జయశంకర్ కాలనీ లో బ్రాండన్ సపిడ్ షంవే సంస్థ ఆధ్వర్యంలో  బోరు మోటర్ ప్రారంభం


పెన్ పవర్, జవహర్ నగర్ 

మునిసిపల్ కార్పోరేషన్ పరిధి 21డివిజన్ జయశంకర్ కాలనీ లో శనివారం బ్రాండన్ సపిడ్ షంవే సంస్థ వారు రావడం జరిగింది భూమా విజయ పౌల్ ఆధ్వర్యంలో బోర్ మోటర్ ను  ముఖ్యఅతిథి  డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి  శ్రీనివాస్ చేతుల మీదుగా   ప్రారంభించడం జరిగింది. బ్రండన్ షంవే సంస్థ  వారు  కాలనీ వాసులకు  కరోనా సెకండ్ వేవ్ గురించి అవగాహన కల్పించారు. కరోనా వైరస్ పట్ల  అప్రమత్తంగా ఉండాలని  ప్రజలందరూ  తప్పనిసరిగా మాస్కులు ధరించాలి అని సూచించారు. అందులో భాగంగానే తొమ్మిదవ పదవ తరగతి విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్, సంతూర్ సబులు, ఇవన్నీ కలిసి  ఒక కిట్టు రూపంలో ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో  మీరా  మేడం  ఊర్మిళ మేడం మేరి మేడం పాల్గొన్నారు. కాలనీ అధ్యక్షులు  కృష్ణ యాదవ్, భూమా పౌల్, ముకుందన్, రూబెన్, నరేష్, జక్కుల భాస్కర్ ,కావ్య, సౌందర్య, అంజయ్య, పుల్లయ్య చారి లక్ష్మి  తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు. 

అనాథ ఆశ్రమంలో ఘనంగా జన్మదిన వేడుకులు

 అనాథ ఆశ్రమంలో ఘనంగా జన్మదిన వేడుకులు

అనాథ పిలల్లకు అన్నదానం


పెన్ పవర్,  మల్కాజిగిరి

మల్కాజిగిరి లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు శోభన్ బాబు జన్మదిన సందర్బంగా ప్యూచర్ పౌండేషన్ మీర్జాల్ గూడలోని అనాథ పిల్లలకు పండ్లు, చాక్లెటు పంపిణి చేసి అన్నదానం చేశారు. ఈ సందర్బంగా శోభన్ బాబు మాట్లాడుతూ అనాథ పిల్లలకు అండగా ఉంటామని అన్నారు, అనాథ పిల్లలకు సహయం చేసి వారితో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్ని అన్నారు.

శ్రీ అమృతతుల్య టీ సెంటర్ ప్రారంభం

 శ్రీ అమృతతుల్య టీ సెంటర్ ప్రారంభం 

పెన్ పవర్, రాయికల్ 

రాయికల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా నూతన శ్రీ అమృతతుల్య టీ సెంటర్ ని ప్రారంభించిన మున్సిపల్ ఛైర్పర్సన్ మోరా హనుమాన్లు ఎస్సై ఆరోగ్యం

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...