Followers

మే 4వతేదీన ఏ.పి.కి కేంద్రబృందం


అమరావతి, పెన్ పవర్


మే 4వతేదీన ఏ.పి.కి కేంద్రబృందం


రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటన కేంద్ర బృందం


కరోనా ప్రభావం,తాజాపరిస్తితి,లాక్ డౌన్ అమలు తీరు,కరోనాపరీక్షలు జరిగే విధానం, కరోన రోగులకు అందే వైద్యం పై సమీక్ష చేయనున్న కేంద్ర బృందం, రెడ్ జోన్,గ్రీన్ జోన్ ,అరేంజి జోన్లలో తీసుకుంటున్న చర్యలపై సమీక్షచేయనున్న కేంద్రబృందం


గ్రీన్ జోన్ లోకి కాకినాడ


గ్రీన్ జోన్ లోకి కాకినాడ


  కాకినాడ, పెన్ పవర్: 


కాకినాడ  గ్రీన్ జోన్ లోకి వచ్చింది. కరోనా ఫ్రీ సిటీగా కాకినాడను డిక్లేర్ చేశారు. కాకినాడ బ్యాంక్ పేటలోని ఇరువురు పాజిటివ్ రోగులు వైరస్ నుండి కోలుకొని  డిశ్చార్జి అయ్యారు. 28 రోజులుగా బ్యాంక్ పేటలో అదనంగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో రెడ్ జోన్  ఎత్తివేశారు. దీంతో కాకినాడ సిటీని గ్రీన్ జోన్ ప్రకటించారు. ఇక కాకినాడను గ్రీన్ జోన్ గా ప్రకటించడంపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ జోన్ లోకి రావడానికి  సహకరించిన ప్రజలకు, దాతలకు, కరోనా సేవల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రీన్ జోన్ వచ్చినప్పటికీ ప్రజలంతా మరికొద్ది రోజులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రీన్ జోన్ లోకి నగరం రావడంతో నిబంధనలలో కొంత మేరకు సడలింపు ఉంటాయని అంటున్నారు.


2018 ఐఏఎస్ బ్యాచ్ అధికారులకు అసిస్టెంట్ కలెక్టర్ లుగా పోస్టింగ్


అమరావతి, పెన్ పవర్


ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 2018 ఐఏఎస్ బ్యాచ్ అధికారులకు అసిస్టెంట్ కలెక్టర్ లుగా పోస్టింగ్


పశ్చిమగోదావరి - సీహెచ్.బాజ్ పాయి.
అనంతపురం - జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్.
నెల్లూరు - భావ్నా
శ్రీకాకుళం - మల్లారపు నవీన్
ప్రకాశం - వి.అభిషేక్
తూర్పుగోదావరి - అపరాజిత సింగ్
చిత్తూరు - విష్ణు చరణ్
కర్నూలు - నిధి మీనా
విజయనగరం - కట్టా సింహాచలం.
కడప - వికాస్ మర్మాట్


ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడు చేసుకోండి


ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడు చేసుకోండి


కమీషనర్  నూకేశ్వర రావు


సాలూరు, పెన్ పవర్


కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆరోగ్య సేతు యాప్ గురించి అందరు తెలుసు కోవాలని సాలూరు పట్టణ మున్సిపల్ కమీషనర్ గురువారం చిన్నబజార్ జంక్షన్లో  కిరాణ షాపుల యాజమానులుకు అవగాహన  కల్పించారు.ఈ సందర్బంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతు ఈ ఆరోగ్య సేతు యాప్ వలన ఎంతో ఉపయెాగం ఉందని,యాప్ గూగుల్  ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.హెల్ప లైన్ నంబర్ లతో పాటు ,ఆరోగ్య శాఖ పెట్టే పోస్టులు,వైద్య సలహలు ఇతర వివరాలు తెలుసుకోచ్చని తెలిపారు.కరోనా సోకిన వ్యక్తి దగ్గర గా వెళ్తే వెంటనే ఈ యాప్ మనల్ని వెంటనే అప్రమత్తం చేస్తుందని,ఇప్పుడు ఉన్న ప్రస్తుత కరోనా కేసులను పసిగడుతుందని చెప్పారు.తదనాంతరం కిరాణ షాపు యజమానులుకు,ప్రజలకు తమ సెల్ ఫోన్ లో ఆరోగ్యసేతు యాప్ ఎలా డౌవున్ లోడు చెయ్యలో దాని పనితీరును  దగ్గర ఉండి సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కమీషనర్ నూకేశ్వరరావు,సిబ్బంది పాల్గోన్నారు.


భవన నిర్మాణ రంగ పనులకు అనుమతులు ఇవ్వాలి


భవన నిర్మాణ రంగ పనులకు అనుమతులు ఇవ్వాలి


సాలూరు, పెన్ పవర్


సాలూరు పట్టణ ఎ.పి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కమిటీ సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షుడు యన్.వై. నాయుడు ఆధ్వర్యంలో  పట్టణ యస్.ఐ. యస్.శ్రీనువాసరావు కు కరోనా వలన నెల రోజులుగా నిర్మాణ రంగ పనులు నిలిచిపోయి కార్మికుల ఇబ్బందులు తెలుపుతున్న వినతిపత్రాన్ని గురువారం  అందించారు.ఈ సందర్భంగా ఎన్.వై. నాయుడు విలేకర్ల తో  మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి భవన నిర్మాణ రంగ పనులు పూర్తిగా నిలిచిపోయాయని,ప్రస్తుతం కార్మికులకు ఉపాధి పనులు లేకపోవడం వలన అవస్థ లు పడుతున్నారని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడం నిర్మాణ రంగ కార్మికులు పస్తులు ఉండవలసిన పరిస్థితి నెలకొని ఉందని చెప్పారు. ఏప్రెల్ 29 వ తేదీనా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ రంగ పనులు చేయడానికి అనుమతిస్తు ఆదేశాలు జారీ చేసిందని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, డి.జి.పి. ప్రకటించి యున్నారని తెలిపారు.సాలూరు పట్టణ కార్మికులు కూడా సామాజిక దూరం పాటిస్తూ పనులు చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు.ఈ కార్యక్రమంలో  భవన  నిర్మాణ రంగ కార్మిక అధ్యక్షుడు రౌతు చిన్నయ్య ,కార్యదర్శి యర్రా జగన్నాధం , కోశాధికారి నెయ్యల మెాహన్ తదితరలు పాల్గొన్నారు .


నగర ఎస్సీ యువమోర్చా  ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ  


నగర ఎస్సీ యువమోర్చా  ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ                            


పూర్ణా మార్కెట్, పెన్ పవర్:      


                     


విశాఖ నగర ఎస్సీ మోర్చ అధ్యక్షులు చొక్కాకుల రాంబాబు ఆధ్వర్యంలో 30వ వార్డులో పేదలకు ఆహార పెకెట్ల పంపిణీ చేశారు.   దేశ ప్రధాని  నరేంద్ర మోడీ,  ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్యదర్శి కాశీ విశ్వనాథ్ రాజు  అలాగే విశాఖ నగర అధ్యక్షులు  రవీంద్ర రెడ్డి  ఆర్ధిక సహాయంతో  చొక్కకుల రాంబాబు గురువారం 30వ వార్డు లో నివసిస్తున్న పేదలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు లో ఉన్న బీజేపీ నేతలు ,కార్యకర్తలు పాల్గొన్నారు.


1500 కుటుంబాలకు కూరగాయల పంపిణీ..






1500 కుటుంబాలకు కూరగాయల పంపిణీ..
 

 

గోకవరం, పెన్ పవర్

 

తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలం,  గుమ్మల్లదొడ్డిలో స్థానిక వైకాపా నాయకుల ఆధ్వర్యంలో గురువారం ప్రతీ ఇంటికీ కూరగాయలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో స్థానికులు అవస్థలు పడకుండా, స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు సూచనల మేరకు గ్రామంలో ఉన్న సుమారు 1500కుటుంబాలకు వాలంటీర్లు సహాయంతో కూరగాయలు అందజేయడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..


 




 

 


 



 



Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...