Followers

త్వరలో జిల్లా కేంద్రాలకు రైట్ రైట్..


త్వరలో జిల్లా కేంద్రాలకు రైట్ రైట్..



భౌతిక దూరంతో   సిద్దం అవుతున్న బస్సులు.



స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవన్) 


త్వరలో  జిల్లా కేంద్రాలకు  బస్సు సర్వీసులను  పునరుద్ధరించేందుకు  రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  ఏర్పాట్లు చేస్తుంది.కోవిడ్_19  ఆంక్షలు  నిబంధనలు  పాటిస్తూ  ప్రజా రవాణాకు  బస్సులు  నడపాలని  నిర్ణయించుకుంది. కరోనా లాక్ డౌన్  నేపథ్యంలో  రవాణా  స్తంభించిపోయింది. ఒకవైపు కరోనా   మహమ్మారి  విలయ తాండవం ఆడుతుంది. ప్రజలను కట్టడి చేస్తూ  అంచలంచలుగా  రవాణా వ్యవస్థను  నడపాలని  ప్రభుత్వం చర్యలు  చేపట్టింది. మొదటి దశలో  జిల్లా కేంద్రాలకు  పరిమితి స్టాఫ్ లతో  ఆల్ట్రా డీలక్స్  శమీ లగ్జరీ సర్వీసులను  నడపనున్నారు   ఆర్టీసీ  బస్సులో కరోనా  నిబంధనలు   అమలు చేసేందుకు  ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మునుపటి వలె  బస్సు రాగానే   గొఱ్ఱెల మందల  ఎక్కి పోవటానికి వీలులేదు. కౌంటర్ లో టికెట్లు తీసుకుని  ఎవరి సీట్లో వారు కూర్చోవడానికి  వీలు కల్పిస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో మూడు వరుసల సింగిల్ సీట్లను ఏర్పాట్లు జరుగుతున్నాయి . ఆల్ట్రా  డీలక్స్  లో మూడు సీట్లలో మధ్య సీట్లను నిర్వహిస్తున్నారు ఇద్దరు సీట్లలో ఒక సీటు కె అవకాశం ఇస్తున్నారు. కూర్చునే సీట్లకు నంబర్లు వేస్తున్నారు  మినహాయించిన వాటికి   ఇంటూ మార్క్ వేస్తున్నారు.  ప్రభుత్వం   గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే   జిల్లా కేంద్రాలకు  ఆర్టీసీ సర్వీసులు  ప్రారంభం కానున్నాయి.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...