Followers

ఒకేసారి ఆస్తి పన్ను చెల్లిస్తే  ఐదు శాతం మినహాయింపు



స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్) 



నగరంలో  ఏడాది  ఆస్తి పన్ను  ఒకేసారి  చెల్లిస్తే  ఐదు శాతం  మినహాయింపు  ఇస్తామని  జివిఎంసి కమిషనర్  సృజన  అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్  నేపద్యంలో  ఆస్తిపన్ను దారులకు   వెసులుబాటు కల్పించాలని  నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విశాఖ  జీవీఎంసీ  పరిధిలో 2020_ 21  ఆర్థిక సంవత్సరానికి గాను  ఆస్తిపన్ను దారులకు  ఏడాది మొత్తం  పన్ను  ఒకేసారి చెల్లించిన వారికి  ఐదు శాతం  తగ్గింపు  కల్పిస్తామని  ఆమె అన్నారు. నగరంలో  పారిశుధ్యం  త్రాగునీరు పై   ప్రత్యేక చేపడుతున్నామని  ఆమె తెలిపారు. పాలిమర్స్ విషవాయువు   ప్రభావిత ప్రాంతాల్లో  సర్వే నిర్వహిస్తున్నామని  సర్వే పూర్తి అయిన తర్వాత  ప్రభుత్వం ప్రకటించిన  పరిహారం  బాధితులకు అందజేస్తామని  సృజన ఒక ప్రకటనలో తెలియజేశారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...