Followers

ముందుగానే రాష్ట్రంలోవైఎస్ఆర్ రైతు భరోసా - పియం కిసాన్ పథకం

వైఎస్ఆర్ రైతు భరోసా - పియం కిసాన్ పథకం ద్వారా ఖరీఫ్ సీజన్ ముందుగానే రాష్ట్రంలో 49 లక్షల 43 వేల కుటుంబాలకు 7500 రూపాయలు చొప్పున మొత్తం 3707 కోట్ల 69 లక్షల రూపాయలు ఈ నెల 15వ తేది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేయనున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం మంత్రి రమణయ్య పేట ఆయన క్యాంప్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కన్న బాబు మాట్లాడుతూ గత సంవత్సరం రైతు భరోసా పథకాన్ని ప్రారంబించి అర్హులైన ఒక్కోక్క రైతు ఖాతాలో నేరుగా 13500 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ఈ నెల 15 వ తేదిన రెండోవ విడుత విడుదల చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా - పియం కిసాన్ పథకం ద్వారా జిల్లా గత సంవత్సరం 4 లక్ష 12 వేల రైతు కుటుంబాలకు 311.52 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 4 లక్షల 29 వేల కుటుంబాలకు 322 ల కోట్ల 25 లక్షల రూపాయలు జమ చేయడం జరుతుందని మంత్రి తెలిపారు. జిల్లాలో ఈ సంవత్సరం 17391 కుటుంబాలకు రైతు భరోసా లబ్ధి చేకుర్చేల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆర్థికంగా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యం తోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టామన్నారు. గత సంవత్సరం మాదిరి గానే ఈ సంవత్సరం కూడ కౌలు రైతులకు రైతు భరోసా అందుతుందని మంత్రి కన్న బాబు తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...