Followers

ఐ. సి. డి.ఎస్ అంగన్ వాడి స్టాఫ్ కు కోవిడ్ వ్యాక్షిన్

ఐ. సి. డి.ఎస్ అంగన్ వాడి స్టాఫ్ కు కోవిడ్ వ్యాక్షిన్ 

వి. ఆర్. పురం. పెన్ పవర్

వి ఆర్ పురం మండలంలో ఉన్నా ఐ సి డి ఎస్ అంగన్ వాడికి సంబంధించినా టీచర్లకు,ఆయాలకు,శుక్రవారం రేఖపల్లి,మరియూ జిడిగుప్ప  పి హెచ్ సి కేంద్రాలలో  సుమారు వందమందికి కోవిడ్ వ్యాక్షిన్ లను చేసారు. ఈ కోవేక్షన్ అనేది ఇంతకముందు కోవిషిల్డ్ ఏక్షన్ వేయించుకున్నా వారికి మాత్రమే చేస్తాము అంటూ, ఈ వేక్షన్ వేయించుకున్నావారు ఇరవై ఎనిమిది రోజులు తరువాత మరల రెండోవ సారి ఇదే వేక్షన్ వేయించుకోవాలి.ఈ విధముగా మండలంలో ఉన్న రివెన్యూ,యండిఓ, పోలీసుశాఖ, ఫారెస్ట్ ,ఇలా అన్ని డిపార్ట్మెంట్ లకు ఈ వేక్షన్ తప్పనిసరిగా వేస్తాము అని రేఖపల్లి పి హెచ్ సి అధికారి డాక్టర్ సందీప్ నాయుడు మీడియాకు తెలిపారు . ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ శ్రీనివాస్ రావు,అంగన్ వాడి సి డి పి ఓ  శంషాద్ బేగం,ఏ ఎన్ యం లు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల సందర్భంగా ర్యాలీ గ్రామ వీధుల్లో పోలీసులు కవాతు

 ఎన్నికల సందర్భంగా ర్యాలీ  గ్రామ వీధుల్లో పోలీసులు కవాతు 



ఆత్రేయపురం, పెన్ పవర్ 

 ఆత్రేయపురం మండలంర్యాలీ  గ్రామంలో  21 న  జరగబోయే స్థానిక ఎన్నికలునాలుగో దశ కావడంతో స్థానిక నాయకులు ఎవరికి వారే ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు ఈ నేపథ్యంలో ఆత్రేయపురం మండలం లో అతి పెద్ద గ్రామం పంచాయతీ అయినా ర్యాలీ  లో శాంతి భద్రత దృశ్య  ఆత్రేయపురం ఎస్ ఐ   జి.నరేష్  నేతృత్వంలో 100 మంది పోలీసు బలగాలతో శాలిగ్రామం మెయిన్ రోడ్డు అయినా జగన్మోహిని కేశవ స్వామి ఆలయం నుండి పోలీసులు కవాతు నిర్వహించారు  అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ముందస్తు చర్యగా ప్రజల అందరికీ అవగాహన కల్పించే విధంగా ఈ కవాతు నిర్వహించామని ఎస్సై నరేష్ పేర్కొన్నారు

తూర్పులంక సర్పంచ్ అభ్యర్థి కడలి గంగాచలం ప్రచార జోరు

తూర్పులంక సర్పంచ్ అభ్యర్థి కడలి గంగాచలం  ప్రచార జోరు



అల్లవరం, పెన్ పవర్

  మండలంలో  తూర్పులంక గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా కడలి గంగాచలం   ప్రచారం  జోరుగా  నిర్వహిస్తున్నారు. ఎలక్షన్లలో ఈసారి  ఒక అవకాశాన్ని గ్రామ ప్రజలు  ఇస్తే  గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తానని వారు తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి ప్రధానంగా త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తానని అలాగే సిసి రోడ్లు తీసుకు వస్తామనీ కడలి గంగా చలం  ప్రజలకు హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రచారంలో భాగంగా ఉదయం తూర్పులంక  ఇంటింటికి తిరిగి  ప్రచారం చేసారు. సర్పంచ్ అభ్యర్థి   కడలి గంగా చలం  ఇంటికి వెళ్లి కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ ప్రచార  కార్యక్రమంలో గ్రామ ప్రజలు అభిమానులు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మోతుగూడెంలో ప్రతి ఇంటింటికి రేషన్

 మోతుగూడెంలో ప్రతి ఇంటింటికి రేషన్



మోతుగూడెం, పెన్ పవర్:

చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో శుక్రవారం ఇంటింటికి రేషన్ ప్రారంభమైనది ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలు లో భాగంగా ఇంటికి రేషన్ ఇచ్చే కార్యక్రమం ఫిబ్రవరి నెల నుండి ప్రారంభించాలి అనుకున్నా స్థానిక ఎన్నికలు కావడంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఈ పంపిని కార్యక్రమం ఆగిపోయింది, ప్రభుత్వం ప్రజలకు అందే నిత్యవసర వస్తువులు ఉన్నందున హైకోర్టు నుండి అనుమతి రావడంతో రేషన్ పంపిని కార్యక్రమం ఈ రోజు నుండి ప్రారంభించారు,గ్రామంలో ఇంటింటికీ రేషన్ బియ్యం ఇవ్వడం జరిగినది

ఇంటింటికి రేషన్ బియ్యం

 ఇంటింటికి రేషన్ బియ్యం



 ఆత్రేయపురం,  పెన్ పవర్

 ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఇంటింటికి రేషన్ బియ్యం ప్రారంభమైనది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలు లో భాగంగా ఇంటికి  రేషన్ బియ్యం ఇచ్చే ప్రక్రియను ఈ  ఫిబ్రవరి 1 నుండి ప్రారంభించాలి అనుకున్నా స్థానిక ఎన్నికలు కావడంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంవల్ల వాహనాలకు పార్టీ రంగులు ఉండడంతో ఎస్ ఇ  సి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామాలలో ఆ వాహనాలను తిపకూడదని చెప్పడంతో ఇంటింటికి రేషన్  బియ్యం పంపిణీ ఆగినది ప్రభుత్వం ప్రజలకు అందే నిత్యవసర వస్తువులు కాబట్టి హైకోర్టు  స్టే వేయగా ఆ కేసును కొట్టివేసింది  ఆ వాహనం పైన ఉన్న రాజకీయ నాయకులకు బొమ్మలను తొలగించి ఇంటింటికి రేషన్ సప్లై చేయమని ఎస్  ఇ సి ఎన్నికల అధికారి ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది   ఎన్నికల కోడు అతిక్రమించు కుండా ప్రజలకు ఇంటింటికీ రేషన్ బియ్యం ఇవ్వడం జరిగినది

ఎన్నికల నేపథ్యంలో సాయుధ బలగాలతో పోలీసు కవాతు

 ఎన్నికల నేపథ్యంలో సాయుధ బలగాలతో పోలీసు కవాతు



పెన్ పవర్, రావులపాలెం

నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రావులపాలెం మండలంలో ఈనెల 21వ తేదీన ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు శుక్రవారం అదనపు పోలీసు బలగాలతో గ్రామాల్లో కవాతు నిర్వహించారు.  అడిషనల్ డీఎస్సీ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో మండలంలోని లక్ష్మీ పోలవరం, ఈతకోట, పొడగట్లపల్లి, దేవరపల్లి, గోపాలపురం, కొమరాజులంక సాయుధ బలగాలతో కవాతు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పి.బుజ్జిబాబు, అదనపు ఎస్సై బెన్నిరాజు తదితరులు పాల్గొన్నారు.

గోవింద మాల దీక్ష స్వీకరించిన భక్తులు

 గోవింద మాల దీక్ష స్వీకరించిన భక్తులు




 ఆత్రేయపురం, పెన్ పవర్

 ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి యున్న శ్రీ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి అలివేలు పద్మావతి సమేత స్వయంభు వెంకటేశ్వర స్వామి సన్నిధానం లో ఈరోజు 40 మంది భక్తులు ఖండవల్లి సాయి రామకృష్ణ గురువు సమక్షంలో గోవింద నామాలతో గోవింద మాల దీక్ష స్వీకరించారు వీరికి దేవస్థానం తరఫునుండి నూతన వస్త్రాలు దీక్ష మాలలు ఆ స్వాములకు అల్పాహారము భోజనము సదుపాయము దేవస్థానం తరఫునుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది గోవింద మాల దీక్ష తీసుకున్న భక్తులందరికీ ఆలయ కార్యనిర్వహణాధికారి వారి నూతన వస్త్రాలు అందించారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...