Followers

కిరాణా షాప్ లలో తనిఖీలు 


కిరాణా షాప్ లలో తనిఖీలు 

 

కిర్లంపూడి, పెన్ పవర్

 

 మండలం లోని

చిల్లంగి ,కిర్లంపూడి లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు తూనికలు, కొలతల శాఖ  అధి కారులు కిర్లంపూడి ,చిల్లంగి గ్రామాల్లో లో గురువారం ఉదయం పలు

 కిరాణా షాప్ లలో తనిఖీలు నిర్వహించారు. షాపుల్లో  అధికారులు పలు వస్తువులు పరిశీలించి ప్రభుత్వం ధర నిర్ణయం మేరకు అమ్మ కపు ధర, తేదీ, ఉందో లేదో అని  పరిశీలించారు. మరియు ప్రతి వస్తువు పైన కావలసిన డీటెయిల్స్ ఉందా లేదా అని పరిశీలించారు .ఈ దాడుల్లో బియ్యం బస్తాలు, టి పొడి, నెయ్యి ప్యాకెట్లపై అమ్మకం ధర తో పాటు కన్జ్యూమర్ డీటెయిల్స్ లేకపోవడంతో మరియు తయారు తేదీ లేకపోవడంతో తేడాలు గుర్తించామని, అలాగే కన్జ్యూమర్ డీటెయిల్స్ ఉండాలని తుని తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ జి .వెంకట ప్రసాద్ తెలిపారు .ఈ దాడుల్లో మూడు కేసులు నమోదు చేశామని బియ్యం, నెయ్యి, టీ పొడి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడుల్లో తమతో పాటు రాజమహేంద్రవరం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి టి. డి రత్న కుమార్, తాసిల్దార్ కె ,విజయ్ కుమార్ ,సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...