Followers

పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన..

 పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన..              

బెల్లంపల్లి రూరల్ , పెన్ పవర్

దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నీరసనగ శుక్రవారం సింటా, ఆల్ ఇండియా ట్రాన్స్ పోర్ట్ బందులో భాగంగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్నాల ఫ్లై ఓవర్ నుండి కాల్ టెక్స్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిరాజోద్దీన్ మాట్లాడుతూ పెంచిన పెట్రోల్,డీజిల్ రేట్లను తగ్గించాలని,పెట్రోల్,డీజిల్ ను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని,స్క్రాప్ట్ పాలసీని అమలు చేయాలని,థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని,గ్రీన్ టాక్స్ వసూలు నిర్ణయాన్ని విరమించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి సందీప్,పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన.......                    

బెల్లంపల్లి రూరల్ /పెన్ పవర్...

దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నీరసనగ శుక్రవారం సింటా, ఆల్ ఇండియా ట్రాన్స్ పోర్ట్ బందులో భాగంగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్నాల ఫ్లై ఓవర్ నుండి కాల్ టెక్స్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిరాజోద్దీన్ మాట్లాడుతూ పెంచిన పెట్రోల్,డీజిల్ రేట్లను తగ్గించాలని,పెట్రోల్,డీజిల్ ను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని,స్క్రాప్ట్ పాలసీని అమలు చేయాలని,థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని,గ్రీన్ టాక్స్ వసూలు నిర్ణయాన్ని విరమించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి సందీప్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్,కమిటీ నాయకులు ఎండి ఎజాజ్, అప్జల్, సలీమ్,ముజాంబిల్,రాజు,తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షులు శ్రీనివాస్,కమిటీ నాయకులు ఎండి ఎజాజ్, అప్జల్, సలీమ్,ముజాంబిల్,రాజు,తదితరులు పాల్గొన్నారు.

టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం 32 వ వార్డులో విజయవంతం...

 టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం 32 వ వార్డులో విజయవంతం...



బెల్లంపల్లి ,  పెన్ పవర్ 

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని 32వ వార్డు కౌన్సిలర్ నీలి. కృష్ణ ఆధ్వర్యం పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కనులపండువగా విజయవంతం చేశారు. శుక్రవారం పూర్తి చేసిన టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం బుక్కులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు ఇచ్చి, టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వార్డ్ ప్రజలకు, సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన, ప్రతి ఒక్కరికి వార్డు కౌన్సిలర్ కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు 32 వార్డు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాల ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే చిన్నయ్య

 ఆశ్రమ పాఠశాల ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే చిన్నయ్య


బెల్లంపల్లి రూరల్, పెన్ పవర్

 కాసిపేట మండలంలోని రేగులగూడెం గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆకస్మిక తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్బంగా వారు తరగతి గదులలో కరోనా నిబంధనలను పాటించి,విద్యాబోధన చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీ , వైస్ ఎంపీపీ విక్రమ్, జడ్పీటీసీ చంద్రయ్య , మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి , మండల సర్పంచ్లు ఆడే జంగు,శ్రీనివాస్,ఎంపీటీసీలు,తెరాస నాయకులు,మాజీ జడ్పిటిసి సత్తయ్య,పొశం, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

మండల కేంద్రంలో సీఐటీయూ, గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో రహదారి పై రాస్తారోకో

మండల కేంద్రంలో సీఐటీయూ, గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో రహదారి పై రాస్తారోకో









 గూడెం కోత్తవీధి పెన్ పవర్

62 మంది శాసనసభ్యులు, 8 మంది ఎంపీలు రాజీనామా చేయటంతో పాటు 32 మంది ప్రాణత్యాగాలు ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంను ప్రైవేటీకరణ కానివ్వదంటూ సిఐటియు అధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు,ఈ కార్యక్రమంలో మండల సీఐటీయూ కార్యదర్శి అంపురింగి బుజ్జిబాబు మాట్లాడుతూ 62 గ్రామాల నిర్వాసితులు నుండి 22 వేల ఎకరాల భూమిని సేకరించి ఏర్పాటు చేసిన ఉక్కు కర్మాగారం ను కేంద్రంలో పాలక పార్టీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు కుట్రలు చేస్తుందని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెచ్చుకున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులుపరంకాకుడా కాపాడుకుందామన్నారు, గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ మెంబర్ సలిమితి సాంతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట‌‌‌ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేదవారికి, మధ్యతరగతి కుటుంబాల పై పెను భారం మోపిందన్నారు, ప్రభుత్వం రంగ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడం, నిత్యావసర సరుకుల పై ధరలు విపరీతంగా పెంచినా ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కించుకుందనిన్నారు, వ్యవసాయానికి కూడా ప్రైవేటు చేయడానికి మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకుని వచ్చి ఆదాని, అంబానీలకు కట్టబెలని చూస్తుందని, ఉక్కు కర్మాగారంను ప్రభుత్వం రంగంలో నడిపించాలని ఆమె డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో రహదారి పై రాస్తారోకో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు లోత కన్నబాబు, మండల ఆర, ఎం, పి సంఘం అధ్యక్షుడు గోపి, మండల పిటిజి సంఘం అధ్యక్షుడు వంతల చంటి, మండల వాలంటీర్లు సంఘం అధ్యక్షుడు దుచ్చరి కోటి, మండల ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రంలో గోడకూలి బాలుడు మృతి...

 అంగన్వాడీ కేంద్రంలో గోడకూలి బాలుడు మృతి...



పెన్ పవర్ బ్యూరో (విశాఖపట్నం)..

 అంగన్వాడి కేంద్రానికి వెళ్లిన ఓ చిన్నారి పై గోడకూలి మృతి చెందాడు. ఈ వార్త తెలిసిన వెంటనే తల్లితండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. ముద్దులొలికే కించే చిన్నారి ఇక లేడని తెలిసి తల్లి కన్నీరు మున్నీరై కల్పిస్తుంది. వివరాల్లోకి వెళితే  జిల్లాలోని నర్సీపట్నం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని రోలుగుంట మండలం ఎన్.కొత్తూరులో  శుక్ర వారం ఉదయం  సాయి అనే  మూడేళ్ల చిన్నారిని  తల్లిదండ్రులు స్థానిక అంగన్వాడీ కేంద్రానికి పంపించారు. అంగన్వాడీ టీచర్ పిల్లలను గదిలో కూర్చోబెట్టి విధులు నిర్వహిస్తుండగా ప్రమాదు వశాత్తూ గోడ  కూలిపోయింది. శిధిలాలు బాలుడి పై పడడంతో గాయాలై మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న నర్సీపట్నం ఐసిడిఎస్  అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. రోలుగుంట పోలీసులు  సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ మెసేజ్ లు..

 సోషల్ మీడియాలో వస్తున్న  ఫేక్ మెసేజ్ లు..




 అయోమయంలో నలిగి పోతున్న జనం..

 బాధ్యులపై కనిపించని  చర్యలు

పెన్ పవర్ బ్యూరో -(విశాఖపట్నం)

 సోషల్ మీడియాను శోధించడం  ప్రజలకు నిత్యకృత్యంగా మారిపోయింది. తెల్లవారింది మొదలు అర్థ రాత్రి వరకు  సెల్ ఫోన్ తో  కాలం వెళ్లదీస్తున్నారు. వింతలు విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం పరిపాటిగా మారింది. కానీ  సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు ప్రజలను కంగారు పెట్టిస్తున్న సంఘటనలు లేకపోలేదు. అదిగో పులి ఇదిగో తోక అన్న చందంగా  తప్పుడు సమాచారాన్ని విడుదల చేస్తున్నారు. అవి నిజమో కాదో అన్న సందిగ్ధంలో ప్రజలు తెలుసు కోలేక పోతున్నారు. ఎక్కడో కూలిన ఫ్లైఓవర్ ను  హైదరాబాదులో  కూలి కార్లు ధ్వంసమయ్యాయి అని  సోషల్ మీడియాలో వచ్చింది. ఇది నిజమా అని  ఆ ప్రాంతానికి  చెందినవారు సంబంధించిన వారు  హడలి పోక తప్పలేదు. తీరా చూస్తే అది ఎక్కడోజరిగింది.  కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో ఏపీ ప్రభుత్వం  పాఠశాలలు  కళాశాలలకు  మార్చి 1 నుంచి మే 4వ తేదీ వరకు సెలవు ప్రకటించిందని. ఈ మేరకు ఆయా విద్యా సంస్థలకు ఉత్తర్వులు జారీ చేశారని సోషల్ మీడియాలో  వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించి  విద్యా శాఖ మంత్రి  జారీచేసిన పత్రాన్ని వాట్సాప్ లో  షేర్ చేశారు. ఈ సమాచారం చూసిన ప్రతి ఒక్కరూ నిజంగా  కరోనా తీవ్రత  పెరిగిందా? ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించిందా?అన్న సందిగ్దతలో  పడ్డారు. లాక్ డౌన్ నేపద్యంలో కోవిడ్ 19  నిబంధనల ప్రకారం ఇటీవలే అంచలంచలుగా పాఠశాలలు కళాశాలలు తెరిచిన విషయం తెలిసిందే. ఇంతలో ఈ మెసేజ్ లు రావడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇది నిజం కాదని నిర్ధారించు కోవడానికి  సంప్రదింపులు చేయక తప్పలేదు. ఇలా రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక  ఉత్కంఠ కలిగించే  సమాచారాన్ని విడుదల చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ అధికారులను సైతం తప్పుదోవ పట్టించే  మెసేజ్ లు వెలువడుతున్నాయి అంటే ఆశ్చర్యం కలుగుతుంది. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా పరోక్షంగా ఎవరినీ కించపరిచిన  తప్పుడు సమాచారం  వైరల్ చేసిన వారిపై కఠినంగా  చర్యలు తీసుకునే ఆంక్షలు ఉన్నాయి. కాని  ఆకతాయిలు  చేసే మెసేజ్ లు  ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఒక గ్రామంలో  దెయ్యం సంచరిస్తుంది.  ప్రజల రక్తాన్ని  తాగిస్తుంది  అన్న ప్రకటన సోషల్ మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. ఇలా చెప్పుకొని పోతుంటే  లెక్కలేని ఫేక్ మెసేజ్ లు వస్తున్నాయి. వాటిని అరికట్టించాల్సిన  అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ లను అరికట్టాలని   మేధావులు  ప్రజా  సంఘాలు కోరుతున్నాయి..

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా సిపిఎం ధర్నా.

 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా సిపిఎం ధర్నా..




దేవరాపల్లి - పెన్ పవర్...


స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వెంటనే ఆపాలని రైతువ్యతి రేఖాచట్టాలను రద్దు చేయాలని పెంచిన పోట్రోలు డీజిల్ గ్యాస్ ధరలును వెంటనే ఆపాలని సిపిఎం పార్టీ అద్వర్యంలో దేవరాపల్లి నాలుగు రోడ్లు జంక్షన్ లో శుక్రవారం పెద్ద ఎత్తున నిర్సన తెలిపారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. డి,వెంకన్న మండల కార్యదర్శి సిహెచ్ రాజు మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోడీ రెండవ సారి అధికారం లోకి వచ్చిన తరువాత ప్రజలు జీవన పరిస్తితులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు దేశంలో ఇంతటి దౌర్బగ్యపు పరిస్తుతులు ఎప్పుడు రాలేదని అన్నారు 15 రోజులు పాటు రోజు పెట్రోలు డీజల్ ధరలు పెరగడం ప్రజల్లో ఆందోళన మొదలు అవ్వగా 54 రోజుల్లో 25 సార్లు పెరడం గమనార్హం ర్గమన్నారు ధరలు పెరుదల వలన వాహణ దార్లుకు ధరలు బారం పెరిగి పోవడంతో రావాణాచార్జి లు నిత్యవసర వస్తువులు ధరలు వీపరితంగా పెరిపోతున్నాయని తెలిపారు సంక్షేమ పథకాలు స్కీములు పేరుతో  రాష్ట్రంలోను దేశంలో ప్రజలు ద్రుష్టిని అటువైపు మళ్ళీంచి పాలకులు ధరలు పెంచుకుంటూ  పోతున్నారని ప్రజలు ఇది గ్రహించకుండ సంక్షేమ పథకాలు స్కీములు మోజులో పడి పాలకులు సేష్టలు ప్రజలు గ్రహించడం లేదని తెలిపారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగుదల వలన నిత్యావసర వస్తువులు ధరలు రోజుకోలాగ పెరిపోతున్నాయని అన్నారు పేద మద్యతరగతి ప్రజలు రోజు కూలీలు తెచ్చుకున్నవారి కూలీలు యెక్క పరిస్థితి మరి దారునమన్నారు ఇటువంటి దుష్ట పాలన అంతమొందిచ్చడానికి ప్రజలు చైతన్య వంతులై ఆందోళనలు చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షం లో ఉన్నప్పుడు అసెంబ్లీ లోపల బైట గోంతుచించ్చుకోని అరుస్తారని అదికారంలోకి వచ్చిన తరువాత నోరు మేదపడం లెదన్నారు దీనివలన ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేయలేని పరిస్థితిలో ఉన్నారని న్నారు ప్రభుత్వ రంగసంస్థ లు అన్ని ప్రవేటీకరణ చేయక తప్పదని దేశప్రదాని నిసుగ్గుగాప్రకటించడం దుర్మార్గపు చర్య అని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా 16 రోజులు నుండి ఆందోళన చేస్తున్న కేంధ్రప్రభుత్వం పట్టించుకోకుండా మరోప్రక్క ప్రవేటీకరణ తప్పదని చేప్పడం కార్మిక వర్గాన్ని రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేసిందని అన్నారు  దీనిపై పాలకులకు తగిన గునపాఠం చేప్పాలని పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ప్రభుత్వ రంగస్థలు ప్రవేటీకరణ నుఅపాలని డిమాండ్ చేసారు ,ఈకార్యక్రమంలో కె అప్పన్న మామిడి దేముడు జె ఈశ్వరావు పి అప్పలరాజు సిహెచ్ దేముడు ఇరట ఈశ్వరావు వెంకటమణ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...