Followers

33వ వార్డు లో అవగాహన కార్యక్రమం

33వ వార్డు లో అవగాహన కార్యక్రమం

మహారాణి పేట, పెన్ పవర్

జీవీఎంసీ జోన్ 4, 33వ వార్డ్, గౌరి స్ట్రీట్ సచివాలయం పరిధిలో  ప్రజలకు  పారిశుధ్య పరిరక్షణ, ఫ్రైడే డ్రై డే కార్యక్రమం లో భాగంగా తమ ఇంటి పరిసరాలు, వాటర్ ట్యాంక్ లు  శుభ్రం చేసుకొని దోమలు రాకుండా వ్యాధులు వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు సూచనలు చేశారు.స్థానికంగా ఉన్న ప్రజలతో  కరోనా మళ్ళీ విజ్రంభిస్తున్న తరుణం లో అవగాహనా కార్యక్రమం నిర్వహించి భౌతిక దూరం పాటించాలని, ప్రజలు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల ను సంప్రదించాలని, విధిగా  వేక్సిన్ వేయుంచుకొని ఆరోగ్యం గా ఉండాలని తగు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమం లో వార్డ్ సెక్రటరీ పి.వి.కిరణ్ కుమార్,ఏ.ఆన్.ఏం.స్వయంవరపు లక్ష్మి, వి.ఆర్.ఓ రాజేష్, వాలంటీర్స్ నవీన్, ఆశ వర్కర్ పార్వతి తదితరులు  పాల్గున్నారు.

జిల్లా కలెక్టర్ ను కలిసిన ఉక్కు నిర్వాసితులు..

 జిల్లా కలెక్టర్ ను కలిసిన ఉక్కు నిర్వాసితులు..

విశాఖపట్నం,పెన్ పవర్

విశాఖ ఉక్కు నిర్మాణ సమయంలో భూముల ఇచ్చిన నిర్వాసితులు శనివారం విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ను కలిసి మెమోరాండం సమర్పించారు. నిర్వాసితుల ప్రతినిధులు పులి రమణారెడ్డి, ఉమ్మిడి అప్పారావు,సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి వి లక్ష్మీ నారాయణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి, సీపీఎం రాష్ట్ర కారదర్శి వర్గ సభ్యులు సి హేచ్ నర్సింగరావు, ఇంటక్ నేత మంత్రి రాజశేఖర్, టీడీపీ కార్పోరేటర్స్ లేళ్ల కోటేశ్వరరావు,గంధం శ్రీను తదితర నాయకత్వ బృందం జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు.స్టీల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో స్వచ్చందంగా తమ భూములు ఇచ్చామని నేటికీ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సుమారు 8500 మంది నిర్వాసితులకు ఆర్ కార్డులు మంజూరు చేశారని నేటికి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేడో, రేపో న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్న తరుణంలో ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటన వెలుబడడం మరింత ఆందోళనకు గురికావాల్సి వస్తోందని నిర్వాసితులు కలెక్టర్ ముందు వాపోయారు. గతంలో మేము ఇచిన్న భూములను యదతదంగా వెన్నక్కి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళనలు విరమించబోమని, అవసరమైతే ప్రాణాలను సైతం విడవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం దృష్టికి నిర్వాసితుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఎం.పి.టి.సి,జెడ్.పి.టి.సి.ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

 ఎం.పి.టి.సి,జెడ్.పి.టి.సి.ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి  చేయాలి 

విశాఖపట్నం,పెన్ పవర్

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ, నిబంధనల మేరకు ఎం.పి.టి.సి, జెడ్.పి.టి.సి  ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ వి.వినయ్ చంద్  తెలిపారు.శనివారం నాడు స్థానిక వి.యం.ఆర్.డి.ఎ.చిల్డ్రన్స్ ఎరినాలో  ఎం.పి.టి.సి, జెడ్.పి.టి.సి ఎన్నికల నిర్వహణపై ఎం.పి.డి.ఒ.లు తాహసీల్దార్లు, మండల ప్రత్యేకాధికారులు, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఇప్పటినుంచి ప్రతి క్షణం అప్రమత్తంగా  వుండి అధికారులు తమతమ బాధ్యతల పట్ల అవగాహన పెంచుకొని, నియమ నిబంధనలు అధ్యయనం చేసి,  సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. ఎం.పి.డి.ఒ.లు తాహసీల్దార్లు, మండల ప్రత్యేకాధికారులు,  రిటర్నింగ్ అధికారులు ఒక బృందంగా  సమన్వయం చేసుకొని ఎటువంటి పొరపాట్లు జరగకుండా శ్రద్థ వహించాలన్నారు. నియోజక వర్గ ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో తలెత్తే ఇబ్బందులను  ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.బ్యాలెట్ పేపర్లను ట్రెజరీ నుంచి తీసుకొని మండల కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసుకొని 7వతేదీ వరకు భద్రపరచాలన్నారు.  బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, స్టేషనరీ మొదలైన అన్ని మెటీరియల్ ను  పోలింగ్ నిర్వహణాధికారులకు పోలింగ్ స్టేషన్ ల వారీగా అందజేయాలని తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలను తప్పని సరిగా పాటించాలని తెలిపారు. మండల కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో  ఎం.పి.టి.సి, సెగ్మెంట్ వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. జోనల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను కనీసం 2 సార్లు పరిశీలించి కనీస మౌలిక సదుపాయాలు వుండేలా జాగ్రత్త వహించాలన్నారు. జోనల్ అధికారులు తమ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. పోలింగ్ విధులకు కేటాయించబడ్డ అధికారులు, సిబ్బంది ర్యాండమైజేషన్  పూరైందని వారికి కేటాయించ బడ్డ మండల కేంద్రంలో 5వ తేదీ నాడు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని  కోరారు. రిజర్వ్ సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వాలని తెలిపారు.  డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ బృందాలు ఆర్.టి.సి.బస్సులలో పోలింగ్ స్టేషన్ కు చేరుకుంటారన్నారు.పోలింగ్ 8వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. పోలింగ్ అనంతరం  పోల్ మెటీరియల్ ను రిసెప్షన్  సెంటర్లో తీసుకొని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని తెలిపారు. ఒకే ప్రాంగణంలో  రిసెప్షన్  సెంటర్ , స్ట్రాంగ్ రూమ్ , కౌంటింగ్ సెంటర్లు వుండేలా ఏర్పాటు చేయాలన్నారు.

తప్పని సరిగా కౌంటింగ్ సెంటర్లో ప్రతీ ఎం.పి.టి.సి. సెగ్మెంట్ కు ఒక టేబుల్ ను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ హాళ్లలోనూ , స్ట్రాంగ్ రూమ్ బయట తప్పనిసరిగా సి.సి.కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశించిందని తెలిపారు. కౌంటింగ్ 10వ తేది ఉదయం 8 గంటల నుంచి ప్రారంభిస్తారని తెలిపారు.రిటర్నింగ్ అధికారులు ఎన్నికల్లో పోటీ  చేస్తున్న అభ్యర్థులకు  పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై  తగిన సమాచారం ఇవ్వాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అమలు చేయాలని, ఎప్పటికప్పు డు అవసరమైన నివేదికలను జాప్యం లేకుండా పంపించాలని తెలిపారు. 6వ తేదీ సాయంత్రం 5గంటలకు  ఎన్నికల ప్రచార వ్యవధి ముగుస్తుందని తెలిపారు. 4వ తేదీ లోగా  ఫొటో ఓటరు స్లిప్పులు వస్తాయని 5వ తేదీ నాడు బి.ఎల్.ఒ.లతో పంపిణీ చేయించాలని తెలిపారు.జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి నాగార్జున సాగర్  మాట్లాడుతూ 2100 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డి.ఆర్.డి.ఎ.పి.డి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రిసెప్షన్  సెంటర్,  స్ట్రాంగ్ రూమ్ నిర్వహణ, కౌంటింగ్ ఏర్పాట్లపై వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు ఎం.వేణు గోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, ఆర్. గోవిందరావు, ఐ.టి.డి.ఎ. ప్రాజెక్ట్ అధికారి ఎస్.వెంకటేశ్వర్, సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, డి.ఆర్.ఒ.ఎ.ప్రసాద్, ఆర్.డి.ఒ.లు పి.కిషోర్, సీతారామారావు, లక్ష్మీ శివజ్యోతి, డి.పి.ఒ.క్రిష్ణకుమారి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఇసరపు రామ కృష్ణల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం

ఇసరపు రామ కృష్ణల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం

 విజయనగరం,పెన్ పవర్

 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాల్లో కూడా ముందు ఉండడం ఎంతైనా అభినందనీయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ అన్నారు. శనివారం నాడు 13 వ డివిజన్ పరిధిలో కొత్తపేట నీళ్ల ట్యాంకు వద్ద కార్పొరేటర్ ఇసరపు రేవతీదేవి, ఇసరపు రామ కృష్ణల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం పాదచారులకు, వాహనదారులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, సేవా కార్యక్రమాలు చేపట్టడం ఇతరులకు స్ఫూర్తిదాయక ఉన్నారు. డివిజన్ పరిధిలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక ఇంజనీర్ డాక్టర్ దిలీప్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొయ్యాన పైడ్రాజు, కిలన శ్రీను, కొయ్యాన జగదీష్, కొయ్యాన శేఖర్, బొట్టా నారాయణరావు, డివిజన్ పార్టీ పెద్దలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కొలువుతీరిన కొత్త పంచాయతీ పాలకవర్గం

 కొలువుతీరిన కొత్త పంచాయతీ పాలకవర్గం

మెంటాడ,పెన్ పవర్ 

మెంటాడ మండలం లోని శనివారము ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన కొత్త పంచాయతీ పాలకవర్గం తమ తమ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్ తో పాటు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మొదటి సమావేశం నిర్వహించి , ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత పలువురు సర్పంచులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ  ముందుగా తమను గెలిపించిన  ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు అందరికీ అందిస్తామని వారు హామీ ఇచ్చారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సమస్యలపై దృష్టి సారిస్తామని వారు పేర్కొన్నారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా వారికి అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయితీ కార్యదర్శులు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

నాగారంలో కొనసాగుతున్న అబివృద్ది పనులు

 నాగారంలో కొనసాగుతున్న అబివృద్ది పనులు

నాగారం మరియు రాంపల్లిలో జంక్షన్ లకు రూ50 లక్షల వ్యయం

పెన్ పవర్,  మల్కాజిగిరి

నాగారం మున్సిపాలిటి పరిధిలోని నాగారం మరియు రాంపల్లి ఓల్డ్ విలేజ్ చౌరస్తాలోని అభివృద్ధి  పనుల్లో భాగంగా నాగారం జంక్షన్ అబివృద్ది ఏర్పాటుకు రూ25లక్షల వ్యయంతో పనులను చేపట్టాలని మరియు అబివృద్ది పనుల్లో భాగంగా రాంపల్లి ఓల్డ్ విలేజ్ చౌరస్తాలోని జంక్షన్ ఏర్పాటుకు రూ25లక్షల వ్యయంతో పనులను చేపట్టాలని నిర్ణయించిన చైర్పర్సన్ శ్రీ కౌకుంట్ల చంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు, కోఆప్షన్ మెంబర్ మరియు కమిషనర్ శ్రీమతి ఏ వాణి తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల కమిషనర్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ

ఎన్నికల కమిషనర్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ

మెంటాడ,పెన్ పవర్

మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పిటిసి స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మండల టిడిపి అధ్యక్షులు చలుమూరి వెంకటరావు కోరారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. మెంటాడ మాజీ  పీఏసీఎస్ అధ్యక్షులు గొర్లె ముసలినాయుడు మెంటాడ మండలంలో అన్ని గ్రామాల్లో టిడిపి పటిష్టంగా ఉందని ప్రతి ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేస్తే ఎంపీపీ, జెడ్ పి టి సి స్థానాలు కైవసం చేసుకోవడం జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. మాజీ వైస్ ఎంపీపీ గెద్ద అన్నవరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మెంటాడ మండలంలో స్థానిక ఎన్నికల్లో టిడిపి అత్యధిక స్థానాలు సాధిస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో కూడా అత్యధికంగా ఎంపీటీసీలు గెలవడమే కాకుండా, జడ్పిటిసి కూడా గెలుస్తామని, కార్యకర్తలు , అభిమానులు అధైర్య పడవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...