Followers

ధరలను అదుపు చేయడంలో విఫలమైన ప్రభుత్వం 


ధరలను అదుపు చేయడంలో విఫలమైన ప్రభుత్వం 



మందుల కొరతతో ఇబ్బంది పడుతున్న రోగులు 



ఓ వైపు ఆర్ధిక ఇబ్బందులు, మరో వైపు కొరత కారణం 



(పెన్ పవర్, మార్కాపురం డివిజన్ ఇన్ ఛార్జి) 



కరోనా మహమ్మారి కారణంగా నిత్యావసర ధరలు భారీగా పెరిగి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరల పట్టికలను అధికారులు ఏర్పాటు చేసినా అవి అలంకార ప్రాయంగా మారాయి. కొనుగోలుదారులు ఎవరైనా అధికారులు పెట్టిన ధరల పట్టిక పై ప్రశ్నిస్తే రవాణా చార్జీలు భారీగా పెరిగాయని, ఆ ధరలకు సరుకులు ఇవ్వలేమని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మందుల విషయానికి వస్తే రోగులకు అవసరమైన మందులు అందు బాటులో లేవంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలు లేక మందుల సరఫరా నిలిచిపోయిందని సమాధానం ఇస్తున్నారు. గతంలో మందులు కొనుగోలు చేస్తే 10 నుంచి 20 శాతం వరకు కమిషన్ రూపంలో ఇచ్చే వారు ప్రస్తుత కష్టాలను సాకుగా చూపి ఆ కమిషన్ ఎత్తి వేయడమే కాక ధరలు పెంచి ఆమ్మకం సాగిస్తున్నారు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరో వైపు ధరల పెరుగుదలతో కొందామంటే కొరివి, వేసుకోకపోతే రోగాలు పెరిగి ఆరోగ్య సమస్యలు అధికమవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ 40 రోజుల్లో వ్యక్తికి పది, ఐదు కిలోల బియ్యం, 2 కిలోల కందిపప్పు, ఒక కిలో శనగపప్పు, రూ.1000 నగదు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎలా అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ప్రజలు కరోనా మరణాల కన్నా ఆకలి మరణాలే అధికం అవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల విమర్శలకు సమాధానం ఇచ్చేందుకే అధిక సమయం కేటాయిస్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్త శుద్ధితో పని చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి ఇంటికి 3 మాస్కులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి పది రోజులు గడిచినా ఇంతవరకు సక్రమంగా పంపిణీ జరిగిన దాఖలాలు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర ప్రాంతాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తక్షణమే తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


 


ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పనులు వేగం పెంచాలి


ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పనులు వేగం పెంచాలి


                                      జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్


విజయనగరం,పెన్ పవర్ 


 


:  ఉపాధి  హామీ నిధులతో పలు శాఖల సమన్వయం తో చేపడుతున్న  పనులను వేగంగా జరిగేలా  చూడాలని జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ ఆదేశించారు.  శనివారం కలెక్టర్ తన  ఛాంబర్ లో  ఉపాధి హామీ పనులను  సమీక్షించారు.   ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న గ్రామ సచివాలయ భవనాలకు కొన్ని చోట్ల భూ సమస్య ఉన్నట్లు  పంచాయతీ రాజ్ ఎస్.ఈ.  కలెక్టర్ దృష్టికి తెచ్చారు.   కలెక్టర్ వెంటనే సంయుక్త కలెక్టర్  జి.సి. కోశోర్ కుమార్ కు ఫోన్ చేసి ఎక్కడెక్కడ భూమి సమస్య ఉందో  తనిఖీ చేసి వెంటనే పరిష్కరించాలని చెప్పారు.  జిల్లాలో ఉపాధి నిధులతో 655 గ్రామ సచివాలయ  భవనాలను  మంజూరు చేయగా 619 నిర్మాణాలు పురోగతి లో నున్నాయని తెలిపారు. సర్వ శిక్షా అభియాన్ ద్వారా  1210 పాఠశాలల  ప్రహరీ నిర్మాణాలు మంజూరు కాగా పనులు పురోగతి లో నున్నాయన్నారు.     గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా 1075  సి సి డ్రైన్ లు మంజూరు కాగా 859 పనులు పురోగతిలో నున్నాయని, మిగిలిన శాఖల ద్వారా చేపడుతున్న  కన్వర్జెన్స్ పనులను కూడా  త్వరగా పూర్తి చేయాలని అన్నారు.  లాక్ డౌన్ కొనసాగుతున్నందున  ఈ పనులలో పాల్గొనే  ఇంజినీర్లకు  పాస్ లకు దరఖాస్తు చేస్తే జారీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశం లో  డుమా పి .డి. ఎ.నాగేశ్వర రావు,  వ్యవసాయ శాఖ  సంయుక్త సంచాలకులు యం . ఆశాదేవి, గ్రామీణ నీటి సరఫరా ఎస్.ఈ.  పప్పు రవి తదితరులు పాల్గొన్నారు.  


వ‌ల‌స కూలీల రాక మొద‌లు


 వ‌ల‌స కూలీల రాక మొద‌లు



ఇప్ప‌టికే జిల్లాకు చేరుకున్న‌216 మంది



మ‌రో 500 మంది వ‌ర‌కూ వ‌చ్చే అవ‌కాశం



జిల్లా నుంచి త‌ర‌లివెళ్లిన వ‌ల‌స కూలీలు 26 మంది



ఛ‌త్తీస్‌ఘ‌డ్ నుంచి జిల్లాకు చేరుకున్న‌వారు 26 మంది



జిల్లాకు చేరుకున్న మ‌త్స్య‌కారులు 280



మార్గ‌మ‌ధ్యంలో ఉన్న మ‌త్స్య‌కారులు 314



అంద‌రినీ క్వారంటైన్‌కు త‌ర‌లింపు



      విజ‌య‌న‌గ‌రం,పెన్ పవర్ 


ః బ‌‌తుకుతెరువు కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లి చిక్కుకుపోయిన వ‌ల‌స కూలీలను జిల్లాకు ర‌ప్పించే ప్ర‌క్రియ ప్రారంభమ‌య్యింది. ఇప్ప‌టికే జిల్లాకు 216 మంది వ‌ల‌స కూలీలు చేరుకోగా, మ‌రో 500 మంది వ‌ర‌కూ వ‌చ్చే అవ‌కాశం ఉంది. వీరంతా ప్ర‌కాశం, కృష్ణా, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి, విశాఖ‌ప‌ట్నం జిల్లాల ‌నుంచి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే వివిధ జిల్లాల నుంచి ప్ర‌త్యేక బ‌స్సుల్లో జిల్లాకు బ‌య‌లుదేరిన‌ట్లు  స‌మాచారం అందింది.


      విజ‌య‌న‌గ‌రం జిల్లాకు వివిధ ప‌నుల‌కోసం వ‌చ్చి చిక్కుకుపోయిన 26 మందిని జిల్లానుంచి ప్ర‌త్యేక బ‌స్సుల్లో పంపించారు. లాక్‌డౌన్‌కు ముందు జిల్లాలో చెర‌కు ప‌నుల‌కోసం వ‌చ్చి 26 మంది సీతాన‌గ‌రం మండ‌లంలో చిక్కుకుపోయారు. వీరిని ఇప్ప‌టివ‌ర‌కు మ‌రిపివ‌లస వ‌స‌తిగృహంలో ఉంచారు. ప్ర‌భుత్వం అనుమ‌తినివ్వ‌డంతో వీరంద‌రినీ ప్ర‌త్యేక బ‌స్సులో 25 మందిని ప్ర‌కాశం జిల్లా ఎర్ర‌గొంట్ల‌కు, ఒక‌రిని తూర్పు‌గోదావ‌రి జిల్లాకు పంపించారు.

పొరుగు రాష్ట్రం ఛ‌త్తీస్‌ఘ‌డ్ నుంచి 26 మంది  జిల్లాకు చేరుకున్నారు.


     జిల్లా నుంచి వెళ్లిన 594 మంది మ‌త్స్య‌కారులు గుజ‌రాత్‌లో చిక్కుకుపోయారు. వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 280 మంది ప్ర‌త్యేక బ‌స్సుల్లో జిల్లాకు చేరుకున్నారు.  శుక్రవారం రాత్రి  జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి. రాజ కుమారి, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు,  మత్స్య శాఖ  ఉప సంచాలకులు  టి. సుమలత తదితరులు వీరిని రిసీవ్ చేసుకొని యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.  వీరంద‌రినీ పూస‌పాటిరేగ మండ‌లం కోనాడ జంక్ష‌న్ వ‌ద్ద, భోగాపురం మండ‌లం మిరాకిల్ వ‌ద్ద‌, డెంకాడ మండ‌లం ఎంవిజిఆర్ వ‌ద్ద  ఏర్పాటు చేసిన  క్వారంటైన్ సెంట‌ర్ల‌లో ఉంచారు.  మిగిలిన 314 మంది మార్గ‌మ‌ధ్యంలో ఉన్నారు.   
     జిల్లాకు ఇత‌ర ప్రాంతాల‌నుంచి వ‌చ్చిన‌వారంద‌రినీ ముందుగా క్వారంటైన్ సెంట‌ర్ల‌కు త‌ర‌లిస్తున్నారు. క్వారంటైన్ సెంట‌ర్లో వీరి కోసం అన్ని సౌక‌ర్యాలను ఏర్పాటు చేశారు. ముందుగా వ‌చ్చిన వారంద‌రికీ  వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. వ‌చ్చిన ఫ‌లితాలు, వారి ఆరోగ్య ప‌రిస్థితిని బ‌ట్టి త‌గిన నిర్ణ‌యం తీసుకోనున్నారు.  జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు  72 క్వారంటైన్ సెంట‌ర్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో 21 సెంట‌ర్లు ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో శుక్ర‌వారం సాయంత్రానికి 416 మంది ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు కేంద్రాల‌నుంచి 305 మందిని డిస్‌ఛార్జి చేశారు.


4న జిల్లా కలెక్ట‌ర్  ఫోన్ ఇన్ ప్రోగ్రాం


4న జిల్లా కలెక్ట‌ర్  ఫోన్ ఇన్ ప్రోగ్రాం



క‌రోనాపై సందేహాల నివృత్తి



విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్


 క‌రోనా నియంత్ర‌ణ‌కు సంబంధించి ఈ నెల 4వ తేదీ సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌నుంచి 11 గంట‌లు వ‌ర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ప్ర‌జ‌ల‌తో ఫోన్ ఇన్‌ ప్రోగ్రాం నిర్వ‌హించ‌నున్నారు. జిల్లా ప్ర‌జ‌లు 08922-276177, 08922-278876 నెంబ‌రుకు ఫోన్ చేసి, నేరుగా జిల్లా క‌లెక్ట‌ర్‌తో మాట్లాడి క‌రోనా మ‌హ‌మ్మారి, దాని వ్యాప్తి గురించి త‌‌మ సందేహాల‌ను నివృత్తి చేసుకోవ‌చ్చు. అలాగే క‌రోనా నియంత్ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను ఇవ్వ‌వ‌చ్చు. ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌ కోరారు.


ఎండ తీవ్రత,  కరోనా వైరస్ పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి


ఎండ తీవ్రత,  కరోనా వైరస్ పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి


                                                    జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్


విజయనగరం, పెన్ పవర్ : 


 వేసవి కాలంలో ఎండ తీవ్రంగా ఉంటుందని ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని,  కరోనా వైరస్ నివారణకు తగు పద్దతులు పాటించాలని  జిల్లా కలక్టరు డా. హరి జవహర్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు.  సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే ఉండాలని ఎండ తీవ్రత, కరోనా వైరస్ గురించి టివి, రేడియో, పత్రికలలో వస్తున్న విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు.  త్రాగునీరు సరిపడినంత తీసుకోవాలని, ఓఆర్ఎస్, లస్సీ, రైస్ వాటర్, లెమన్ వాటర్, మజ్జిగ వంటి త్రాగాలన్నారు. మంచి పౌష్టి కాహారాన్ని తీసుకోవాలని, కిడ్ని, లివర్ వ్యాధులు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలన్నారు.  తక్కువ బరువు ఉన్న, లైట్ కలర్, లూజుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలన్నారు.   తప్పనిసరి పరిస్ధితుల్లో బయటకు వెళ్లెటప్పుడు టోపిని గాని, గొడుగును గాని, రుమాలును గాని వినియోగించాలని, తలకు ఎండ తగలకుండా చూసుకోవాలని, నీడ ఉన్న ప్రదేశంలో తిరగాలని, ఇతరులను ముట్టుకోకుండా ఒక మీటరు దూరంలో ఉండాలన్నారు.  నీటితోగాని, సబ్బుతో గాని, శానిటైజర్ తో గాని చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.  కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క టవల్ ను ఉపయోగించాలని, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలన్నారు.  వీలైనంత వరకు ఇంటిలోనే ఉండాలని, ఇంటి చల్లదనం కోసం  కర్టెన్లు, షట్టర్స్, సన్ షేడ్స్ ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి సమయంలో కిటికీలు తెరిచి ఉండాలన్నారు.  పేన్లు, డంప్ క్లాతింగ్ ఉపయోగించాలని, చల్లటి నీటితో ఎప్పటికప్పుడు స్నానం చెయ్యాలన్నారు.  జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస పీల్చునప్పుడు ఇబ్బందులు వచ్చినచో సత్వరమే డాక్టర్ ను సంప్రదించాలన్నారు.  జంతువులను నీడిలో ఉంచి త్రాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్లరాదని,  తప్పనిసరి పరిస్దితుల్లో వెళ్లదలచినచో వర్క్ అనుమతి పత్రం తీసుకోవాలని, చల్లగా ఉండే సమయంలో పనిచేయాలన్నారు.  మధ్యాహ్నం 12 నుండి 3 గంటల సమయంలో ఎట్టి పరిస్దితులలోను పనిచేయరాదన్నారు. ఉద్యోగులు, పనిచేసే వారికి పని ప్రదేశంలో చల్లటి త్రాగునీటిని ఏర్పాటు చెయ్యాలని, పరిశుభ్రంగా ఉంచాలన్నారు.  వ్యవసాయ, ఉపాధి హామి తదితర పనులు చేసే వారి తలకు, ముఖానికి ఎండ తగలకుండ ఉండేటట్లు  తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.  చల్లటి వాతావరణం ఉన్న సమయాలలో పనిచేసేటట్లు చూడాలన్నారు.  గర్భీణీ స్త్రీలుకు, వర్కర్స్ కు వైద్య సదుపాయం కల్పించాలన్నారు.  పనివారు పనిచేయు సమయంలోను, లంచ్, డిన్నర్  చేసేటప్పుడు సామాజిక దూరం పాటించాలని, సబ్బు, నీటిని ఏర్పాటు చెయ్యాలని, చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చేతులు ముఖనికి తాకకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.  పారిశుద్ద్య పనివారు తప్పనిసరిగా మాస్క్లు లు, గ్లౌస్ లు ధరించాలని, మాస్క్ లను తాకరాదని, ఇంటికి వెళ్లిన తర్వాత వాటిని పరిశుభ్ర పర్చాలన్నారు.  అనారోగ్యం ఉంటే వెంటనే సూపర్ వైజర్ కు తెలియజేయాలన్నారు. పనిచేయు ప్రదేశంలో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్స్ వినియోగించరాదని, షేక్ హేండ్ గాని, హత్తు కోవడం వంటి పనులు చేయరాదన్నారు.  కళ్లు, ముక్కు, నోటిని తాకరాదని, మీరు అనారోగ్యంగా ఉంటే పనికి వెళ్లరాదని, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే దగ్గరలో ఉండరాదని తెలిపారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్ వారు డ్యూటీలో ఉండే సమయంలో చల్లగా ఉండే జాకెట్ను ధరించాలని, ప్రజలకు, వాహనాలకు సామాజిక దూరం పాటించాలని,  తనిఖీచేసే సమయంలో డాక్యుమెంట్లను ముట్టుకోరాదని తెలిపారు.  ట్రాఫిక్ దగ్గర యవ్వనంలో ఉన్న పోలీస్ లను నియమించాలని, ఇంటికి వెళ్లిన వెంటనే దుస్తులను పరిశుభ్రపర్చుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్లు ఇంటి వద్దనే ఉండాలని,  పార్కులకు, జన సంచారం గల ప్రదేశాలకు, మార్కెట్ కు, మత సంబంధ ప్రదేశాలకు వెళ్లరాదన్నారు.    పిల్లలు తమ తల్లిద్రండుల ఆరోగ్యం ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.  ఆనారోగ్యం నకు గురైనట్లయితే వైద్యులను సంప్రదించాలని,  నిర్ణీత వేళల్లోనే భోజనం చేయాలన్నారు.   కరోనా వైరస్ నివారణ పద్దతులు తప్పనిసరిగా పాటించాలన్నారు.


పారిశుధ్య పనులలొ గణాంకాలను సాంకేతికంగా మెరుగుపర్చండి


పారిశుధ్య పనులలొ గణాంకాలను సాంకేతికంగా మెరుగుపర్చండి



జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన 



విశాఖపట్నం, పెన్ పవర్ :



 జివిఎంసి పరిధిలో జరుగుచున్న పారిశుద్ధ్య పనులు యొక్క గణాంకాలను, సాంకేతిక పద్దతులు ద్వారా చూ పెట్టాలని, అప్పుడే విశాఖనగరాభివృద్ధి సంస్థ చేస్తున్న పారిశుద్ధ్య కార్యకలాపాల ప్రగతి రాష్ట్రంలో కనబడుతుందని, కమిషనర్ పారిశు ధ్య విభాగపు అధికారులకు ఉద్బోదించారు. పారిశుద్ధ్య విభాగపు ఉన్నతాధికారులు అదనపు కమిషనర్, ముఖ్య ఆరోగ్య వైద్యశాఖాధికారి సమక్షంలో జోనల్ కమిషనర్లతోను, అసిస్టెంటు మెడికల్ ఆపీసర్లతోను శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా పారిశుద్ధ్య విభాగపు పనితీరు పై సమీక్ష నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ముఖ ఛాయ గుర్తింపు” (పేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) పద్ధతి ద్వారా పారిశుద్ధ్య కార్మికులు హాజరును చేపట్టాలని ప్రస్తుతం చాలా వార్డులలో ఈ విధానం ద్వారా హాజరును రాబట్టే శాతం తక్కువగా ఉందని గావున, రాబోయే వారంలో ఈ పద్ధతి ద్వారా హాజరు తీసుకోవడం 90 శాతం పైన పురోగతి సాధించాలని ఆదేశించారు. ఇండ్ల నుండి నేరుగా చెత్తను సేకరించే పద్ధతిని సాంకేతికంగా మధించడానికి ప్రవేశపెట్టిన “ఆన్లైన్ వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్” అనే పద్ధతిలో కూడా వెనుకబాటు తనం కనబడుచున్నదని గావున ఈ విధానంలో కూడా పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈ పనులు నిర్వర్తించడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకురావాలి గాని శానిటరీ ఇన్ స్పెక్టర్లకు సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే, తీవ్ర చర్యలు గైకొంటామని హెచ్చరించారు. వార్డు శానిటరీ కార్యదర్శులును, మైక్రోపాకెట్లు విధానానికి అనుసంధానం చేసి బాధ్యతలు అప్పచెప్పాలని, అప్పుడే తడి, పొడి చెత్త గృహాల వద్ద వేరు చేసి సేకరించడంలో పురోగతి సాధిస్తామన్నారు. వార్డు ఎమినిటీస్ కార్యదర్శికి ఆయా వార్డుల్లో తిరుగుచున్న పారిశుద్ధ్య వాహానాలు, పుష్ కార్డుల బాధ్యత అప్పజెప్పాలన్నారు. నగరంలోని వీధుల నుండి డంపింగ్ యార్డుకు తరలిస్తున్న డంపర్ బిన్ను యాప్ ద్వారా ప్రతీ రోజు చూపెట్టాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లకు సూచించారు. బహిరంగ మల మూత్ర విసర్జనలు చేసిన వారి పై, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసిన వారి పై, చెత్తను రోడ్డు పై పారబోసే గృహా, వాణిజ్య యజమానులు పై జరిమానాలు విస్తృతంగా విధించాలని, అప్పుడే ప్రజల్లో క్రమశిక్షణ వచ్చి, అంటురోగాలు ప్రబలుకుండా జాగ్రత్తపడతారని జోనల్ కమిషనర్లకు, ఎ.ఎం.ఓ. హెలకు తెలిపారు.  ఇటీవల వార్డు వాలంటీర్లు ఎంపికకు మౌఖిక పరీక్షలు పూర్తయినందున, వెంటనే ఎంపికయిన వారికి ఉత్తర్వులు మంజూరు చేయాలని అందరు జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సు సమావేశంలో అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు, సి.ఎం.ఓ. హెచ్ డా.కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్లు, అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


నిషేధిత ప్రాంతంలో పర్యటించిన జివిఎంసి ఉన్నతాధికారులు

 



 


 


నిషేధిత ప్రాంతంలో పర్యటించిన జివిఎంసి ఉన్నతాధికారులు


విశాఖపట్నం,పెన్ పవర్  :


జివిఎంసి పరిధిలో గల మూడవజోన్ 20వ వార్డు దిబ్బపాలెం చందకవీధి ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసు రావడంతో ఆ ప్రాంతం అంతయూ నిషేధిత ప్రాంతముగా ప్రకటించబడినది. దిబ్బపాలెం పరిసర ప్రాంతాల్లో వ్యాధి మరింత ప్రబలుకుండా తగు చర్యలు చేపట్టేందుకు జివిఎంసి అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు, సి.ఎం.ఓ. హెచ్ డా.కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, బయాలజిస్టు పైడిరాజు తో కలసి పర్యటన చేపట్టారు. ఇటీవల భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థ చెన్నై నుండి తీసుకువచ్చిన “బైల్ మిస్టర్' యంత్రం ద్వారా సోడియం హైడ్రో క్లోరైట్ రసాయన ద్రావణాన్ని ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా చల్లించారు. చిన్న చిన్న వీధి మార్గాల్లో చేతిపంపుల ద్వారా రసాయన ద్రావణాన్ని, బ్లీచింగ్ కలిపిన సున్నాన్ని కాలువల పై, చెత్తను వేసే బిన్స్ వద్ద చల్లించారు. అక్కడ ప్రజలుతో మాట్లాడుతూ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలు, ఆవాసాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే, కరోనా వ్యాధిపై ఎటువంటి భయాందోళనలు ఉండవని ప్రజలకు ఉద్బోదించారు.


 


 


 


 


 


 


 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...