Followers

రైతు భరోసా పథకం కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజన్న దొర


రైతు భరోసా పథకం కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజన్న దొర



మెంటాడ, పెన్ పవర్:


 డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కరపత్రాన్ని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర శుక్రవారం శనివారము తమ నివాసంలో  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మెంటాడ మండలం మండల వ్యవసాయ అధికారి మల్లికార్జున రావు మాట్లాడుతూ మెంటాడ మండలంలో వ్యవసాయ శాఖ ద్వారా చేపడుతున్న విత్తన సరఫరా, రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు మంజూరైన నిధులు, ఖరీఫ్ పంటలకు సంబంధించి ప్రణాళికలను తయారుచేసి జిల్లా అధికారులకు నివేదికను పంపించినట్లు ఏ.వో. మల్లికార్జున రావు ఎమ్మెల్యే రాజన్నదొర కు వివరించారు. ఖరీఫ్ కు అవసరమైన వరి విత్తనాలు, ఎరువులు ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యే రాజన్న దొర వ్యవసాయ అధికారి మల్లికార్జున రావు కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెంటాడ ఎంపీడీవో భానుమూర్తి, సాలూరు వ్యవసాయ అధికారి తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...